ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు వచ్చాయి. ఇది ప్రజారంజక బడ్జెట్ అని కూటమి పార్టీల నేతలు చెబుతుంటే వైసీపీ నేతలు మాత్రం ఈ బడ్జెట్ విఫలమైందని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బడ్జెట్ పై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు.
ఈ బడ్జెట్ చూస్తే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అన్న విషయం అర్థం అవుతోందని జగన్ సెటైర్లు వేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా మోసగించిన విషయం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే బడ్జెట్ ప్రవేశపెట్టకుండా జాప్యం చేశారని ఆరోపించారు. తన హయాంలో ఏపీ అప్పులు శ్రీలంకను మించిపోతున్నాయని తప్పుడు ప్రచారం చేశారని. దత్తపుత్రుడితో కూడా ఇదే విషయం మాట్లాడించారని చెప్పారు.
ఏపీకి 14 లక్షల కోట్ల అప్పు ఉందని ఎన్నికలకు ముందు ప్రచారం చేశారని, అవే అబద్దాలను గవర్నర్ తో కూడా చెప్పించారని జగన్ అన్నారు. కానీ, తాజాగా బడ్జెట్ లో 6.46 లక్షల కోట్ల అప్పుల మాత్రమే చూపించారని జగన్ వెల్లడించారు. 2019లో తాను అధికారం చేపట్టినప్పుడు 3.13 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందని, తాను దిగిపోయే నాటికి 6.46 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందని చెప్పారు. చంద్రబాబు హయాంలో అప్పులు 19% పెరిగాయని, తన హయాంలో 15% మాత్రమే పెరిగాయని జగన్ అన్నారు.
కాబట్టి చంద్రబాబుకు అప్పురత్న పురస్కారం ఇవ్వాలని చురకలంటించారు. సూపర్ సిక్స్ హామీలకు ఎగనామం పెట్టేందుకే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపు 17వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు వసూలు చేశారని, ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు చేసిన నిర్వాకం ఇదని విమర్శించారు.
This post was last modified on November 13, 2024 10:28 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…