Political News

మోదీ శంకుస్థాపన.. ఏపీలో 48వేల మందికి ఉపాధి

ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని అమరావతితోపాటు రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ నెల 29న ఏపీలో పర్యటించబోతున్నారు. విశాఖలో రూ 80 వేల కోట్ల పెట్టబడులతో స్థాపించబోతోన్న ‘గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్’’ కు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.

గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లతోపాటు గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులకు శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో సీఎం చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం 1200 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో 20 గిగావాట్‌ల విద్యుత్ ను ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ఏపీ, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన తర్వాత ప్రధాని మోదీ ఏపీలో తొలిసారి పర్యటిస్తున్నారు. అదీగాక, అనధికారిక ఆర్థిక రాజధానిగా కొనసాగుతున్న విశాఖలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారు. మరోవైపు, విశాఖకు రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఉన్నాయి. దీంతో, కూటమి నేతలు ఈ టూర్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

This post was last modified on November 15, 2024 1:38 pm

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

48 minutes ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

1 hour ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

13 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

14 hours ago