Political News

షర్మిల వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన జగన్

ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీకి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన నేపథ్యంలో జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ కు అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం, సామర్థ్యం లేకుంటే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల వ్యాఖ్యలపై జగన్ తొలిసారి స్పందించారు.

అసెంబ్లీకి వెళ్లని వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలన్న షర్మిల డిమాండ్ పై స్పందించాలని జగన్ ను ఓ మీడియా ప్రతినిధి కోరగా అందుకు జగన్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తనతోపాటు వైసీపీ సభ్యులను డిస్ క్వాలిఫై చేస్తారని ప్రచారం జరుగుతోదంని, కానీ, తనను, వైసీపీ సభ్యులను డిస్ క్వాలిఫై చేసే అధికారం వీరికి లేదని జగన్ అన్నారు. ఒకవేళ తనను డిస్ క్వాలిఫై చేయాలనుకుంటే తాను రెడీ అని, తాను ఇక్కడే ఉన్నానని, డిస్ క్వాలిఫై చేసుకోవచ్చని జగన్ ఛాలెంజ్ చేశారు.

ఇక, తన చెల్లెలి గురించి ఇక్కడ మాట్లాడవద్దని జగన్ అన్నారు. అయినా, ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీ గురించి, 1.17 శాతం ఓటు బ్యాంక్ ఉన్న ఆ పార్టీ గురించి మాట్లాడడం అనవసరమని జగన్ తేల్చేశారు.

ఇక, 2019లో చంద్రబాబు పోతూ పోతూ తన ప్రభుత్వానికి ఎన్నో గిఫ్ట్ లు ఇచ్చారని, 42 వేల 183 కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చి వెళ్లారని జగన్ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత అప్పులంటూ తనపై దుష్ప్రచారం చేశారని అన్నారు. చంద్రబాబు కన్నా తాను తక్కవ అప్పులే చేశానని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా పెట్టిన బడ్జెట్ లో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు.

This post was last modified on November 13, 2024 9:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

1 hour ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

2 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

3 hours ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

5 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

5 hours ago