టాలీవుడ్ బాక్సాఫీస్ మరో ఆసక్తికరమైన క్లాష్ కు సిద్ధమయ్యింది. ఆయా హీరోలకు తమ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రెండు సినిమాలు పోటీకి సిద్ధపడటం ఆసక్తి రేపుతోంది. మొదటిది కంగువ. పేరుకి డబ్బింగ్ మూవీ అయినప్పటికీ సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ వల్ల మంచి ఓపెనింగ్స్ కి రంగం సిద్ధమయ్యింది. పివిఆర్, ఏషియన్ లతో మైత్రికి బిజినెస్ పరంగా తలెత్తిన ఇష్యూ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో విపరీతమైన జాప్యం జరిగినప్పటికీ ఆడియన్స్ మాత్రం ఈ గ్రాండియర్ ని చూసేందుకు రెడీగా ఉన్నారు. ట్రైలర్లు, పాటలు, సూర్య గెటప్, వందల కోట్ల బడ్జెట్ అంచనాలు పెంచేశాయి.
కాకపోతే బాహుబలి, కెజిఎఫ్ రేంజ్ కంటే ఎక్కువగా ఉంటుందని దర్శక నిర్మాతలు ఊరిస్తున్నారు కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకుని మెప్పిస్తే రికార్డుల పరంగా అద్భుతాలు సృష్టిస్తుంది. ఇక మట్కా మీద అంతగా హైప్ కనిపించకపోయినా దర్శకుడు కరుణ కుమార్ మాత్రం ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకునే స్థాయిలో ఉంటుందని చెప్పడం చూస్తే కంటెంట్ మీద ఎంత నమ్మకముందో అర్థమవుతుంది. వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. వరస డిజాస్టర్ల నుంచి నేర్చుకుని పొరపాట్లు లేకుండా మట్కా విషయంలో జాగ్రత్త తీసుకున్నామని చెబుతున్నాడు కనక అభిమానులు ఆశలు పెట్టుకోవచ్చనేలా ఉంది.
కంగువ, మట్కా సక్సెస్ అయితే దీపావళి మూడు హిట్లు ఇచ్చిన జోష్ వీటి నుంచి కొనసాగుతుంది. అమరన్, లక్కీ భాస్కర్, క క్రమంగా నెమ్మదించిన నేపథ్యంలో బయ్యర్ల ఆశలన్నీ వరుణ్ తేజ్, సూర్యల మీద ఉన్నాయి. బాలీవుడ్ వైపు నుంచి పెద్దగా పోటీ లేకపోవడం కలిసి వచ్చే అంశం. అంతగా బజ్ లేని సబర్మతి రిపోర్ట్ గురించి టెన్షన్ పడేందుకు ఏమి లేదు. వచ్చే వారం మెకానిక్ రాకీ, దేవకీనందన వాసుదేవ, జిబ్రాలతో ట్రయాంగిల్ పోటీ ఉన్న నేపథ్యంలో మొదటి వారం కంగువ, మట్కాలకు పాజిటివ్ టాక్ చాలా కీలకం. ఓవర్సీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా వినిపిస్తున్నాయి. చూడాలి మరి విజేతలు సంయుక్తంగా ఉంటారో లేదో.
This post was last modified on November 14, 2024 10:23 am
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…