ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని అమరావతితోపాటు రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ నెల 29న ఏపీలో పర్యటించబోతున్నారు. విశాఖలో రూ 80 వేల కోట్ల పెట్టబడులతో స్థాపించబోతోన్న ‘గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్’’ కు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ హబ్లతోపాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులకు శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో సీఎం చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం 1200 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్లో 20 గిగావాట్ల విద్యుత్ ను ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఏపీ, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన తర్వాత ప్రధాని మోదీ ఏపీలో తొలిసారి పర్యటిస్తున్నారు. అదీగాక, అనధికారిక ఆర్థిక రాజధానిగా కొనసాగుతున్న విశాఖలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారు. మరోవైపు, విశాఖకు రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఉన్నాయి. దీంతో, కూటమి నేతలు ఈ టూర్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
This post was last modified on November 15, 2024 1:38 pm
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…