Political News

రాష్ట్రాన్ని ముంచేశారు: బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వైసీపీపై నిప్పులు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో మిగిలి ఉన్న ఐదు నెల‌ల కాలానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను సోమ‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశ‌వ్ ఈ బ‌డ్జెట్‌ను చ‌దివి వినిపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌త వైసీపీ స‌ర్కారు నిర్వాకాల‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ఆదాయానికి, చేసిన అప్పుల‌కు పొంత‌న లేకుండా పోయింద‌న్నారు. ప‌రిమితికి మించి చేసిన అప్పులు కార‌ణంగా.. రాష్ట్రం ఇబ్బందుల్లో ప‌డింద‌న్నారు.

“ఏ ప్ర‌భుత్వానికైనా ఐదేళ్ల కాల‌ప‌రిమితి ఉంటుంది. కానీ,గ‌త ప్ర‌భుత్వం 25 సంవ‌త్స‌రాల‌కు స‌రిపోయేలా అప్పులు చేసింది. త‌ద్వారా.. ఆదాయాన్ని త‌గ్గిచేసింది. ఇది అత్యంత లోప భూయిష్ట విధానంగా నిపుణులు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించింది” అని పయ్యావుల త‌న ప్ర‌సంగం లో పేర్కొన్నారు. ఈ ప‌రిస్థితిని అంచ‌నా వేసుకునేందుకు త‌మ‌కు స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. అందుకే కొంత ఆల‌స్య‌మైనా ప‌రిపూర్ణ‌మైన బ‌డ్జెట్‌ను తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం ప్ర‌వేశ పెడుతున్న బ‌డ్జెట్‌.. రాష్ట్రాన్ని కాపాడడంతో పాటు, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో ముందుకు తీసుకువెళ్ల‌నుంద‌ని మంత్రి ప‌య్యావుల తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంగా 2024–25 వార్షిక బడ్జెట్ ను వండివార్చామ‌న్నారు. ప్రాధాన్య రంగాల‌తోపాటు ప్ర‌జ‌ల ఆరోగ్యం, స‌మాజ శాంతి భ‌ద్ర‌త‌లు, యువ‌త‌కు ఉపాధిక‌ల్ప‌న‌, ఉద్యోగాల‌కు పెద్ద పీట వేశామ‌ని అన్నారు. అదేవిధంగా రైతులేనిదే రాజ్యం లేద‌ని న‌మ్మే చంద్ర‌బాబు ఆశ‌ల‌కు అనుగుణంగా వ్య‌వ‌సాయానికి కూడా ఎక్కువ‌గానే నిధులు ఇచ్చామ‌న్నారు.

దీనికి ముందు..

బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డానికి ముందు.. ముఖ్య‌మంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సంద‌ర్భంగా 2024-25(మిగిలిన కాలానికి) వార్షిక బడ్జెట్‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. అనంతరం.. బ‌డ్జెట్ ప్ర‌తుల‌తో మంత్రి ప‌య్యావుల అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఇదిలావుంటే.. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే ముందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌ధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు.

This post was last modified on November 11, 2024 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

2 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

2 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

3 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

3 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

4 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

5 hours ago