Political News

టీటీడీ కోటేశ్వరరావు.. సామాజిక సేవలను గుర్తించిన బాబు

రాజమహేంద్రవరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో సభ్యుడిగా నియమితులైన అక్కిన ముని కోటేశ్వరరావు తిరుమల సేవకు అర్హత సాధించారు. ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తారని ఎవరు ఉహించలేదు. చర్చల్లోకి చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించినప్పటికి కోటేశ్వరరావు పేరు పెద్దగా హైలెట్ కాలేదు. అయితే ఆయన ఈ బాద్యత అందుకోవడానికి పలు సేవా కార్యక్రమాలు కూడా ప్రధాన కారణం.

సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన కోటేశ్వరరావు పర్సనల్ లైఫ్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తన సామాజిక సేవలను కొనసాగిస్తూ కోటేశ్వరరావు పద్మావతి అమ్మవారి ఆలయానికి విరాళం అందించారు. ఇక సంపాదించిన కొంత భాగాన్ని స్వగ్రామాభివృద్ధికి వెచ్చించారు.

మూడు సంవత్సరాల క్రితం కోటి రూపాయల సొంత నిధులతో కైలాస భూమిని నిర్మించి గ్రామ ప్రజల సేవకు అప్పగించడం ద్వారా తన సేవాభావాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా, తన వాటర్ ప్లాంట్‌ను గ్రామ ప్రజలకు సమర్పించారు.

అదే విధంగా, రాజంపేటలో రూ.26 లక్షలతో మరో వాటర్ ప్లాంట్‌ను నిర్మించారు. తన సేవా కృషి ద్వారా సామాజిక బాధ్యతను నిలుపుతూ సామాజిక, ధార్మిక క్షేత్రాల్లో పాదాలు మోపారు.

వ్యాపార రంగంలో చురుకుగా ఉన్న కోటేశ్వరరావు, రఘుదేవపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.5 కోట్లు వెచ్చించారు.

ఆలయ నిర్మాణం, వాటర్ ప్లాంట్‌లతో సహా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సేవలను గుర్తించి ఈ అవకావాన్ని కల్పించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్వామి వారికి సేవ చేసే అవకాశాన్ని జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టంగా భావిస్తున్నానని చెప్పారు.

This post was last modified on November 11, 2024 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

28 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

5 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

7 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

7 hours ago