Political News

విజ్ఞుడైన ప‌ద్మ‌నాభం.. ప‌రువు పోతోంది.. గుర్తించారా?

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, వైసీపీ నేత ముద్రగ‌డ పద్మ‌నాభం.. చాలా రోజుల త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. రాష్ట్రంలో అరాచ‌కం జరుగుతోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. భావప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు ఉరి వేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అమాయ‌కుల‌ను తీసుకువెళ్లి పోలీసు స్టేష‌న్ల‌లో పెట్టి చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తున్నార‌ని కూడా వాపోయారు. ఇంత వర‌కు బాగానే ఉంది. ఆయ‌న విజ్ఞుడైన ప‌ద్మ‌నాభం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాను నిజానికి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయాల‌ని అనుకుంటే.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మార‌ణ‌హోమం గురించి కూడా చెప్పి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు. అంతేకాదు.. అప్ప‌ట్లో జ‌రిగిన‌వ‌న్నీ బాగున్నాయ న్నట్టుగా ఆయ‌న తీర్మానం చేయ‌డం ద్వారా ఆయ‌న త‌న ప‌రువును తానే తీసుకుంటున్న‌ట్టుగా ఉంద‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను నిర్దాక్షిణ్యంగా న‌డిరోడ్డుపై ఆనాడు.. పెడ రెక్క‌లు విరిచి క‌ట్టి మ‌రీ స్టేష‌న్‌కు త‌ర‌లించిన‌ప్పుడు ముద్ర గ‌డ ఏమ‌య్యారు? అనేది వారు సంధిస్తున్న ప్ర‌శ్న‌.

అదేవిధంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు ఫార్వ‌ర్డ్ చేశార‌న్న కార‌ణంగా 80 ఏళ్ల వృద్ధుల నుంచి 20 ఏళ్ల యువ‌కుల వ‌ర‌కు వైసీపీ పాల‌న‌లో అర్ధ‌రాత్రి వేళ అరెస్టులు చేసిన‌ప్పుడు ముద్ర‌గడ ఎందుకు మాట్లాడ లేక పోయార‌ని కూడా అడుగుతున్నారు. అప్ప‌ట్లో మౌనంగా ఉంది.. స‌మ‌ర్థించిన ముద్ర‌గ‌డ‌కు.. ఇప్పుడు ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు. గ‌తంలో త‌న కుటుంబాన్ని కూడా.. ఇలానే సోష‌ల్ మీడియాలో ఆడిపోసుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ముద్ర‌గ‌డ‌.. ఇప్పుడు మాత్రం స‌మ‌ర్థించ‌డం దారుణంగా ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి స‌మాజంలో అంతో ఇంతో ప్ర‌భావం ఉన్న ముద్ర‌గ‌డ వంటివారు.. రెండు ప‌క్షాల త‌ర‌ఫున మాట్లాడి తే బాగుంటుంద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. అలా కాకుండా.. ఒక‌వైపే చూస్తామంటే.. ఎలా? అనేది కూడా వారు సంధిస్తున్న మ‌రో ప్ర‌శ్న‌. ప‌రువు పోగొట్టుకోవ‌డం త‌ప్ప‌.. ముద్ర‌గడ‌కు మ‌రో ప్ర‌యో జ‌నం ఉండ‌ద‌ని.. ఇప్ప‌టికే పేరు మార్పు.. కుమార్తె పార్టీ మార్పుతో స‌గం ప‌రువు పోయిన ముద్రగ‌డ‌.. కాపుల్లోనూ ప‌లుచ‌న అయిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

This post was last modified on November 15, 2024 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

20 minutes ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

1 hour ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

3 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

3 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

4 hours ago

రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…

5 hours ago