మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. అయతే, గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదని వైసీపీ సభ్యులు అన్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహాంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని ఆనాడు అసెంబ్లీలో అవమానించారని, అందుకే, చంద్రబాబు ఆనాడు సభ నుంచి వెళ్లిపోయారని లోకేష్ గుర్తు చేశారు.
కౌరవ సభలో తనకు అవమానం జరిగిందని, మళ్లీ గౌరవ సభగా ఇది మారినప్పుడే అడుగు పెడతానని చంద్రబాబు అన్న మాటలను లోకేష్ గుర్తు చేశారు. శాసన సభ సాక్షిగా తన తల్లిని అవమానించారని, ఆ విషయం వైసీపీ సభ్యులు గుర్తు పెట్టుకోవాలని, ఈ రోజు కావాలని పోస్టులు కూడా అంతే పెడుతున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. అవన్నీ మీకు గుర్తుకు రావా అని వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు. మీరున్నారా ఆరోజు హౌస్ లో అని ప్రశ్నించారు. షర్మిల గారిని, విజయమ్మ గారిని, నా తల్లిని అవమానించారని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ వ్యాఖ్యలు గుర్తుపెట్టుకొని తాము అలా మాట్లాడడానికి ఒక్క నిమిషం పట్టదని, కానీ, తమకు సభ్యత సంస్కారం ఉన్నాయని లోకేష్ అన్నారు. తాము ఏనాడూ అలా మాట్లాడలేదని, మాట్లాడబోమని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి ఏనాడూ తాము, తమ పార్టీ సభ్యులు మాట్లాడలేదని లోకేష్ ఆవేశపూరితంగా మాట్లాడారు. శాసన సభలో తన తల్లిని అవమానిస్తే చూస్తూ కూర్చోవాలా అంటూ వైసీపీ సభ్యులపై లోకేష్ కన్నెర్రజేశారు. మునుపెన్నడూ లేని విధంగా వైసీపీ సభ్యులనుద్దేశించి లోకేష్ ఆవేశపూరితంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మండలిలో లోకేష్ విశ్వరూపం చూపించారని, వైసీపీ సభ్యులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on November 14, 2024 5:47 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…