ప్రస్తుత సోషల్ మీడియా జమానాలో చిన్న చిన్న విషయాలే రచ్చరచ్చగా మారుతున్నాయి. కొన్ని విషయాలు అలాగే గుర్తింపు పరిష్కారం కూడా అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనగా ఐటీసీ కోహినూర్ దగ్గర కుమారీ ఆంటీ ఎపిసోడ్ ను పేర్కొనవచ్చు. సోషల్ మీడియా ద్వారా తక్కువ టైంలో పాపులర్ అయిన కుమారీ ఆంటీ… అదే సోషల్ మీడియా వల్ల ఇబ్బందుల పాలు కూడా అయ్యారు. దీంతో ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఆమె దుకాణం తొలగించకుండా ఆదేశించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిణామమే అదే కుమారీ ఆంటీ వల్లే కలిగింది.
ఐటీసీ కోహినూర్ సమీపంలో ఏర్పాటు చేసిన కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ లాగానే మరికొందరు కూడా అక్కడ రోడ్ సైడ్ ఉపాధి పొందుతున్నారు. అయితే, తాజాగా అక్కడ జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా వాటిని తొలగించారు. నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే, దీనిపై వారు ఆందోళన తెలిపారు. కుమారీ ఆంటీకి ఒక రూల్ తమకు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో కుమారీ ఆంటీకి , ఆమెతో పాటు స్థానికంగా ఉండే వారు ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పినట్లు గుర్తుకు చేశారు. కానీ ఇప్పుడు అధికారులు నిబంధనల పేరుతో తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
సైబరాబాద్లో అతి పెద్ద డిమాండ్ ఏరియాల్లో ఒకటైన మాదాపూర్లో ఇటు ఉపాధి పొందే కోణంలో అటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందుబాటు ధరల్లో ఫుడ్ పొందేలా పలు స్ట్రీట్ ఫుడ్స్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు కేవలం సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఆకలి తీర్చేవిధంగానే కాకుండా ఐటీ పరిశ్రమపై ఆధారపడిన వారి అవసరాలు తీర్చేలా సైతం అనువైన ధరలను కలిగి ఉంటున్నాయి. దీంతో సహజంగానే వీటికి పెద్ద ఎత్తున ఆదరణ ఉంటోంది. అయితే, నిబంధనలకు విరుద్ధం అవడం, ట్రాఫిక్ సమస్యలకు కారణంగా మారుతుండటంతో… వీటిని తొలగించేలా అధికారులు చర్యలు తీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
This post was last modified on November 8, 2024 10:17 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…