Political News

రుషికొండ ప్యాలెస్ జగన్ రాజకీయ సమాధి: రఘురామ

500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కి కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా లెక్కచేయకుండా అత్యంత ఖరీదైన భవనం కట్టిన జగన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

500 కోట్లు పెట్టి జగన్ తన రాజకీయ సమాధి కట్టుకున్నారని, ఆ ప్యాలెస్ కట్టి ఓ విధంగా జగన్ మనకు మంచే చేశారని రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నెగిటివిటిలో కూడా పాజిటివిటీ వెతుక్కోవాలని, ఆ ప్యాలెస్ కట్టడంతోనే జగన్ పతనం ప్రారంభమైందని రఘురామ అన్నారు. ఆ ప్యాలెస్ కట్టి జగన్ అల్లరిపాలైనా సరే రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారని రఘురామ చెప్పారు.

రుషికొండ భవనంపై తాను హైకోర్టును ఆశ్రయించానని, అయితే తనపై సుప్రీంకోర్టుకు కూడా అబద్ధం చెప్పారని రఘురామ అన్నారు. టూరిజం ప్రాజెక్టు అని చెప్పి ఆ తర్వాత సీఎం నివాసం అని చెప్పారని అబద్ధాలు ఆడారని రఘురామ గుర్తు చేసుకున్నారు. రుషికొండను మంచి భవనంగా తీర్చిదిద్దాలని, నియంత కట్టుకున్న విలాస భవనం అని ప్రజలకు తెలియాలని చెప్పారు. నిర్ణీత రుసుము వసూలు చేసి ప్రజలను సందర్శనార్థం ఆ ప్యాలెస్ లోకి అనుమతించాలని రఘురామ కోరారు. ఆ రకంగా అయినా వృధా అయిన ప్రజాధనం కొంతవరకు రికవరీ అవుతుందని చెప్పుకొచ్చారు.

ఇక, ఇదే రుషికొండ ప్యాలెస్ పై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ భవనంలో 11 లక్షల రూపాయల ఖరీదు చేసే కమోడ్, 31 లక్షల రూపాయల ఖరీదు చేసే తలుపులు చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే అని అన్నారు. ఇక్కడ దుర్వినియోగం అయిన ప్రజాధనం గురించి ఆలోచిస్తే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. రుషికొండపై జరిగిన అధికార దుర్వినియోగానికి జగన్ ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పు లేదని, పర్యాటక శాఖ భవనాల ముసుగులో ఈ ప్యాలెస్ కట్టి అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి జగన్ తెరతీశారని ఆయన ఆరోపించారు.

This post was last modified on November 15, 2024 6:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

3 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

7 hours ago