వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు వాడున్నారని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులలో చాలామంది కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల విధులపై విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేస్తామని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను బాత్రూమ్ ల నిర్వహణ వంటి విధులు అప్పగించిందని లోకేష్ అన్నారు. ఉపాధ్యాయుల విధులపై జీవో 117కు ప్రత్యామ్నయాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులతో చర్చలకు తలుపులు మూసేయడం లేదని, ప్రతి శుక్రవారం 11 నుంచి 3గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోడానికి కేటాయించారరి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై పెట్టిన కేసులన్ని తొలగిస్తామని ఆయన ప్రకటించారు.
ఇక, మెగా డిఎస్సీ నోటిఫికేషన్పై లోకేష్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.
1994 నుంచి రాష్ట్ర స్థాయిలో డిఎస్సీ మొదలైందని, ఇప్పటి వరకు 15 డిఎస్సీలు టీడీపీ హయాంలోనే నిర్వహించామని చెప్పారు. 1994-2019 వరకు మొత్తం 2.20లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే వాటిలో 1.80 లక్షల పోస్టులు టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసిందని వెల్లడించారు.
2024 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. టీచర్ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నామని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. డిఎస్సీపై లీగల్ ఒపినియన్ అడిగామని, కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని, ఆ తర్వాత పకడ్బందీగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.
This post was last modified on November 15, 2024 2:13 pm
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…