ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని అమరావతితోపాటు రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ నెల 29న ఏపీలో పర్యటించబోతున్నారు. విశాఖలో రూ 80 వేల కోట్ల పెట్టబడులతో స్థాపించబోతోన్న ‘గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్’’ కు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ హబ్లతోపాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులకు శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో సీఎం చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం 1200 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్లో 20 గిగావాట్ల విద్యుత్ ను ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఏపీ, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన తర్వాత ప్రధాని మోదీ ఏపీలో తొలిసారి పర్యటిస్తున్నారు. అదీగాక, అనధికారిక ఆర్థిక రాజధానిగా కొనసాగుతున్న విశాఖలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారు. మరోవైపు, విశాఖకు రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఉన్నాయి. దీంతో, కూటమి నేతలు ఈ టూర్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
This post was last modified on November 15, 2024 1:38 pm
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…