ప్రస్తుత సోషల్ మీడియా జమానాలో చిన్న చిన్న విషయాలే రచ్చరచ్చగా మారుతున్నాయి. కొన్ని విషయాలు అలాగే గుర్తింపు పరిష్కారం కూడా అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనగా ఐటీసీ కోహినూర్ దగ్గర కుమారీ ఆంటీ ఎపిసోడ్ ను పేర్కొనవచ్చు. సోషల్ మీడియా ద్వారా తక్కువ టైంలో పాపులర్ అయిన కుమారీ ఆంటీ… అదే సోషల్ మీడియా వల్ల ఇబ్బందుల పాలు కూడా అయ్యారు. దీంతో ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఆమె దుకాణం తొలగించకుండా ఆదేశించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిణామమే అదే కుమారీ ఆంటీ వల్లే కలిగింది.
ఐటీసీ కోహినూర్ సమీపంలో ఏర్పాటు చేసిన కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ లాగానే మరికొందరు కూడా అక్కడ రోడ్ సైడ్ ఉపాధి పొందుతున్నారు. అయితే, తాజాగా అక్కడ జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా వాటిని తొలగించారు. నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే, దీనిపై వారు ఆందోళన తెలిపారు. కుమారీ ఆంటీకి ఒక రూల్ తమకు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో కుమారీ ఆంటీకి , ఆమెతో పాటు స్థానికంగా ఉండే వారు ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పినట్లు గుర్తుకు చేశారు. కానీ ఇప్పుడు అధికారులు నిబంధనల పేరుతో తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
సైబరాబాద్లో అతి పెద్ద డిమాండ్ ఏరియాల్లో ఒకటైన మాదాపూర్లో ఇటు ఉపాధి పొందే కోణంలో అటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందుబాటు ధరల్లో ఫుడ్ పొందేలా పలు స్ట్రీట్ ఫుడ్స్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు కేవలం సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఆకలి తీర్చేవిధంగానే కాకుండా ఐటీ పరిశ్రమపై ఆధారపడిన వారి అవసరాలు తీర్చేలా సైతం అనువైన ధరలను కలిగి ఉంటున్నాయి. దీంతో సహజంగానే వీటికి పెద్ద ఎత్తున ఆదరణ ఉంటోంది. అయితే, నిబంధనలకు విరుద్ధం అవడం, ట్రాఫిక్ సమస్యలకు కారణంగా మారుతుండటంతో… వీటిని తొలగించేలా అధికారులు చర్యలు తీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…