పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యారు. తర్వాత.. ఆయ నపై వైసీపీ వేటు వేసినా.. మళ్లీ పార్టీలోకి తీసుకుంది. ఇక, ఆతర్వాత ఏపీ ఫైర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పూనూరు పనిచేశారు. ఇప్పుడు తాజాగా ఆయన పరారీలో ఉండడం రాజకీయంగా సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం విజయవాడ, ముత్యాలంపాడులో ఒక పెద్ద కార్యాలయాన్ని పూనూరు గౌతంరెడ్డి నిర్వహిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ఆఫీసు ఉన్న భూమి గౌతంరెడ్డిది కాదని.. తప్పుడు పత్రాలతో ఆక్రమించారనేది పూనూరుపై ఉన్న ప్రధాన అభియోగం. ఈ క్రమంలో ఈ భూమి ఓనర్ అయిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రి ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తున్నారు. కేసు విచారణ పరిధిలో ఉంది. అయితే.. ఇంతలోనే గౌతంరెడ్డి ఉమామహేశ్వరశాస్త్రిని చంపించేందుకు కుట్ర పన్నారనేది తాజాగా నమోదైన కేసు.
ఈ క్రమంలో స్థల యజమాని గండూరి ఉమామహేశ్వరశాస్త్రిపై ఇటీవల దాడి కూడా జరిగిన విషయం చర్చకు వస్తోంది. ఈ దాడి వెనుక పూనూరు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. గండూరిని లేపేయడం ద్వారా రూ.కోట్లు విలువ చేసే స్థిరాస్థిని సొంతం చేసుకునేందుకు పూనూరు ప్లాన్ చేశారన్న అభియోగం కూడా నమోదైంది. గండూరి హత్యకు సుమారు రూ.25 లక్షల సుపారీకి డీల్ కుదుర్చుకున్నారని పోలీసులు గుర్తించారు.
ఇదిలావుంటే.. ఆది నుంచి వివాదాలకుకేంద్రంగా ఉన్న గౌతంరెడ్డిపై చాలానే కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు. తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆరుగురు నిందితుల పేర్లను చేర్చారు. గండూరి హత్య చేసేందుకు ప్రయత్నించిన వారిలో ఏ1గా పూనూరు గౌతంరెడ్డి పేరు చేర్చారు. ఇదిలావుంటే.. గౌతంరెడ్డిని వైసీపీ నాయకులే కాపాడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పూనూరు.. కడపలో గానీ, నెల్లూరులో గానీ ఉండొచ్చని చెబుతున్నారు. గౌతం రెడ్డిని అరెస్టు చేసేందుకు వేట సాగిస్తున్నారు.
This post was last modified on November 15, 2024 2:11 pm
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…