ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన రఘురామకృష్ణరాజుపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భయం అనేది ఆర్ఆర్ఆర్ బయోడేటాలో లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఎంతోమంది యువ శాసనసభ్యులకు రఘురామ ఆదర్శమని, సభలో ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరిగేందుకు ఆయన సహకారం ఉండాలని లోకేష్ ఆకాంక్షించారు. ఆర్ఆర్ఆర్ అంటే రియల్, రెస్పాన్సిబిల్, రెబెలియస్ అని చెప్పారు.
మనసులో ఉన్న మాటను కుండబద్దలు కొట్టినట్లు బయటకు చెబుతారు కాబట్టి రియల్ అని, తప్పుని తప్పు అని చెప్పే భోలా శంకరుడు రఘురామ అని లోకేష్ చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు తనకు ఆయన అండగా నిలబడ్డారని, ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తున్నప్పుడు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర, రఘురామ తనకు ఎంతో సహకరించి చర్చించే వాళ్ళని చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులను ముందుగా గ్రహించింది రఘురామా అని, అప్పులు ఇస్తే రాష్ట్రం ఇబ్బందుల పాలవుతుందని పోరాడిన వ్యక్తి ఆయనే అని గుర్తు చేశారు. ఉండి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సొంత నిధులు, సి ఎస్ ఆర్ నిధులు తెచ్చి పార్కులు అభివృద్ధి చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు చేస్తున్నారని అన్నారు. రచ్చబండ పెట్టి గత ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారని అర్ధరాత్రి అరెస్టు చేయించారని, కస్టోడియల్ టార్చర్ కు పాల్పడ్డారని గుర్తు చేసుకున్నారు.
ఒక ఎంపీని కస్టడీలో టార్చర్ చేస్తారా అని తాను టీవీలో స్క్రోలింగ్ చూసి అనుకున్నానని, ఆ తర్వాత దెబ్బతిన్న రఘురామ కాళ్ళ ఫోటోలు వాట్సప్లో తనకు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. సొంత పార్టీ ఎంపీని ఈ రకంగా టార్చర్ చేస్తారా అని ఆశ్చర్యపోయానని, ఆ రోజు నుంచి కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నానని లోకేష్ అన్నారు.
తనపై కూడా కేసులు పెట్టి రాళ్ల దాడి చేశారని, సోడా బాటిల్స్ విసిరారని, అటెంప్ట్ టు మర్డర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని గుర్తు చేసుకున్నారు. ఈరోజు ప్రతిపక్షం ఇక్కడ లేదని, ఎందుకు రావడం లేదో వారి విజ్ఞతకే వదిలేద్దామని లోకేష్ అన్నారు. సభలో మంచి డిబేట్ జరగడానికి రఘురామ సహకారం ఉండాలని కోరుకున్నారు. డిప్యూటీ స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టి రఘురామ నోరు కట్టేశారన్న బాధ ఉందని లోకేష్ అన్నారు.
This post was last modified on November 15, 2024 6:43 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…