Political News

38 శాతం ఓట్ షేర్ కూడా పోయేలా ఉంది జగన్!

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. శాసన సభకు వెళ్లని జగన్, వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెహ్రూ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల తాజాగా మరోసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పుట్టకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ ఉందని, ఆ పార్టీ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ప్రజలు వైసీపీని ఓడించాలని కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారని, ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ వైసీపీ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి 1.7 శాతం ఓటు షేర్ అని జగన్ విమర్శించారని, అయితే, వైసీపీకి 38 శాతం ఓట్లు ఉన్నా అసెంబ్లీకి వెళ్లడం లేదని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా..వైసీపీకి 11 సీట్లు వచ్చినా రెండూ ఒక్కటే అని ఎద్దేవా చేశారు. తమకు సీట్లు రాలేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్లలేదని, వైసీపీని నమ్మి 11 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించినా ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లడం లేదని విమర్శించారు.

బడ్జెట్ పై అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారని , ఆయన కంటే ముందు తాము కూడా అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ బాగోలేదని చెప్పామని అన్నారు. మరి జగన్ కు తనకు తేడా ఏంటని, వైసీపీకి కాంగ్రెస్ కు తేడా ఏంటని ప్రశ్నించారు. 38 శాతం ఓట్ల షేర్ ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ, జగన్ తీరు చూస్తే ఆ ఓటు బ్యాంకు కూడా మిగుల్చుకునేటట్లు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ లేని, ప్రజా సంక్షేమం పట్టించుకోని వైసీపీదే ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ అని, కాంగ్రెస్ ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ కాదని చురకలంటించారు.

శాసన సభకు వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామాలు చేయాలని వైసీపీ సభ్యులకు మళ్లీ చెబుతున్నానని షర్మిల అన్నారు. రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, తమను గెలిపించినా సరే అసెంబ్లీకి వెళ్లబోమని ప్రజలకు రెఫరెండం ఇచ్చి గెలవాలని షర్మిల డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లబోమన్న వైసీపీ సభ్యుల తీరు మూర్ఘత్వంగా ఉందని విమర్శించారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

3 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

7 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

8 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

8 hours ago