Political News

జగన్ లాగా టీచర్లతో బాత్రూమ్ పనులు చేయించం

వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు వాడున్నారని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులలో చాలామంది కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల విధులపై విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేస్తామని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను బాత్రూమ్ ల నిర్వహణ వంటి విధులు అప్పగించిందని లోకేష్ అన్నారు. ఉపాధ్యాయుల విధులపై జీవో 117కు ప్రత్యామ్నయాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులతో చర్చలకు తలుపులు మూసేయడం లేదని, ప్రతి శుక్రవారం 11 నుంచి 3గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోడానికి కేటాయించారరి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై పెట్టిన కేసులన్ని తొలగిస్తామని ఆయన ప్రకటించారు.

ఇక, మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌పై లోకేష్‌ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.
1994 నుంచి రాష్ట్ర స్థాయిలో డిఎస్సీ మొదలైందని, ఇప్పటి వరకు 15 డిఎస్సీలు టీడీపీ హయాంలోనే నిర్వహించామని చెప్పారు. 1994-2019 వరకు మొత్తం 2.20లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే వాటిలో 1.80 లక్షల పోస్టులు టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసిందని వెల్లడించారు.

2024 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. టీచర్ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నామని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. డిఎస్సీపై లీగల్‌ ఒపినియన్‌ అడిగామని, కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని, ఆ తర్వాత పకడ్బందీగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago