Political News

ఆ రెండు అమ‌రావ‌తిలోనే.. రివ‌ర్స్ చ‌ట్టానికి కూట‌మి స‌ర్కారు రెడీ!

రాజ‌ధానిగా అమరావ‌తిని గుర్తించ‌డంలో వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఈ క్ర‌మంలో తీసుకు న్న రెండు కీల‌క నిర్ణ‌యాలు.. తాజాగా హైకోర్టులో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. వైసీపీ హ‌యాంలో తీసుకున్న రెండు కీల‌క నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని, వాటికి అనుగుణంగా మ‌ళ్లీ తాము రివ‌ర్స్ చ‌ట్టం చేస్తామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో హైకోర్టు స‌ద‌రు కేసును నాలుగు నెల‌ల‌కు వాయిదా వేసింది.

ఏంటీ చ‌ట్టం..

జ‌గ‌న్ హ‌యాంలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌నను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇది పెద్ద ర‌గ‌డ‌కు దారి తీసింది. అయిన‌ప్ప‌టికీ మొండిగానే అప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వం ముందుకు సాగింది. ఈ క్ర‌మంలోనే త‌మ‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేర‌ని పేర్కొంటూ.. రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. 1) ఏపీ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌, 2) ఏపీ లోకాయుక్త‌. ఈ రెండింటినీ.. వాస్త‌వానికి గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలోనే ఉంచాల‌ని నిర్ణ‌యించింది.

కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వాటిని క‌ర్నూలుకు త‌ర‌లించారు. హ‌డావుడిగా వాటికి కార్యా ల‌యాల‌ను కూడా కేటాయించారు. అద్దె ప్రాతిప‌దిక‌న క‌ర్నూలులో మాన‌వ హ‌క్కుల‌కమిష‌న్‌, లోకాయుక్త ల‌కు కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేశారు. క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధాని చేస్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. అయితే.. వీటిని స‌వాల్ చేస్తూ.. అప్ప‌ట్లోనే హైకోర్టులో పిటిష‌న్లు ప‌డ్డాయి. అయితే.. స‌ర్కారు మార‌డంతో ఇప్పుడు వాటిపై కూట‌మి ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంది.

రాష్ట్ర రాజ‌ధానిని అమ‌రావ‌తిగానే గుర్తించినందున మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కార్యాల‌యాన్ని, లోకాయు క్త‌ల‌ను కూడా.. అమ‌రావ‌తిలోనే ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు పేర్కొంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే మ‌రోసారి చ‌ట్టం చేయ‌నున్న‌ట్టు తెలిపింది. అంతేకాదు.. వైసీపీ హ‌యాంలో చేసిన చ‌ట్టాన్ని ర‌ద్దు చేయ‌నున్న‌ట్టు కోర్టుకు వివ‌రించింది. దీంతో ప్ర‌స్తుత విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని కోరింది. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న హైకోర్టు ఈ విచార‌ణ‌ను నాలుగు మాసాల‌కు వాయిదా వేసింది.

This post was last modified on November 13, 2024 8:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

8 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

35 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

57 minutes ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago