పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ పై ఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే జగన్ ఇంకా రోడ్లపై తిరుగగలుగుతున్నారని అనిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టే వారిని అరెస్టు చేస్తే మానవ హక్కులు హరిస్తున్నారని జగన్ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.
అటువంటి వారిని పోలీస్ స్టేషన్ కు కాకుండా ఎక్కడికి తీసుకువెళతారని ప్రశ్నించారు. అమాయకులపై వైసీపీ నేతలు గతంలో కేసులు పెట్టి హింసిచారని, కానీ, ఈ రోజు అరెస్టులపై ఎన్హెచ్ఆర్సీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. సొంత తల్లి, చెల్లిని తిట్టిన నేరస్తులకు, జడ్జిలపై అభ్యంతరక పోస్టులు పెట్టిన వారికి జగన్ సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలను దూషిస్తే రాయలసీమ ప్రజలు ఊరుకోరని, అందుకే మహిళలపై తప్పుడు పోస్టులు పెట్టేవారిని చంద్రబాబు ఉపేక్షించబోరని అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
గతంలో మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన జగన్ కు అంబేద్కర్ రాజ్యాంగం కనిపించడని కౌంటర్ ఇచ్చారు. డిజిటల్ కార్పోరేషన్ ఎండా వాసుదేవరెడ్డి గత ప్రభుత్వ నిధులతో సోషల్ మీడియా వ్యవస్థల్ని నడిపించారని అనిత ఆరోపించారు.
This post was last modified on November 13, 2024 10:02 pm
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…