రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా హైకోర్టులో చర్చకు వచ్చాయి. అయితే.. వైసీపీ హయాంలో తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామని, వాటికి అనుగుణంగా మళ్లీ తాము రివర్స్ చట్టం చేస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు సదరు కేసును నాలుగు నెలలకు వాయిదా వేసింది.
ఏంటీ చట్టం..
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇది పెద్ద రగడకు దారి తీసింది. అయినప్పటికీ మొండిగానే అప్పటి వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగింది. ఈ క్రమంలోనే తమను ఎవరూ ప్రశ్నించలేరని పేర్కొంటూ.. రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. 1) ఏపీ మానవహక్కుల కమిషన్, 2) ఏపీ లోకాయుక్త. ఈ రెండింటినీ.. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలోనే ఉంచాలని నిర్ణయించింది.
కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాటిని కర్నూలుకు తరలించారు. హడావుడిగా వాటికి కార్యా లయాలను కూడా కేటాయించారు. అద్దె ప్రాతిపదికన కర్నూలులో మానవ హక్కులకమిషన్, లోకాయుక్త లకు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కర్నూలును న్యాయరాజధాని చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే.. వీటిని సవాల్ చేస్తూ.. అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. అయితే.. సర్కారు మారడంతో ఇప్పుడు వాటిపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.
రాష్ట్ర రాజధానిని అమరావతిగానే గుర్తించినందున మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని, లోకాయు క్తలను కూడా.. అమరావతిలోనే ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. దీనికి సంబంధించి త్వరలోనే మరోసారి చట్టం చేయనున్నట్టు తెలిపింది. అంతేకాదు.. వైసీపీ హయాంలో చేసిన చట్టాన్ని రద్దు చేయనున్నట్టు కోర్టుకు వివరించింది. దీంతో ప్రస్తుత విచారణను వాయిదా వేయాలని కోరింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ విచారణను నాలుగు మాసాలకు వాయిదా వేసింది.
This post was last modified on November 13, 2024 8:45 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…