Political News

జగన్ లాగా టీచర్లతో బాత్రూమ్ పనులు చేయించం

వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు వాడున్నారని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులలో చాలామంది కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల విధులపై విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేస్తామని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను బాత్రూమ్ ల నిర్వహణ వంటి విధులు అప్పగించిందని లోకేష్ అన్నారు. ఉపాధ్యాయుల విధులపై జీవో 117కు ప్రత్యామ్నయాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులతో చర్చలకు తలుపులు మూసేయడం లేదని, ప్రతి శుక్రవారం 11 నుంచి 3గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోడానికి కేటాయించారరి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై పెట్టిన కేసులన్ని తొలగిస్తామని ఆయన ప్రకటించారు.

ఇక, మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌పై లోకేష్‌ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.
1994 నుంచి రాష్ట్ర స్థాయిలో డిఎస్సీ మొదలైందని, ఇప్పటి వరకు 15 డిఎస్సీలు టీడీపీ హయాంలోనే నిర్వహించామని చెప్పారు. 1994-2019 వరకు మొత్తం 2.20లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే వాటిలో 1.80 లక్షల పోస్టులు టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసిందని వెల్లడించారు.

2024 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. టీచర్ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నామని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. డిఎస్సీపై లీగల్‌ ఒపినియన్‌ అడిగామని, కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని, ఆ తర్వాత పకడ్బందీగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.

This post was last modified on November 15, 2024 2:13 pm

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

50 minutes ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

1 hour ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

13 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

14 hours ago