శాసన సభ సమావేశాలను వైసీపీ బాయ్ కాట్ చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తమకు మైక్ ఇవ్వడం లేదని కుంటి సాకులు చెబుతున్న అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వెళ్లకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే, అసెంబ్లీకి వెళ్లని వైసీపీ…శాసన మండలికి మాత్రం వెళ్లడంపై కూడా విమర్శలు వచ్చాయి. సంఖ్యాబలం ఉంది కాబట్టి అక్కడకు వెళుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. కానీ, అది కూడా ఒక్క రోజు ముచ్చటే అయింది. తాజాగా నేడు జరిగిన మండలి సమావేశాల నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది.
విశాఖపట్నం జిల్లాలో డయేరియా మరణాలపై సభలో చర్చ జరిగింది. అక్కడ అసలు డయేరియా మరణాలే లేవంటూ మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. కానీ, అక్కడ పదుల సంఖ్యలో డయేరియా మరణాలున్నాయని వైసీపీ ఎమ్మెల్సీలు సభలో నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సత్య కుమార్ వ్యాఖ్యలను నిరసిస్తూ శాసనమండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు
ప్రశ్నోత్తరాల సమయంలో మండలి ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సమస్యను లేవనెత్తారు.
గుర్ల గ్రామంలో 200 మంది డయేరియా బారిన పడ్డారని, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయరాని, అధికారులు వచ్చి పరిశీలించారని వివరించారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వచ్చి 10 మంది చనిపోయారని చెప్పారని గుర్తు చేశారు. అటువంటి సమయంలో సంబంధిత మంత్రి ఎవరూ చనిపోలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ రూ. 2 లక్షల సహాయం చేశారని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం ప్రకటించలేదని నిలదీశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
This post was last modified on November 13, 2024 4:59 pm
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…