వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై కూటమి నేతలు వర్సెస్ వైసీపీ అన్న రీతిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. గత ప్రభుత్వం అండతో నోటికి వచ్చినట్లు పోస్టులు పెట్టడంతోనే వారిని ఇప్పుడు చట్ట ప్రకారం అరెస్టు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, రాజకీయ కక్షతోనే కేసులు పెడుతున్నారని, అటువంటి పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సూపర్ సిక్స్ అమలుకు కావాల్సిన నిధులకు, వాటి కోసం బడ్జెట్ లో కేటాయించిన నిధులకు పొంతనే లేదని, ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన మోసాలపై 420 కేసు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని జగన్ ప్రశ్నించారు.
అంతేకాదు, చంద్రబాబు మోసాలపై తాను కూడా ట్వీట్ చేస్తానని, వైసీపీ నేతలు, కార్యకర్తలూ అందపూ ట్వీట్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో ఈ మోసం గురించి ప్రచారం చేయాలని జగన్ పిలుపునిచ్చారు.
ఎంతమందిపై ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, అరెస్టు చేయాలంటే నాతోనే మొదలుబెట్టండి అంటూ జగన్ సవాల్ విసిరారు. అబద్ధపు హామీలిచ్చిన చంద్రబాబు…జగన్ పై ఆ నెపం నెడుతున్నారని, బాధగా ఉందంటూ దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ నటనకు మించి నటిస్తున్నారని సెటైర్లు వేశారు.
చంద్రబాబు యాక్షన్ ముందు ఎన్టీఆర్ నటన నథింగ్ అని చురకలంటించారు. అసెంబ్లీ జరిగినంత కాలం వైసీపీ ఎమ్మెల్యేలు మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని జగన్ అన్నారు.
This post was last modified on November 13, 2024 10:01 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…