Political News

విజ్ఞుడైన ప‌ద్మ‌నాభం.. ప‌రువు పోతోంది.. గుర్తించారా?

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, వైసీపీ నేత ముద్రగ‌డ పద్మ‌నాభం.. చాలా రోజుల త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. రాష్ట్రంలో అరాచ‌కం జరుగుతోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. భావప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు ఉరి వేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అమాయ‌కుల‌ను తీసుకువెళ్లి పోలీసు స్టేష‌న్ల‌లో పెట్టి చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తున్నార‌ని కూడా వాపోయారు. ఇంత వర‌కు బాగానే ఉంది. ఆయ‌న విజ్ఞుడైన ప‌ద్మ‌నాభం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాను నిజానికి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయాల‌ని అనుకుంటే.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మార‌ణ‌హోమం గురించి కూడా చెప్పి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు. అంతేకాదు.. అప్ప‌ట్లో జ‌రిగిన‌వ‌న్నీ బాగున్నాయ న్నట్టుగా ఆయ‌న తీర్మానం చేయ‌డం ద్వారా ఆయ‌న త‌న ప‌రువును తానే తీసుకుంటున్న‌ట్టుగా ఉంద‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను నిర్దాక్షిణ్యంగా న‌డిరోడ్డుపై ఆనాడు.. పెడ రెక్క‌లు విరిచి క‌ట్టి మ‌రీ స్టేష‌న్‌కు త‌ర‌లించిన‌ప్పుడు ముద్ర గ‌డ ఏమ‌య్యారు? అనేది వారు సంధిస్తున్న ప్ర‌శ్న‌.

అదేవిధంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు ఫార్వ‌ర్డ్ చేశార‌న్న కార‌ణంగా 80 ఏళ్ల వృద్ధుల నుంచి 20 ఏళ్ల యువ‌కుల వ‌ర‌కు వైసీపీ పాల‌న‌లో అర్ధ‌రాత్రి వేళ అరెస్టులు చేసిన‌ప్పుడు ముద్ర‌గడ ఎందుకు మాట్లాడ లేక పోయార‌ని కూడా అడుగుతున్నారు. అప్ప‌ట్లో మౌనంగా ఉంది.. స‌మ‌ర్థించిన ముద్ర‌గ‌డ‌కు.. ఇప్పుడు ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు. గ‌తంలో త‌న కుటుంబాన్ని కూడా.. ఇలానే సోష‌ల్ మీడియాలో ఆడిపోసుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ముద్ర‌గ‌డ‌.. ఇప్పుడు మాత్రం స‌మ‌ర్థించ‌డం దారుణంగా ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి స‌మాజంలో అంతో ఇంతో ప్ర‌భావం ఉన్న ముద్ర‌గ‌డ వంటివారు.. రెండు ప‌క్షాల త‌ర‌ఫున మాట్లాడి తే బాగుంటుంద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. అలా కాకుండా.. ఒక‌వైపే చూస్తామంటే.. ఎలా? అనేది కూడా వారు సంధిస్తున్న మ‌రో ప్ర‌శ్న‌. ప‌రువు పోగొట్టుకోవ‌డం త‌ప్ప‌.. ముద్ర‌గడ‌కు మ‌రో ప్ర‌యో జ‌నం ఉండ‌ద‌ని.. ఇప్ప‌టికే పేరు మార్పు.. కుమార్తె పార్టీ మార్పుతో స‌గం ప‌రువు పోయిన ముద్రగ‌డ‌.. కాపుల్లోనూ ప‌లుచ‌న అయిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

This post was last modified on November 15, 2024 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

12 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

32 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago