Political News

వైసీపీ ప్రతిపక్ష హోదాపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, జగన్ అండ్ కో అసెంబ్లీకి రాకుంటే రాజీనామాలు చేయాలని టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తొలిసారిగా స్పందించారు.

తన ప్రతిపక్ష హోదా తీస్తానని ఇదే సభలో అహంకారంతో విర్రవీగిన వారికి ప్రజలు కాల్చి వాత పెట్టి 11 సీట్లు ఇచ్చారని, అటువంటి వారికి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు.
10 శాతం సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని, అది ఏ నాయకుడో, ఇంకొకరో ఇచ్చేది కాదని అన్నారు. ప్రతిపక్ష హోదా లేదంటే సభకు రానని చెప్పడం గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానం, డిక్టేట్ చేయడం, శాసించడం ప్రజాస్వామ్యంలో ఉండకూడదని చెప్పారు.

ప్రజలు చైతన్యంతో గెలిపించిన ప్రజా ప్రభుత్వం ఇదని, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం అని చెప్పారు. 2019-24 వరకు ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదుదని, 2024-29 మధ్య జరిగే ఈ సభ స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను సాధించడానికి దోహద పడుతుందని చెప్పారు. ఐదేళ్లలో 227 ఎంవోయూలు జరిగినా ఏపీకి పైసా పెట్టుబడి రాలేదని జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పన్నులు, కరెంటు చార్జీలు పెంచడంతో పరిశ్రమలు ఏపీలో మనుగడ సాధించలేని పరిస్థితిని జగన్ తెచ్చారని విమర్శించారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకున్నారు.

ప్రతి నలుగురు ఐటీ నిపుణులు ఒకరు తెలుగువారు ఉన్నారంటే 1995 తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణమని చంద్రబాబు చెప్పారు 2047 నాటికి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ దేశంగా తయారవుతుందని, ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.

This post was last modified on November 15, 2024 6:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

18 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

39 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

6 hours ago