Political News

ఆ రెండు అమ‌రావ‌తిలోనే.. రివ‌ర్స్ చ‌ట్టానికి కూట‌మి స‌ర్కారు రెడీ!

రాజ‌ధానిగా అమరావ‌తిని గుర్తించ‌డంలో వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఈ క్ర‌మంలో తీసుకు న్న రెండు కీల‌క నిర్ణ‌యాలు.. తాజాగా హైకోర్టులో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. వైసీపీ హ‌యాంలో తీసుకున్న రెండు కీల‌క నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని, వాటికి అనుగుణంగా మ‌ళ్లీ తాము రివ‌ర్స్ చ‌ట్టం చేస్తామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో హైకోర్టు స‌ద‌రు కేసును నాలుగు నెల‌ల‌కు వాయిదా వేసింది.

ఏంటీ చ‌ట్టం..

జ‌గ‌న్ హ‌యాంలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌నను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇది పెద్ద ర‌గ‌డ‌కు దారి తీసింది. అయిన‌ప్ప‌టికీ మొండిగానే అప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వం ముందుకు సాగింది. ఈ క్ర‌మంలోనే త‌మ‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేర‌ని పేర్కొంటూ.. రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. 1) ఏపీ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌, 2) ఏపీ లోకాయుక్త‌. ఈ రెండింటినీ.. వాస్త‌వానికి గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలోనే ఉంచాల‌ని నిర్ణ‌యించింది.

కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వాటిని క‌ర్నూలుకు త‌ర‌లించారు. హ‌డావుడిగా వాటికి కార్యా ల‌యాల‌ను కూడా కేటాయించారు. అద్దె ప్రాతిప‌దిక‌న క‌ర్నూలులో మాన‌వ హ‌క్కుల‌కమిష‌న్‌, లోకాయుక్త ల‌కు కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేశారు. క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధాని చేస్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. అయితే.. వీటిని స‌వాల్ చేస్తూ.. అప్ప‌ట్లోనే హైకోర్టులో పిటిష‌న్లు ప‌డ్డాయి. అయితే.. స‌ర్కారు మార‌డంతో ఇప్పుడు వాటిపై కూట‌మి ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంది.

రాష్ట్ర రాజ‌ధానిని అమ‌రావ‌తిగానే గుర్తించినందున మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కార్యాల‌యాన్ని, లోకాయు క్త‌ల‌ను కూడా.. అమ‌రావ‌తిలోనే ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు పేర్కొంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే మ‌రోసారి చ‌ట్టం చేయ‌నున్న‌ట్టు తెలిపింది. అంతేకాదు.. వైసీపీ హ‌యాంలో చేసిన చ‌ట్టాన్ని ర‌ద్దు చేయ‌నున్న‌ట్టు కోర్టుకు వివ‌రించింది. దీంతో ప్ర‌స్తుత విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని కోరింది. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న హైకోర్టు ఈ విచార‌ణ‌ను నాలుగు మాసాల‌కు వాయిదా వేసింది.

This post was last modified on November 13, 2024 8:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

33 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago