Political News

రుషికొండ ప్యాలెస్ జగన్ రాజకీయ సమాధి: రఘురామ

500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కి కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా లెక్కచేయకుండా అత్యంత ఖరీదైన భవనం కట్టిన జగన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

500 కోట్లు పెట్టి జగన్ తన రాజకీయ సమాధి కట్టుకున్నారని, ఆ ప్యాలెస్ కట్టి ఓ విధంగా జగన్ మనకు మంచే చేశారని రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నెగిటివిటిలో కూడా పాజిటివిటీ వెతుక్కోవాలని, ఆ ప్యాలెస్ కట్టడంతోనే జగన్ పతనం ప్రారంభమైందని రఘురామ అన్నారు. ఆ ప్యాలెస్ కట్టి జగన్ అల్లరిపాలైనా సరే రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారని రఘురామ చెప్పారు.

రుషికొండ భవనంపై తాను హైకోర్టును ఆశ్రయించానని, అయితే తనపై సుప్రీంకోర్టుకు కూడా అబద్ధం చెప్పారని రఘురామ అన్నారు. టూరిజం ప్రాజెక్టు అని చెప్పి ఆ తర్వాత సీఎం నివాసం అని చెప్పారని అబద్ధాలు ఆడారని రఘురామ గుర్తు చేసుకున్నారు. రుషికొండను మంచి భవనంగా తీర్చిదిద్దాలని, నియంత కట్టుకున్న విలాస భవనం అని ప్రజలకు తెలియాలని చెప్పారు. నిర్ణీత రుసుము వసూలు చేసి ప్రజలను సందర్శనార్థం ఆ ప్యాలెస్ లోకి అనుమతించాలని రఘురామ కోరారు. ఆ రకంగా అయినా వృధా అయిన ప్రజాధనం కొంతవరకు రికవరీ అవుతుందని చెప్పుకొచ్చారు.

ఇక, ఇదే రుషికొండ ప్యాలెస్ పై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ భవనంలో 11 లక్షల రూపాయల ఖరీదు చేసే కమోడ్, 31 లక్షల రూపాయల ఖరీదు చేసే తలుపులు చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే అని అన్నారు. ఇక్కడ దుర్వినియోగం అయిన ప్రజాధనం గురించి ఆలోచిస్తే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. రుషికొండపై జరిగిన అధికార దుర్వినియోగానికి జగన్ ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పు లేదని, పర్యాటక శాఖ భవనాల ముసుగులో ఈ ప్యాలెస్ కట్టి అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి జగన్ తెరతీశారని ఆయన ఆరోపించారు.

This post was last modified on November 15, 2024 6:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీలో పాత సామాన్లు: రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే, వివాదాల‌కు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

1 hour ago

హీరో-డైరెక్టర్ ‘పాడు కాస్ట్’ అదిరిపోలా

కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…

3 hours ago

దేశవ్యాప్తంగా 5G.. ఏ రేంజ్ లో ఉందంటే..

భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…

3 hours ago

నా సినిమా సేఫ్ అంటున్న దర్శకుడు

‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…

3 hours ago

బాబుతో నాగం భేటీ… ఎన్నెన్ని తీపి గురుతులో?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…

4 hours ago

రెండో రోజే రచ్చ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వేటు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజే రచ్చ చోటుచేసుకుంది. ఓ చిన్న వివాదం చిలికి చికిలి గాలి…

4 hours ago