వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు వైసీపీకి కొరకరాని కొయ్యగా ఉన్నా రఘురామ 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే రఘురామకు వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
గతం గతహా: అన్న విజయసాయిరెడ్డి అన్నీ మరచిపోయి ముందుకుపోవాలని రఘురామకు హితవు పలికారు. డిప్యూటీ స్పీకర్ స్థానం గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడతారనే నమ్మకం తనకుందని సాయిరెడ్డి చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను వదిలేసి పైకి ఎదుగుతారని ఆశిస్తున్నానని అన్నారు. వైసీపీ నేతలను, విజయసాయిని, జగన్ ను తీవ్రస్థాయిలో విమర్శించిన రఘురామకు విజయసాయి విషెస్ చెప్పడం షాకింగ్ గా మారింది.
ఉప్పు, నిప్పులా వైసీపీ నేతలు, రఘురామ ఉంటున్న తరుణంలో సాయిరెడ్డి ఈ తరహా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో కస్టోడియల్ టార్చర్ కు గురయ్యానని స్వయంగా రఘురామ పలు సందర్భాల్లో వెల్లడించారు. రఘురామతో కాంప్రమైజ్ కు సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. గతంలో రఘురామను అంత టార్చర్ చేసి మరచిపోమంటే ఎలా కుదురుతుంది అని ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on November 14, 2024 5:48 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…