పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ పై ఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే జగన్ ఇంకా రోడ్లపై తిరుగగలుగుతున్నారని అనిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టే వారిని అరెస్టు చేస్తే మానవ హక్కులు హరిస్తున్నారని జగన్ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.
అటువంటి వారిని పోలీస్ స్టేషన్ కు కాకుండా ఎక్కడికి తీసుకువెళతారని ప్రశ్నించారు. అమాయకులపై వైసీపీ నేతలు గతంలో కేసులు పెట్టి హింసిచారని, కానీ, ఈ రోజు అరెస్టులపై ఎన్హెచ్ఆర్సీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. సొంత తల్లి, చెల్లిని తిట్టిన నేరస్తులకు, జడ్జిలపై అభ్యంతరక పోస్టులు పెట్టిన వారికి జగన్ సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలను దూషిస్తే రాయలసీమ ప్రజలు ఊరుకోరని, అందుకే మహిళలపై తప్పుడు పోస్టులు పెట్టేవారిని చంద్రబాబు ఉపేక్షించబోరని అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
గతంలో మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన జగన్ కు అంబేద్కర్ రాజ్యాంగం కనిపించడని కౌంటర్ ఇచ్చారు. డిజిటల్ కార్పోరేషన్ ఎండా వాసుదేవరెడ్డి గత ప్రభుత్వ నిధులతో సోషల్ మీడియా వ్యవస్థల్ని నడిపించారని అనిత ఆరోపించారు.
This post was last modified on November 13, 2024 10:02 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…