Political News

జగన్ కు కౌంటర్ ఇవ్వడంలో షర్మిల స్పీడ్

అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ కుంటి సాకులు చెబుతున్నారని, సభ అంటే గౌరవం లేని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు ఏపీపీసీసీ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిల డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 1.7 శాతం ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని షర్మిల వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ కు తాజాగా షర్మిల మరోసారి కౌంటర్ ఇచ్చారు.

అసెంబ్లీకి వెళ్లని పక్షంలో జగన్ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చినా, కాంగ్రెస్ కు 1.7 శాతం ఓట్లు వచ్చినా ఈ రెండు పార్టీలకు పెద్ద తేడా లేదని షర్మిల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది జగన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ బాగోలేదని జగన్ కంటే ముందు స్పందించింది తానేనని గుర్తు చేశారు. 38 శాతం ఓట్ షేర్ ఉన్నా అసెంబ్లీకి పోకుండా వైసీపీని ఒక “ఇన్ సిగ్నిఫికెంట్” పార్టీగా మార్చింది జగన్ అని చురకలంటించారు.

అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యల కోసం పోరాడకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని అసమర్థ పార్టీగా వైసీపీ మిగిలిందని విమర్శించారు. అసలైన “ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ” వైసీపీకి ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదని చురకలంటించారు. సొంత మైకుల ముందు అసెంబ్లీ పెట్టడం కాదని, అసెంబ్లీకి వెళ్లి అక్కడ మైకుల ముందు మాట్లాడాలని అన్నారు.

ప్రతిపక్ష హోదా లేకున్నా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాపక్షం అనిపించుకోవాలని. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలని, ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఏ పార్టీ ఇన్ సిగ్నిఫికెంట్.. ఏ పార్టీ ఇంపార్టెంట్ అన్న విషయం తేలుతుంది కదా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే…దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, పవన్, లోకేష్, బీజేపీ నేతలను సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలని డిమాండ్ చేశారు.

This post was last modified on November 14, 2024 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

12 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

33 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago