Political News

రాష్ట్రాన్ని ముంచేశారు: బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వైసీపీపై నిప్పులు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో మిగిలి ఉన్న ఐదు నెల‌ల కాలానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను సోమ‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశ‌వ్ ఈ బ‌డ్జెట్‌ను చ‌దివి వినిపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌త వైసీపీ స‌ర్కారు నిర్వాకాల‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ఆదాయానికి, చేసిన అప్పుల‌కు పొంత‌న లేకుండా పోయింద‌న్నారు. ప‌రిమితికి మించి చేసిన అప్పులు కార‌ణంగా.. రాష్ట్రం ఇబ్బందుల్లో ప‌డింద‌న్నారు.

“ఏ ప్ర‌భుత్వానికైనా ఐదేళ్ల కాల‌ప‌రిమితి ఉంటుంది. కానీ,గ‌త ప్ర‌భుత్వం 25 సంవ‌త్స‌రాల‌కు స‌రిపోయేలా అప్పులు చేసింది. త‌ద్వారా.. ఆదాయాన్ని త‌గ్గిచేసింది. ఇది అత్యంత లోప భూయిష్ట విధానంగా నిపుణులు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించింది” అని పయ్యావుల త‌న ప్ర‌సంగం లో పేర్కొన్నారు. ఈ ప‌రిస్థితిని అంచ‌నా వేసుకునేందుకు త‌మ‌కు స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. అందుకే కొంత ఆల‌స్య‌మైనా ప‌రిపూర్ణ‌మైన బ‌డ్జెట్‌ను తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం ప్ర‌వేశ పెడుతున్న బ‌డ్జెట్‌.. రాష్ట్రాన్ని కాపాడడంతో పాటు, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో ముందుకు తీసుకువెళ్ల‌నుంద‌ని మంత్రి ప‌య్యావుల తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంగా 2024–25 వార్షిక బడ్జెట్ ను వండివార్చామ‌న్నారు. ప్రాధాన్య రంగాల‌తోపాటు ప్ర‌జ‌ల ఆరోగ్యం, స‌మాజ శాంతి భ‌ద్ర‌త‌లు, యువ‌త‌కు ఉపాధిక‌ల్ప‌న‌, ఉద్యోగాల‌కు పెద్ద పీట వేశామ‌ని అన్నారు. అదేవిధంగా రైతులేనిదే రాజ్యం లేద‌ని న‌మ్మే చంద్ర‌బాబు ఆశ‌ల‌కు అనుగుణంగా వ్య‌వ‌సాయానికి కూడా ఎక్కువ‌గానే నిధులు ఇచ్చామ‌న్నారు.

దీనికి ముందు..

బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డానికి ముందు.. ముఖ్య‌మంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సంద‌ర్భంగా 2024-25(మిగిలిన కాలానికి) వార్షిక బడ్జెట్‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. అనంతరం.. బ‌డ్జెట్ ప్ర‌తుల‌తో మంత్రి ప‌య్యావుల అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఇదిలావుంటే.. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే ముందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌ధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు.

This post was last modified on November 11, 2024 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago