Political News

వైసీపీ ప్రతిపక్ష హోదాపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, జగన్ అండ్ కో అసెంబ్లీకి రాకుంటే రాజీనామాలు చేయాలని టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తొలిసారిగా స్పందించారు.

తన ప్రతిపక్ష హోదా తీస్తానని ఇదే సభలో అహంకారంతో విర్రవీగిన వారికి ప్రజలు కాల్చి వాత పెట్టి 11 సీట్లు ఇచ్చారని, అటువంటి వారికి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు.
10 శాతం సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని, అది ఏ నాయకుడో, ఇంకొకరో ఇచ్చేది కాదని అన్నారు. ప్రతిపక్ష హోదా లేదంటే సభకు రానని చెప్పడం గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానం, డిక్టేట్ చేయడం, శాసించడం ప్రజాస్వామ్యంలో ఉండకూడదని చెప్పారు.

ప్రజలు చైతన్యంతో గెలిపించిన ప్రజా ప్రభుత్వం ఇదని, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం అని చెప్పారు. 2019-24 వరకు ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదుదని, 2024-29 మధ్య జరిగే ఈ సభ స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను సాధించడానికి దోహద పడుతుందని చెప్పారు. ఐదేళ్లలో 227 ఎంవోయూలు జరిగినా ఏపీకి పైసా పెట్టుబడి రాలేదని జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పన్నులు, కరెంటు చార్జీలు పెంచడంతో పరిశ్రమలు ఏపీలో మనుగడ సాధించలేని పరిస్థితిని జగన్ తెచ్చారని విమర్శించారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకున్నారు.

ప్రతి నలుగురు ఐటీ నిపుణులు ఒకరు తెలుగువారు ఉన్నారంటే 1995 తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణమని చంద్రబాబు చెప్పారు 2047 నాటికి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ దేశంగా తయారవుతుందని, ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

3 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

7 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

8 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

8 hours ago