Political News

వైసీపీ ప్రతిపక్ష హోదాపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, జగన్ అండ్ కో అసెంబ్లీకి రాకుంటే రాజీనామాలు చేయాలని టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తొలిసారిగా స్పందించారు.

తన ప్రతిపక్ష హోదా తీస్తానని ఇదే సభలో అహంకారంతో విర్రవీగిన వారికి ప్రజలు కాల్చి వాత పెట్టి 11 సీట్లు ఇచ్చారని, అటువంటి వారికి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు.
10 శాతం సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని, అది ఏ నాయకుడో, ఇంకొకరో ఇచ్చేది కాదని అన్నారు. ప్రతిపక్ష హోదా లేదంటే సభకు రానని చెప్పడం గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానం, డిక్టేట్ చేయడం, శాసించడం ప్రజాస్వామ్యంలో ఉండకూడదని చెప్పారు.

ప్రజలు చైతన్యంతో గెలిపించిన ప్రజా ప్రభుత్వం ఇదని, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం అని చెప్పారు. 2019-24 వరకు ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదుదని, 2024-29 మధ్య జరిగే ఈ సభ స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను సాధించడానికి దోహద పడుతుందని చెప్పారు. ఐదేళ్లలో 227 ఎంవోయూలు జరిగినా ఏపీకి పైసా పెట్టుబడి రాలేదని జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పన్నులు, కరెంటు చార్జీలు పెంచడంతో పరిశ్రమలు ఏపీలో మనుగడ సాధించలేని పరిస్థితిని జగన్ తెచ్చారని విమర్శించారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకున్నారు.

ప్రతి నలుగురు ఐటీ నిపుణులు ఒకరు తెలుగువారు ఉన్నారంటే 1995 తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణమని చంద్రబాబు చెప్పారు 2047 నాటికి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ దేశంగా తయారవుతుందని, ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.

This post was last modified on November 15, 2024 6:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

5 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

3 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

7 hours ago