500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కి కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా లెక్కచేయకుండా అత్యంత ఖరీదైన భవనం కట్టిన జగన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
500 కోట్లు పెట్టి జగన్ తన రాజకీయ సమాధి కట్టుకున్నారని, ఆ ప్యాలెస్ కట్టి ఓ విధంగా జగన్ మనకు మంచే చేశారని రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నెగిటివిటిలో కూడా పాజిటివిటీ వెతుక్కోవాలని, ఆ ప్యాలెస్ కట్టడంతోనే జగన్ పతనం ప్రారంభమైందని రఘురామ అన్నారు. ఆ ప్యాలెస్ కట్టి జగన్ అల్లరిపాలైనా సరే రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారని రఘురామ చెప్పారు.
రుషికొండ భవనంపై తాను హైకోర్టును ఆశ్రయించానని, అయితే తనపై సుప్రీంకోర్టుకు కూడా అబద్ధం చెప్పారని రఘురామ అన్నారు. టూరిజం ప్రాజెక్టు అని చెప్పి ఆ తర్వాత సీఎం నివాసం అని చెప్పారని అబద్ధాలు ఆడారని రఘురామ గుర్తు చేసుకున్నారు. రుషికొండను మంచి భవనంగా తీర్చిదిద్దాలని, నియంత కట్టుకున్న విలాస భవనం అని ప్రజలకు తెలియాలని చెప్పారు. నిర్ణీత రుసుము వసూలు చేసి ప్రజలను సందర్శనార్థం ఆ ప్యాలెస్ లోకి అనుమతించాలని రఘురామ కోరారు. ఆ రకంగా అయినా వృధా అయిన ప్రజాధనం కొంతవరకు రికవరీ అవుతుందని చెప్పుకొచ్చారు.
ఇక, ఇదే రుషికొండ ప్యాలెస్ పై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ భవనంలో 11 లక్షల రూపాయల ఖరీదు చేసే కమోడ్, 31 లక్షల రూపాయల ఖరీదు చేసే తలుపులు చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే అని అన్నారు. ఇక్కడ దుర్వినియోగం అయిన ప్రజాధనం గురించి ఆలోచిస్తే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. రుషికొండపై జరిగిన అధికార దుర్వినియోగానికి జగన్ ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పు లేదని, పర్యాటక శాఖ భవనాల ముసుగులో ఈ ప్యాలెస్ కట్టి అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి జగన్ తెరతీశారని ఆయన ఆరోపించారు.
This post was last modified on November 15, 2024 6:47 am
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…