Political News

38 శాతం ఓట్ షేర్ కూడా పోయేలా ఉంది జగన్!

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. శాసన సభకు వెళ్లని జగన్, వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెహ్రూ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల తాజాగా మరోసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పుట్టకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ ఉందని, ఆ పార్టీ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ప్రజలు వైసీపీని ఓడించాలని కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారని, ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ వైసీపీ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి 1.7 శాతం ఓటు షేర్ అని జగన్ విమర్శించారని, అయితే, వైసీపీకి 38 శాతం ఓట్లు ఉన్నా అసెంబ్లీకి వెళ్లడం లేదని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా..వైసీపీకి 11 సీట్లు వచ్చినా రెండూ ఒక్కటే అని ఎద్దేవా చేశారు. తమకు సీట్లు రాలేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్లలేదని, వైసీపీని నమ్మి 11 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించినా ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లడం లేదని విమర్శించారు.

బడ్జెట్ పై అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారని , ఆయన కంటే ముందు తాము కూడా అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ బాగోలేదని చెప్పామని అన్నారు. మరి జగన్ కు తనకు తేడా ఏంటని, వైసీపీకి కాంగ్రెస్ కు తేడా ఏంటని ప్రశ్నించారు. 38 శాతం ఓట్ల షేర్ ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ, జగన్ తీరు చూస్తే ఆ ఓటు బ్యాంకు కూడా మిగుల్చుకునేటట్లు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ లేని, ప్రజా సంక్షేమం పట్టించుకోని వైసీపీదే ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ అని, కాంగ్రెస్ ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ కాదని చురకలంటించారు.

శాసన సభకు వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామాలు చేయాలని వైసీపీ సభ్యులకు మళ్లీ చెబుతున్నానని షర్మిల అన్నారు. రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, తమను గెలిపించినా సరే అసెంబ్లీకి వెళ్లబోమని ప్రజలకు రెఫరెండం ఇచ్చి గెలవాలని షర్మిల డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లబోమన్న వైసీపీ సభ్యుల తీరు మూర్ఘత్వంగా ఉందని విమర్శించారు.

This post was last modified on November 14, 2024 5:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

26 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

47 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

6 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

6 hours ago