ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఈరోజు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్ రఘురామను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. అనంతరం సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్…రఘురామను గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు గురించి సభలో ప్రస్తావించారు. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారని పవన్ అన్నారు.
కర్మ ఎవరినీ వదిలిపెట్టదని, నరసాపురంలో రఘురామను అడుగుపెట్టనివ్వమని చెప్పిన వారు ఈరోజు సభలో అడుగుపెట్టే పరిస్థితి లేదని వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం అధికార పార్టీ సభ్యులను ఎదుర్కోవాలంటే వైసీపీ సభ్యులకు భయం కలుగుతుందని చెప్పారు. చంద్రబాబును కూడా గతంలో ఇబ్బందులు పాలు చేశారని, అప్పుడు తాను ఎంతో ఆవేదన చెందానని పవన్ అన్నారు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు రాజ్యాన్ని ఏలితే ఎవరినైనా బలి చేస్తారని పవన్ చెప్పారు. అలాంటి పాలిటిక్స్ ఉండకూడదని 2014లో 2024లో వారిని నిలువరించామని, 2019లో కుదరలేదని అన్నారు.
సుప్రీంకోర్టు జడ్జిలు, సొంత పార్టీ నేతలు ఎవరినీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వదలలేదని పవన్ అన్నారు. రఘురామను శారీరకంగా, మానసికంగా హింసించారని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న తన కోరిక వల్లే ఈరోజు డిప్యూటీ స్పీకర్గా రఘురామను చూడగలుగుతున్నామని పవన్ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఈ సభకు ధన్యవాదాలు తెలిపారు. రఘురామ తన సెన్సాఫ్ హ్యూమర్ కోల్పోకూడదని, ప్రజాస్వామ్య విలువలను సైతం కాపాడాలని అన్నారు.
చట్టసభల్లో హుందాతనం పోయిందని, అందుకే ఇళ్లల్లోకి వచ్చి రేప్ లు చేస్తామని వ్యాఖ్యానిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అబ్యూజింగ్ ని ఆపేందుకు సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును సాధ్యమైనంత త్వరలో తీసుకురావాలని అనుకుంటున్నట్లుగా పవన్ చెప్పారు. హాస్య చతురత కోల్పోకుండానే సభా విలువలను రఘురామ నెలకొల్పుతారని తాను ఆశిస్తున్నట్లు పవన్ చెప్పారు.
This post was last modified on November 15, 2024 6:48 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…