500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కి కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా లెక్కచేయకుండా అత్యంత ఖరీదైన భవనం కట్టిన జగన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
500 కోట్లు పెట్టి జగన్ తన రాజకీయ సమాధి కట్టుకున్నారని, ఆ ప్యాలెస్ కట్టి ఓ విధంగా జగన్ మనకు మంచే చేశారని రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నెగిటివిటిలో కూడా పాజిటివిటీ వెతుక్కోవాలని, ఆ ప్యాలెస్ కట్టడంతోనే జగన్ పతనం ప్రారంభమైందని రఘురామ అన్నారు. ఆ ప్యాలెస్ కట్టి జగన్ అల్లరిపాలైనా సరే రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారని రఘురామ చెప్పారు.
రుషికొండ భవనంపై తాను హైకోర్టును ఆశ్రయించానని, అయితే తనపై సుప్రీంకోర్టుకు కూడా అబద్ధం చెప్పారని రఘురామ అన్నారు. టూరిజం ప్రాజెక్టు అని చెప్పి ఆ తర్వాత సీఎం నివాసం అని చెప్పారని అబద్ధాలు ఆడారని రఘురామ గుర్తు చేసుకున్నారు. రుషికొండను మంచి భవనంగా తీర్చిదిద్దాలని, నియంత కట్టుకున్న విలాస భవనం అని ప్రజలకు తెలియాలని చెప్పారు. నిర్ణీత రుసుము వసూలు చేసి ప్రజలను సందర్శనార్థం ఆ ప్యాలెస్ లోకి అనుమతించాలని రఘురామ కోరారు. ఆ రకంగా అయినా వృధా అయిన ప్రజాధనం కొంతవరకు రికవరీ అవుతుందని చెప్పుకొచ్చారు.
ఇక, ఇదే రుషికొండ ప్యాలెస్ పై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ భవనంలో 11 లక్షల రూపాయల ఖరీదు చేసే కమోడ్, 31 లక్షల రూపాయల ఖరీదు చేసే తలుపులు చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే అని అన్నారు. ఇక్కడ దుర్వినియోగం అయిన ప్రజాధనం గురించి ఆలోచిస్తే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. రుషికొండపై జరిగిన అధికార దుర్వినియోగానికి జగన్ ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పు లేదని, పర్యాటక శాఖ భవనాల ముసుగులో ఈ ప్యాలెస్ కట్టి అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి జగన్ తెరతీశారని ఆయన ఆరోపించారు.
This post was last modified on November 15, 2024 6:47 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…