Political News

నా తల్లిని అవమానిస్తే ఊరుకోవాలా?..లోకేష్ ఫైర్

మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. అయతే, గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదని వైసీపీ సభ్యులు అన్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహాంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని ఆనాడు అసెంబ్లీలో అవమానించారని, అందుకే, చంద్రబాబు ఆనాడు సభ నుంచి వెళ్లిపోయారని లోకేష్ గుర్తు చేశారు.

కౌరవ సభలో తనకు అవమానం జరిగిందని, మళ్లీ గౌరవ సభగా ఇది మారినప్పుడే అడుగు పెడతానని చంద్రబాబు అన్న మాటలను లోకేష్ గుర్తు చేశారు. శాసన సభ సాక్షిగా తన తల్లిని అవమానించారని, ఆ విషయం వైసీపీ సభ్యులు గుర్తు పెట్టుకోవాలని, ఈ రోజు కావాలని పోస్టులు కూడా అంతే పెడుతున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. అవన్నీ మీకు గుర్తుకు రావా అని వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు. మీరున్నారా ఆరోజు హౌస్ లో అని ప్రశ్నించారు. షర్మిల గారిని, విజయమ్మ గారిని, నా తల్లిని అవమానించారని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ వ్యాఖ్యలు గుర్తుపెట్టుకొని తాము అలా మాట్లాడడానికి ఒక్క నిమిషం పట్టదని, కానీ, తమకు సభ్యత సంస్కారం ఉన్నాయని లోకేష్ అన్నారు. తాము ఏనాడూ అలా మాట్లాడలేదని, మాట్లాడబోమని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి ఏనాడూ తాము, తమ పార్టీ సభ్యులు మాట్లాడలేదని లోకేష్ ఆవేశపూరితంగా మాట్లాడారు. శాసన సభలో తన తల్లిని అవమానిస్తే చూస్తూ కూర్చోవాలా అంటూ వైసీపీ సభ్యులపై లోకేష్ కన్నెర్రజేశారు. మునుపెన్నడూ లేని విధంగా వైసీపీ సభ్యులనుద్దేశించి లోకేష్ ఆవేశపూరితంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మండలిలో లోకేష్ విశ్వరూపం చూపించారని, వైసీపీ సభ్యులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

This post was last modified on November 14, 2024 5:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

10 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

30 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago