Political News

ఆ రెండు అమ‌రావ‌తిలోనే.. రివ‌ర్స్ చ‌ట్టానికి కూట‌మి స‌ర్కారు రెడీ!

రాజ‌ధానిగా అమరావ‌తిని గుర్తించ‌డంలో వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఈ క్ర‌మంలో తీసుకు న్న రెండు కీల‌క నిర్ణ‌యాలు.. తాజాగా హైకోర్టులో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. వైసీపీ హ‌యాంలో తీసుకున్న రెండు కీల‌క నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని, వాటికి అనుగుణంగా మ‌ళ్లీ తాము రివ‌ర్స్ చ‌ట్టం చేస్తామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో హైకోర్టు స‌ద‌రు కేసును నాలుగు నెల‌ల‌కు వాయిదా వేసింది.

ఏంటీ చ‌ట్టం..

జ‌గ‌న్ హ‌యాంలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌నను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇది పెద్ద ర‌గ‌డ‌కు దారి తీసింది. అయిన‌ప్ప‌టికీ మొండిగానే అప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వం ముందుకు సాగింది. ఈ క్ర‌మంలోనే త‌మ‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేర‌ని పేర్కొంటూ.. రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. 1) ఏపీ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌, 2) ఏపీ లోకాయుక్త‌. ఈ రెండింటినీ.. వాస్త‌వానికి గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలోనే ఉంచాల‌ని నిర్ణ‌యించింది.

కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వాటిని క‌ర్నూలుకు త‌ర‌లించారు. హ‌డావుడిగా వాటికి కార్యా ల‌యాల‌ను కూడా కేటాయించారు. అద్దె ప్రాతిప‌దిక‌న క‌ర్నూలులో మాన‌వ హ‌క్కుల‌కమిష‌న్‌, లోకాయుక్త ల‌కు కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేశారు. క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధాని చేస్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. అయితే.. వీటిని స‌వాల్ చేస్తూ.. అప్ప‌ట్లోనే హైకోర్టులో పిటిష‌న్లు ప‌డ్డాయి. అయితే.. స‌ర్కారు మార‌డంతో ఇప్పుడు వాటిపై కూట‌మి ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంది.

రాష్ట్ర రాజ‌ధానిని అమ‌రావ‌తిగానే గుర్తించినందున మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కార్యాల‌యాన్ని, లోకాయు క్త‌ల‌ను కూడా.. అమ‌రావ‌తిలోనే ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు పేర్కొంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే మ‌రోసారి చ‌ట్టం చేయ‌నున్న‌ట్టు తెలిపింది. అంతేకాదు.. వైసీపీ హ‌యాంలో చేసిన చ‌ట్టాన్ని ర‌ద్దు చేయ‌నున్న‌ట్టు కోర్టుకు వివ‌రించింది. దీంతో ప్ర‌స్తుత విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని కోరింది. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న హైకోర్టు ఈ విచార‌ణ‌ను నాలుగు మాసాల‌కు వాయిదా వేసింది.

This post was last modified on November 13, 2024 8:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

8 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

29 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago