Political News

ఆ రెండు అమ‌రావ‌తిలోనే.. రివ‌ర్స్ చ‌ట్టానికి కూట‌మి స‌ర్కారు రెడీ!

రాజ‌ధానిగా అమరావ‌తిని గుర్తించ‌డంలో వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఈ క్ర‌మంలో తీసుకు న్న రెండు కీల‌క నిర్ణ‌యాలు.. తాజాగా హైకోర్టులో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. వైసీపీ హ‌యాంలో తీసుకున్న రెండు కీల‌క నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని, వాటికి అనుగుణంగా మ‌ళ్లీ తాము రివ‌ర్స్ చ‌ట్టం చేస్తామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో హైకోర్టు స‌ద‌రు కేసును నాలుగు నెల‌ల‌కు వాయిదా వేసింది.

ఏంటీ చ‌ట్టం..

జ‌గ‌న్ హ‌యాంలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌నను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇది పెద్ద ర‌గ‌డ‌కు దారి తీసింది. అయిన‌ప్ప‌టికీ మొండిగానే అప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వం ముందుకు సాగింది. ఈ క్ర‌మంలోనే త‌మ‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేర‌ని పేర్కొంటూ.. రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. 1) ఏపీ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌, 2) ఏపీ లోకాయుక్త‌. ఈ రెండింటినీ.. వాస్త‌వానికి గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలోనే ఉంచాల‌ని నిర్ణ‌యించింది.

కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వాటిని క‌ర్నూలుకు త‌ర‌లించారు. హ‌డావుడిగా వాటికి కార్యా ల‌యాల‌ను కూడా కేటాయించారు. అద్దె ప్రాతిప‌దిక‌న క‌ర్నూలులో మాన‌వ హ‌క్కుల‌కమిష‌న్‌, లోకాయుక్త ల‌కు కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేశారు. క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధాని చేస్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. అయితే.. వీటిని స‌వాల్ చేస్తూ.. అప్ప‌ట్లోనే హైకోర్టులో పిటిష‌న్లు ప‌డ్డాయి. అయితే.. స‌ర్కారు మార‌డంతో ఇప్పుడు వాటిపై కూట‌మి ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంది.

రాష్ట్ర రాజ‌ధానిని అమ‌రావ‌తిగానే గుర్తించినందున మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కార్యాల‌యాన్ని, లోకాయు క్త‌ల‌ను కూడా.. అమ‌రావ‌తిలోనే ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు పేర్కొంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే మ‌రోసారి చ‌ట్టం చేయ‌నున్న‌ట్టు తెలిపింది. అంతేకాదు.. వైసీపీ హ‌యాంలో చేసిన చ‌ట్టాన్ని ర‌ద్దు చేయ‌నున్న‌ట్టు కోర్టుకు వివ‌రించింది. దీంతో ప్ర‌స్తుత విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని కోరింది. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న హైకోర్టు ఈ విచార‌ణ‌ను నాలుగు మాసాల‌కు వాయిదా వేసింది.

Kumar

Recent Posts

సురేందర్ రెడ్డి సమస్య ఎప్పుడు తీరెనో

దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…

14 minutes ago

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

41 minutes ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

1 hour ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

3 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

4 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

4 hours ago