Political News

జనం డబ్బుతో చంద్రబాబును తిట్టించిన జగన్

జనం డబ్బుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, షర్మిల, విజయమ్మ, సునీతలను జగన్ బూతులు తిట్టించారా? అంటే అవును అని ఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత ఆరోపిస్తున్నారు.

జగన్ హయాంలో ఏపీ డిజిటల్ కార్పోరేషన్ చైర్మన్ గా వాసుదేవరెడ్డిని నియమించిందని, నెలకు మూడున్నర లక్షల రూపాయల జీతం కూడా ఇచ్చిందని అనిత చెప్పారు. ఆ కార్పొరేషన్ కు ప్రభుత్వం ఇచ్చిన నిధులతో సోషల్ మీడియా వ్యవస్థల్ని నడిపించి టీడీపీ, జనసేన నేతలను తిట్టించారని అనిత ఆరోపించారు.

టీడీపీ, జనసేన నేతలను బూతులు తిట్టి మార్ఫింగ్ వీడియోలు పెట్టడానికి ప్రజాధనం వాడారని, అది జగన్ జేబులో సొమ్ము కాదు..ప్రజల సొమ్ము అని అన్నారు. ఇలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారని, వీళ్లు నేరస్థుల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు కాదా అని ప్రశ్నించారు.

స్టేట్ మొత్తానికి కలిపి 130 మంది మెయిన్ కేడర్ ఈ సోషల్ మీడియా కోసం పని చేశారని, 400 గ్రూపులు, 40 యూట్యూబ్ ఛానెళ్లు ఈ విష ప్రచారం కోసం పనిచేశాయని ఆరోపించారు.

సజ్జల భార్గవ్ చార్జ్ తీసుకున్న తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెరిగాయని వర్రా రవీందర్ రెడ్డి చెప్పారని అనిత అన్నారు. ప్రస్తుతం అరెస్టయిన అర్జున్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడని చెప్పారు.

ఇలాంటి ఇడియట్స్ గురించి ఎన్ హెచ్ ఆర్సీకి వెళ్లామా అని పెద్దల సభకు వెళ్లిన పెద్ద మనుషులకు తెలియాలని అన్నారు. నీ తల్లిని, చెల్లిని లేపేయమని, బూతులు తిట్టిన వ్యక్తిని అరెస్టు చేస్తే ..వారిది అక్రమ అరెస్టు అని ఖండించడానికి నోరు ఎలా వచ్చింది జగన్ అని అనిత ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా క్రైం కథా చిత్రం ఇది అంటూ వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on November 14, 2024 11:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

27 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

5 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

7 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

7 hours ago