రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా హైకోర్టులో చర్చకు వచ్చాయి. అయితే.. వైసీపీ హయాంలో తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామని, వాటికి అనుగుణంగా మళ్లీ తాము రివర్స్ చట్టం చేస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు సదరు కేసును నాలుగు నెలలకు వాయిదా వేసింది.
ఏంటీ చట్టం..
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇది పెద్ద రగడకు దారి తీసింది. అయినప్పటికీ మొండిగానే అప్పటి వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగింది. ఈ క్రమంలోనే తమను ఎవరూ ప్రశ్నించలేరని పేర్కొంటూ.. రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. 1) ఏపీ మానవహక్కుల కమిషన్, 2) ఏపీ లోకాయుక్త. ఈ రెండింటినీ.. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలోనే ఉంచాలని నిర్ణయించింది.
కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాటిని కర్నూలుకు తరలించారు. హడావుడిగా వాటికి కార్యా లయాలను కూడా కేటాయించారు. అద్దె ప్రాతిపదికన కర్నూలులో మానవ హక్కులకమిషన్, లోకాయుక్త లకు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కర్నూలును న్యాయరాజధాని చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే.. వీటిని సవాల్ చేస్తూ.. అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. అయితే.. సర్కారు మారడంతో ఇప్పుడు వాటిపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.
రాష్ట్ర రాజధానిని అమరావతిగానే గుర్తించినందున మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని, లోకాయు క్తలను కూడా.. అమరావతిలోనే ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. దీనికి సంబంధించి త్వరలోనే మరోసారి చట్టం చేయనున్నట్టు తెలిపింది. అంతేకాదు.. వైసీపీ హయాంలో చేసిన చట్టాన్ని రద్దు చేయనున్నట్టు కోర్టుకు వివరించింది. దీంతో ప్రస్తుత విచారణను వాయిదా వేయాలని కోరింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ విచారణను నాలుగు మాసాలకు వాయిదా వేసింది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…