ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని అమరావతితోపాటు రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ నెల 29న ఏపీలో పర్యటించబోతున్నారు. విశాఖలో రూ 80 వేల కోట్ల పెట్టబడులతో స్థాపించబోతోన్న ‘గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్’’ కు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ హబ్లతోపాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులకు శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో సీఎం చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం 1200 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్లో 20 గిగావాట్ల విద్యుత్ ను ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఏపీ, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన తర్వాత ప్రధాని మోదీ ఏపీలో తొలిసారి పర్యటిస్తున్నారు. అదీగాక, అనధికారిక ఆర్థిక రాజధానిగా కొనసాగుతున్న విశాఖలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారు. మరోవైపు, విశాఖకు రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఉన్నాయి. దీంతో, కూటమి నేతలు ఈ టూర్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
This post was last modified on November 15, 2024 1:38 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…