Political News

నా తల్లిని అవమానిస్తే ఊరుకోవాలా?..లోకేష్ ఫైర్

మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. అయతే, గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదని వైసీపీ సభ్యులు అన్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహాంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని ఆనాడు అసెంబ్లీలో అవమానించారని, అందుకే, చంద్రబాబు ఆనాడు సభ నుంచి వెళ్లిపోయారని లోకేష్ గుర్తు చేశారు.

కౌరవ సభలో తనకు అవమానం జరిగిందని, మళ్లీ గౌరవ సభగా ఇది మారినప్పుడే అడుగు పెడతానని చంద్రబాబు అన్న మాటలను లోకేష్ గుర్తు చేశారు. శాసన సభ సాక్షిగా తన తల్లిని అవమానించారని, ఆ విషయం వైసీపీ సభ్యులు గుర్తు పెట్టుకోవాలని, ఈ రోజు కావాలని పోస్టులు కూడా అంతే పెడుతున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. అవన్నీ మీకు గుర్తుకు రావా అని వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు. మీరున్నారా ఆరోజు హౌస్ లో అని ప్రశ్నించారు. షర్మిల గారిని, విజయమ్మ గారిని, నా తల్లిని అవమానించారని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ వ్యాఖ్యలు గుర్తుపెట్టుకొని తాము అలా మాట్లాడడానికి ఒక్క నిమిషం పట్టదని, కానీ, తమకు సభ్యత సంస్కారం ఉన్నాయని లోకేష్ అన్నారు. తాము ఏనాడూ అలా మాట్లాడలేదని, మాట్లాడబోమని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి ఏనాడూ తాము, తమ పార్టీ సభ్యులు మాట్లాడలేదని లోకేష్ ఆవేశపూరితంగా మాట్లాడారు. శాసన సభలో తన తల్లిని అవమానిస్తే చూస్తూ కూర్చోవాలా అంటూ వైసీపీ సభ్యులపై లోకేష్ కన్నెర్రజేశారు. మునుపెన్నడూ లేని విధంగా వైసీపీ సభ్యులనుద్దేశించి లోకేష్ ఆవేశపూరితంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మండలిలో లోకేష్ విశ్వరూపం చూపించారని, వైసీపీ సభ్యులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

This post was last modified on November 14, 2024 5:47 pm

Share

Recent Posts

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

39 minutes ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

2 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

2 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

7 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

14 hours ago