Political News

ఆ రెండు అమ‌రావ‌తిలోనే.. రివ‌ర్స్ చ‌ట్టానికి కూట‌మి స‌ర్కారు రెడీ!

రాజ‌ధానిగా అమరావ‌తిని గుర్తించ‌డంలో వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఈ క్ర‌మంలో తీసుకు న్న రెండు కీల‌క నిర్ణ‌యాలు.. తాజాగా హైకోర్టులో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. వైసీపీ హ‌యాంలో తీసుకున్న రెండు కీల‌క నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని, వాటికి అనుగుణంగా మ‌ళ్లీ తాము రివ‌ర్స్ చ‌ట్టం చేస్తామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో హైకోర్టు స‌ద‌రు కేసును నాలుగు నెల‌ల‌కు వాయిదా వేసింది.

ఏంటీ చ‌ట్టం..

జ‌గ‌న్ హ‌యాంలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌నను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇది పెద్ద ర‌గ‌డ‌కు దారి తీసింది. అయిన‌ప్ప‌టికీ మొండిగానే అప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వం ముందుకు సాగింది. ఈ క్ర‌మంలోనే త‌మ‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేర‌ని పేర్కొంటూ.. రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. 1) ఏపీ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌, 2) ఏపీ లోకాయుక్త‌. ఈ రెండింటినీ.. వాస్త‌వానికి గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలోనే ఉంచాల‌ని నిర్ణ‌యించింది.

కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వాటిని క‌ర్నూలుకు త‌ర‌లించారు. హ‌డావుడిగా వాటికి కార్యా ల‌యాల‌ను కూడా కేటాయించారు. అద్దె ప్రాతిప‌దిక‌న క‌ర్నూలులో మాన‌వ హ‌క్కుల‌కమిష‌న్‌, లోకాయుక్త ల‌కు కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేశారు. క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధాని చేస్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. అయితే.. వీటిని స‌వాల్ చేస్తూ.. అప్ప‌ట్లోనే హైకోర్టులో పిటిష‌న్లు ప‌డ్డాయి. అయితే.. స‌ర్కారు మార‌డంతో ఇప్పుడు వాటిపై కూట‌మి ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంది.

రాష్ట్ర రాజ‌ధానిని అమ‌రావ‌తిగానే గుర్తించినందున మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కార్యాల‌యాన్ని, లోకాయు క్త‌ల‌ను కూడా.. అమ‌రావ‌తిలోనే ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు పేర్కొంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే మ‌రోసారి చ‌ట్టం చేయ‌నున్న‌ట్టు తెలిపింది. అంతేకాదు.. వైసీపీ హ‌యాంలో చేసిన చ‌ట్టాన్ని ర‌ద్దు చేయ‌నున్న‌ట్టు కోర్టుకు వివ‌రించింది. దీంతో ప్ర‌స్తుత విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని కోరింది. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న హైకోర్టు ఈ విచార‌ణ‌ను నాలుగు మాసాల‌కు వాయిదా వేసింది.

This post was last modified on November 13, 2024 8:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago