వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న సంగతి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిిందే. ఈ క్రమంలోనే నటి, వైసీపీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డిపై కూడా కేసు నమోదైంది. నీచమైన భాషలో బూతులతో చంద్రబాబు మొదలు షర్మిల వరకు అందరిపై శ్రీరెడ్డి బూతుపురాణంతో విమర్శలు చేయడంతో ఆమెపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే తనను క్షమించి వదిలేయాంటూ మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ లకు రాసిన లేఖ వైరల్ గా మారింది.
జగన్, లోకేష్ లకు శ్రీరెడ్డి స్వయంగా రాసిన లేఖ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.లోకేష్ తో నేరు మాట్లాడి క్షమాపణలు కోరే స్థాయి తనకు లేక ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నానని అన్నారు. పది రోజులుగా తన కామెంట్ల గురించి అందరూ మాట్లాడుతున్నారని, అది చూసిన తర్వాత తాను ఇంతకాలం ఎంతమందిని బాధపెట్టానో తెలిసి వచ్చిందని పశ్చాత్తాప పడింది శ్రీరెడ్డి. గోదావరిలో పుట్టి విజయవాడలో పెరిగిన తనకు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే 95% స్నేహితులు అని, తన తల్లిదండ్రులు టీడీపీకే ఓటు వేశారని చెప్పింది.
తన సినీ, రాజకీయ జీవితం ముగిసిపోయిందని, వారం రోజులుగా తిండీ నిద్ర లేకుండా కుమిలిపోతున్నానని చెప్పుకొచ్చింది. తనను శిక్షించినా, కొట్టినా ఆ గాయాలు కొన్నాళ్లకు మానతాయని, తన కుటుంబంలో పెళ్లి కావాల్సిన ముగ్గురు ఆడపిల్లలున్నారని చెప్పింది. వారి గురించి ఆలోచించి తనను క్షమించాలని, చాలా సంవత్సరాలకు సరిపడా క్షోభ తాము అనుభవించామని, ఇకపై తనను వదిలివేయాలని విజ్ఞప్తి చేసింది. లోకేష్ అన్నా ఇకపై ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని, తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, తనను క్షమించాలని వేడుకుంది.
ఇక, వైైసీపీ సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, కానీ, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వచ్చి నష్టం జరిగిందని అంచనా వేయలేకపోయానని చెప్పింది. ఆ తప్పు తెలుసుకుని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, భవిష్యత్తులో రాజకీయాల జోలికి రానని చెప్పింది. ఒకవేళ రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తాను టీడీపీ, జనసేన, బీజేపీ, షర్మిలలను విమర్శించబోనని, అలా చేస్తే తనకు ఏ శిక్ష విధించినా ఓకే అని చెప్పింది.
శ్రీరెడ్డి లేఖపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అడుసు తొక్కనేల..కాలు కడగనేల అంటూ ఏకిపారేస్తున్నారు. వైసీపీ నాయకుల అండ చూసుకొని పేట్రేగిపోయిన శ్రీరెడ్డి…ఇప్పుడు అరెస్టు భయంతో కాళ్లబేరానికి వచ్చిందని అంటున్నారు. కానీ, కర్మ ఎవరినీ వదలదని…చేసిన తప్పులకు ఆమె చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని చెబుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న శ్రీరెడ్డికి శిక్ష తప్పదని అంటున్నారు.
This post was last modified on November 14, 2024 2:41 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…