Political News

జ‌గ‌న్‌ది అవివేకం.. అజ్ఞానం: ష‌ర్మిల

వైసీపీ అధినేత, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌గ‌న్ ఆయ‌న ఎమ్మెల్యేలు హాజ‌రు కాక‌పోవ‌డాన్ని ఆమె నిశితంగా ప్ర‌శ్నించారు. “అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది జగన్ తీరు” అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అంతేకాదు, అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందన్నారు.

తాజాగా ప్రారంభమైన బ‌డ్జ‌ట్ స‌మావేశాల‌కు వెళ్ల‌బోన‌ని రెండు రోజుల కిందటే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఆ ప్ర‌కార‌మే ఆయ‌న, ఆయ‌న ప‌రివారం కూడా స‌భ‌ల‌కు దూరంగా ఉన్నారు. క‌నీసం బ‌డ్జెట్ సమావేశాల వైపు తొంగి చూడ‌లేదు. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని ష‌ర్మిల‌.. కామెంట్లు కుమ్మ‌రించారు. “ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది” అని వ్యాఖ్యానించారు.

“ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం. హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పలుమార్లు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభాపక్షం మొత్తం రాజీనామాలు చేయండి” అని ష‌ర్మిల తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కాగా, వైసీపీ నుంచి ఒక్క‌రు కూడా.. స‌భ‌లవైపు క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. స‌భ‌లో వార్షిక బ‌డ్జెట్ను ప్ర‌వేశ పెట్టారు. ఈ స‌మ‌యంలో స‌భ‌లో ప్ర‌తిప‌క్ష సీట్లు ఖాళీగా క‌నిపించాయి. మ‌రోవైపు.. ప‌లువురు స‌భ్యులు ప్ర‌తిప‌క్షం వ‌చ్చి ఉండాల్సింద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. స‌భ‌లో కూర్చున్న సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ప్ర‌తిప‌క్ష నాయ‌కుల సీట్ల వైపు ప‌దే ప‌దే చూడడం.. ఎవ‌రైనా వ‌స్తారేమో.. అన్న భావ‌న క‌ల‌గించింది. కానీ … స‌భ‌కు ఎవ‌రూ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 11, 2024 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 minute ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago