మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. అయతే, గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదని వైసీపీ సభ్యులు అన్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహాంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని ఆనాడు అసెంబ్లీలో అవమానించారని, అందుకే, చంద్రబాబు ఆనాడు సభ నుంచి వెళ్లిపోయారని లోకేష్ గుర్తు చేశారు.
కౌరవ సభలో తనకు అవమానం జరిగిందని, మళ్లీ గౌరవ సభగా ఇది మారినప్పుడే అడుగు పెడతానని చంద్రబాబు అన్న మాటలను లోకేష్ గుర్తు చేశారు. శాసన సభ సాక్షిగా తన తల్లిని అవమానించారని, ఆ విషయం వైసీపీ సభ్యులు గుర్తు పెట్టుకోవాలని, ఈ రోజు కావాలని పోస్టులు కూడా అంతే పెడుతున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. అవన్నీ మీకు గుర్తుకు రావా అని వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు. మీరున్నారా ఆరోజు హౌస్ లో అని ప్రశ్నించారు. షర్మిల గారిని, విజయమ్మ గారిని, నా తల్లిని అవమానించారని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ వ్యాఖ్యలు గుర్తుపెట్టుకొని తాము అలా మాట్లాడడానికి ఒక్క నిమిషం పట్టదని, కానీ, తమకు సభ్యత సంస్కారం ఉన్నాయని లోకేష్ అన్నారు. తాము ఏనాడూ అలా మాట్లాడలేదని, మాట్లాడబోమని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి ఏనాడూ తాము, తమ పార్టీ సభ్యులు మాట్లాడలేదని లోకేష్ ఆవేశపూరితంగా మాట్లాడారు. శాసన సభలో తన తల్లిని అవమానిస్తే చూస్తూ కూర్చోవాలా అంటూ వైసీపీ సభ్యులపై లోకేష్ కన్నెర్రజేశారు. మునుపెన్నడూ లేని విధంగా వైసీపీ సభ్యులనుద్దేశించి లోకేష్ ఆవేశపూరితంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మండలిలో లోకేష్ విశ్వరూపం చూపించారని, వైసీపీ సభ్యులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on November 14, 2024 5:47 pm
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…