Political News

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న శ్రీరెడ్డి

వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న సంగతి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిిందే. ఈ క్రమంలోనే నటి, వైసీపీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డిపై కూడా కేసు నమోదైంది. నీచమైన భాషలో బూతులతో చంద్రబాబు మొదలు షర్మిల వరకు అందరిపై శ్రీరెడ్డి బూతుపురాణంతో విమర్శలు చేయడంతో ఆమెపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే తనను క్షమించి వదిలేయాంటూ మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ లకు రాసిన లేఖ వైరల్ గా మారింది.

జగన్, లోకేష్ లకు శ్రీరెడ్డి స్వయంగా రాసిన లేఖ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.లోకేష్ తో నేరు మాట్లాడి క్షమాపణలు కోరే స్థాయి తనకు లేక ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నానని అన్నారు. పది రోజులుగా తన కామెంట్ల గురించి అందరూ మాట్లాడుతున్నారని, అది చూసిన తర్వాత తాను ఇంతకాలం ఎంతమందిని బాధపెట్టానో తెలిసి వచ్చిందని పశ్చాత్తాప పడింది శ్రీరెడ్డి. గోదావరిలో పుట్టి విజయవాడలో పెరిగిన తనకు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే 95% స్నేహితులు అని, తన తల్లిదండ్రులు టీడీపీకే ఓటు వేశారని చెప్పింది.

తన సినీ, రాజకీయ జీవితం ముగిసిపోయిందని, వారం రోజులుగా తిండీ నిద్ర లేకుండా కుమిలిపోతున్నానని చెప్పుకొచ్చింది. తనను శిక్షించినా, కొట్టినా ఆ గాయాలు కొన్నాళ్లకు మానతాయని, తన కుటుంబంలో పెళ్లి కావాల్సిన ముగ్గురు ఆడపిల్లలున్నారని చెప్పింది. వారి గురించి ఆలోచించి తనను క్షమించాలని, చాలా సంవత్సరాలకు సరిపడా క్షోభ తాము అనుభవించామని, ఇకపై తనను వదిలివేయాలని విజ్ఞప్తి చేసింది. లోకేష్ అన్నా ఇకపై ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని, తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, తనను క్షమించాలని వేడుకుంది.

ఇక, వైైసీపీ సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, కానీ, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వచ్చి నష్టం జరిగిందని అంచనా వేయలేకపోయానని చెప్పింది. ఆ తప్పు తెలుసుకుని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, భవిష్యత్తులో రాజకీయాల జోలికి రానని చెప్పింది. ఒకవేళ రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తాను టీడీపీ, జనసేన, బీజేపీ, షర్మిలలను విమర్శించబోనని, అలా చేస్తే తనకు ఏ శిక్ష విధించినా ఓకే అని చెప్పింది.

శ్రీరెడ్డి లేఖపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అడుసు తొక్కనేల..కాలు కడగనేల అంటూ ఏకిపారేస్తున్నారు. వైసీపీ నాయకుల అండ చూసుకొని పేట్రేగిపోయిన శ్రీరెడ్డి…ఇప్పుడు అరెస్టు భయంతో కాళ్లబేరానికి వచ్చిందని అంటున్నారు. కానీ, కర్మ ఎవరినీ వదలదని…చేసిన తప్పులకు ఆమె చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని చెబుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న శ్రీరెడ్డికి శిక్ష తప్పదని అంటున్నారు.

Satya

Recent Posts

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

39 minutes ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

2 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

2 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

3 hours ago

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

3 hours ago

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

3 hours ago