అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ కుంటి సాకులు చెబుతున్నారని, సభ అంటే గౌరవం లేని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు ఏపీపీసీసీ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిల డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 1.7 శాతం ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని షర్మిల వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ కు తాజాగా షర్మిల మరోసారి కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీకి వెళ్లని పక్షంలో జగన్ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చినా, కాంగ్రెస్ కు 1.7 శాతం ఓట్లు వచ్చినా ఈ రెండు పార్టీలకు పెద్ద తేడా లేదని షర్మిల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది జగన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ బాగోలేదని జగన్ కంటే ముందు స్పందించింది తానేనని గుర్తు చేశారు. 38 శాతం ఓట్ షేర్ ఉన్నా అసెంబ్లీకి పోకుండా వైసీపీని ఒక “ఇన్ సిగ్నిఫికెంట్” పార్టీగా మార్చింది జగన్ అని చురకలంటించారు.
అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యల కోసం పోరాడకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని అసమర్థ పార్టీగా వైసీపీ మిగిలిందని విమర్శించారు. అసలైన “ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ” వైసీపీకి ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదని చురకలంటించారు. సొంత మైకుల ముందు అసెంబ్లీ పెట్టడం కాదని, అసెంబ్లీకి వెళ్లి అక్కడ మైకుల ముందు మాట్లాడాలని అన్నారు.
ప్రతిపక్ష హోదా లేకున్నా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాపక్షం అనిపించుకోవాలని. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలని, ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఏ పార్టీ ఇన్ సిగ్నిఫికెంట్.. ఏ పార్టీ ఇంపార్టెంట్ అన్న విషయం తేలుతుంది కదా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే…దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, పవన్, లోకేష్, బీజేపీ నేతలను సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలని డిమాండ్ చేశారు.
This post was last modified on November 14, 2024 11:11 am
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…