రాజమహేంద్రవరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో సభ్యుడిగా నియమితులైన అక్కిన ముని కోటేశ్వరరావు తిరుమల సేవకు అర్హత సాధించారు. ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తారని ఎవరు ఉహించలేదు. చర్చల్లోకి చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించినప్పటికి కోటేశ్వరరావు పేరు పెద్దగా హైలెట్ కాలేదు. అయితే ఆయన ఈ బాద్యత అందుకోవడానికి పలు సేవా కార్యక్రమాలు కూడా ప్రధాన కారణం.
సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన కోటేశ్వరరావు పర్సనల్ లైఫ్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తన సామాజిక సేవలను కొనసాగిస్తూ కోటేశ్వరరావు పద్మావతి అమ్మవారి ఆలయానికి విరాళం అందించారు. ఇక సంపాదించిన కొంత భాగాన్ని స్వగ్రామాభివృద్ధికి వెచ్చించారు.
మూడు సంవత్సరాల క్రితం కోటి రూపాయల సొంత నిధులతో కైలాస భూమిని నిర్మించి గ్రామ ప్రజల సేవకు అప్పగించడం ద్వారా తన సేవాభావాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా, తన వాటర్ ప్లాంట్ను గ్రామ ప్రజలకు సమర్పించారు.
అదే విధంగా, రాజంపేటలో రూ.26 లక్షలతో మరో వాటర్ ప్లాంట్ను నిర్మించారు. తన సేవా కృషి ద్వారా సామాజిక బాధ్యతను నిలుపుతూ సామాజిక, ధార్మిక క్షేత్రాల్లో పాదాలు మోపారు.
వ్యాపార రంగంలో చురుకుగా ఉన్న కోటేశ్వరరావు, రఘుదేవపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.5 కోట్లు వెచ్చించారు.
ఆలయ నిర్మాణం, వాటర్ ప్లాంట్లతో సహా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సేవలను గుర్తించి ఈ అవకావాన్ని కల్పించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్వామి వారికి సేవ చేసే అవకాశాన్ని జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టంగా భావిస్తున్నానని చెప్పారు.
This post was last modified on November 11, 2024 2:57 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…