వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు వైసీపీకి కొరకరాని కొయ్యగా ఉన్నా రఘురామ 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే రఘురామకు వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
గతం గతహా: అన్న విజయసాయిరెడ్డి అన్నీ మరచిపోయి ముందుకుపోవాలని రఘురామకు హితవు పలికారు. డిప్యూటీ స్పీకర్ స్థానం గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడతారనే నమ్మకం తనకుందని సాయిరెడ్డి చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను వదిలేసి పైకి ఎదుగుతారని ఆశిస్తున్నానని అన్నారు. వైసీపీ నేతలను, విజయసాయిని, జగన్ ను తీవ్రస్థాయిలో విమర్శించిన రఘురామకు విజయసాయి విషెస్ చెప్పడం షాకింగ్ గా మారింది.
ఉప్పు, నిప్పులా వైసీపీ నేతలు, రఘురామ ఉంటున్న తరుణంలో సాయిరెడ్డి ఈ తరహా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో కస్టోడియల్ టార్చర్ కు గురయ్యానని స్వయంగా రఘురామ పలు సందర్భాల్లో వెల్లడించారు. రఘురామతో కాంప్రమైజ్ కు సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. గతంలో రఘురామను అంత టార్చర్ చేసి మరచిపోమంటే ఎలా కుదురుతుంది అని ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on November 14, 2024 5:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…