రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా హైకోర్టులో చర్చకు వచ్చాయి. అయితే.. వైసీపీ హయాంలో తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామని, వాటికి అనుగుణంగా మళ్లీ తాము రివర్స్ చట్టం చేస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు సదరు కేసును నాలుగు నెలలకు వాయిదా వేసింది.
ఏంటీ చట్టం..
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇది పెద్ద రగడకు దారి తీసింది. అయినప్పటికీ మొండిగానే అప్పటి వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగింది. ఈ క్రమంలోనే తమను ఎవరూ ప్రశ్నించలేరని పేర్కొంటూ.. రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. 1) ఏపీ మానవహక్కుల కమిషన్, 2) ఏపీ లోకాయుక్త. ఈ రెండింటినీ.. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలోనే ఉంచాలని నిర్ణయించింది.
కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాటిని కర్నూలుకు తరలించారు. హడావుడిగా వాటికి కార్యా లయాలను కూడా కేటాయించారు. అద్దె ప్రాతిపదికన కర్నూలులో మానవ హక్కులకమిషన్, లోకాయుక్త లకు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కర్నూలును న్యాయరాజధాని చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే.. వీటిని సవాల్ చేస్తూ.. అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. అయితే.. సర్కారు మారడంతో ఇప్పుడు వాటిపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.
రాష్ట్ర రాజధానిని అమరావతిగానే గుర్తించినందున మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని, లోకాయు క్తలను కూడా.. అమరావతిలోనే ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. దీనికి సంబంధించి త్వరలోనే మరోసారి చట్టం చేయనున్నట్టు తెలిపింది. అంతేకాదు.. వైసీపీ హయాంలో చేసిన చట్టాన్ని రద్దు చేయనున్నట్టు కోర్టుకు వివరించింది. దీంతో ప్రస్తుత విచారణను వాయిదా వేయాలని కోరింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ విచారణను నాలుగు మాసాలకు వాయిదా వేసింది.
This post was last modified on November 13, 2024 8:45 pm
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…