Political News

జగన్ లాగా టీచర్లతో బాత్రూమ్ పనులు చేయించం

వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు వాడున్నారని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులలో చాలామంది కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల విధులపై విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేస్తామని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను బాత్రూమ్ ల నిర్వహణ వంటి విధులు అప్పగించిందని లోకేష్ అన్నారు. ఉపాధ్యాయుల విధులపై జీవో 117కు ప్రత్యామ్నయాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులతో చర్చలకు తలుపులు మూసేయడం లేదని, ప్రతి శుక్రవారం 11 నుంచి 3గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోడానికి కేటాయించారరి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై పెట్టిన కేసులన్ని తొలగిస్తామని ఆయన ప్రకటించారు.

ఇక, మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌పై లోకేష్‌ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.
1994 నుంచి రాష్ట్ర స్థాయిలో డిఎస్సీ మొదలైందని, ఇప్పటి వరకు 15 డిఎస్సీలు టీడీపీ హయాంలోనే నిర్వహించామని చెప్పారు. 1994-2019 వరకు మొత్తం 2.20లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే వాటిలో 1.80 లక్షల పోస్టులు టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసిందని వెల్లడించారు.

2024 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. టీచర్ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నామని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. డిఎస్సీపై లీగల్‌ ఒపినియన్‌ అడిగామని, కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని, ఆ తర్వాత పకడ్బందీగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.

This post was last modified on November 15, 2024 2:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago