Political News

షర్మిల వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన జగన్

ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీకి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన నేపథ్యంలో జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ కు అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం, సామర్థ్యం లేకుంటే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల వ్యాఖ్యలపై జగన్ తొలిసారి స్పందించారు.

అసెంబ్లీకి వెళ్లని వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలన్న షర్మిల డిమాండ్ పై స్పందించాలని జగన్ ను ఓ మీడియా ప్రతినిధి కోరగా అందుకు జగన్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తనతోపాటు వైసీపీ సభ్యులను డిస్ క్వాలిఫై చేస్తారని ప్రచారం జరుగుతోదంని, కానీ, తనను, వైసీపీ సభ్యులను డిస్ క్వాలిఫై చేసే అధికారం వీరికి లేదని జగన్ అన్నారు. ఒకవేళ తనను డిస్ క్వాలిఫై చేయాలనుకుంటే తాను రెడీ అని, తాను ఇక్కడే ఉన్నానని, డిస్ క్వాలిఫై చేసుకోవచ్చని జగన్ ఛాలెంజ్ చేశారు.

ఇక, తన చెల్లెలి గురించి ఇక్కడ మాట్లాడవద్దని జగన్ అన్నారు. అయినా, ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీ గురించి, 1.17 శాతం ఓటు బ్యాంక్ ఉన్న ఆ పార్టీ గురించి మాట్లాడడం అనవసరమని జగన్ తేల్చేశారు.

ఇక, 2019లో చంద్రబాబు పోతూ పోతూ తన ప్రభుత్వానికి ఎన్నో గిఫ్ట్ లు ఇచ్చారని, 42 వేల 183 కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చి వెళ్లారని జగన్ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత అప్పులంటూ తనపై దుష్ప్రచారం చేశారని అన్నారు. చంద్రబాబు కన్నా తాను తక్కవ అప్పులే చేశానని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా పెట్టిన బడ్జెట్ లో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు.

This post was last modified on November 13, 2024 9:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

4 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

6 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

8 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

8 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

10 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

12 hours ago