Political News

నాడు సభ, నేడు మండలి. రెండూ వద్దంటున్న వైసీపీ

శాసన సభ సమావేశాలను వైసీపీ బాయ్ కాట్ చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తమకు మైక్ ఇవ్వడం లేదని కుంటి సాకులు చెబుతున్న అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వెళ్లకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే, అసెంబ్లీకి వెళ్లని వైసీపీ…శాసన మండలికి మాత్రం వెళ్లడంపై కూడా విమర్శలు వచ్చాయి. సంఖ్యాబలం ఉంది కాబట్టి అక్కడకు వెళుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు.  కానీ, అది కూడా ఒక్క రోజు ముచ్చటే అయింది. తాజాగా నేడు జరిగిన మండలి సమావేశాల నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది.

విశాఖపట్నం జిల్లాలో డయేరియా మరణాలపై సభలో చర్చ జరిగింది. అక్కడ అసలు డయేరియా మరణాలే లేవంటూ మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. కానీ, అక్కడ పదుల సంఖ్యలో డయేరియా మరణాలున్నాయని వైసీపీ ఎమ్మెల్సీలు సభలో నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సత్య కుమార్ వ్యాఖ్యలను నిరసిస్తూ శాసనమండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్‌ చేశారు
ప్రశ్నోత్తరాల సమయంలో మండలి ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సమస్యను లేవనెత్తారు.

గుర్ల గ్రామంలో 200 మంది డయేరియా బారిన పడ్డారని, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయరాని, అధికారులు వచ్చి పరిశీలించారని వివరించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వచ్చి 10 మంది చనిపోయారని చెప్పారని గుర్తు చేశారు. అటువంటి సమయంలో సంబంధిత మంత్రి ఎవరూ చనిపోలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ రూ. 2 లక్షల సహాయం చేశారని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం ప్రకటించలేదని నిలదీశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

This post was last modified on November 13, 2024 4:59 pm

Share

Recent Posts

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

37 minutes ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

2 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

2 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

7 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

14 hours ago