Political News

పవన్ ఎఫెక్ట్.. పోలీసులు అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇటీవల పిఠాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేకపోవడం గురించి ప్రస్తావిస్తూ హోం మంత్రి అనిత చురుగ్గా వ్యవహరించకపోతే ఆ శాఖను తాను చేపట్టాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన ఇచ్చారు.

ఈ వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతర్గతంగా చర్చించాల్సిన విషయాల గురించి పవన్ ఇలా ఓపెన్‌గా మాట్లాడడాన్ని కొందరు తప్పుబడితే.. ఇలా తప్పులను ప్రస్తావించి సరిదిద్దుకునేలా చేయడం మంచిదే అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియాలో ఇప్పటికీ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న వైసీపీ మద్దతుదారులను ప్రభుత్వం అస్సలు అదుపు చేయలేకపోతోందంటూ టీడీపీ, జనసేన మద్దతుదారుల్లో ఉన్న అసహనాన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా నడిచింది. ఐతే పవన్ వ్యాఖ్యలను సానుకూలంగానే తీసుకున్న ప్రభుత్వం.. వెంటనే కార్యాచరణ మొదలుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వైసీపీ అధికారంలో ఉండగా సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పోస్టులు పెట్టి టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కించపరిచిన వాళ్ల మీద పోలీసులు సీరియస్‌గా ఫోకస్ పెట్టిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ సతీమణి భారతి దగ్గర పీఏగా పని చేసిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇతడి సోషల్ మీడియా పోస్టులు చూస్తే టీడీపీ, జనసేన మద్దతుదారులకు రక్తం మరిగిపోతుంది. పవన్, నారా లోకేష్‌ల గురించి జుగుప్సాకరమైన పోస్టులు పెట్టాడు. ప్రభుత్వం మారినా కూడా ఇంకా చాలా పోస్టులు అలాగే ఉన్నాయి. ఇతగాడిని ఇంతకుముందే ఒకసారి అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

అది నిజమో కాదో కానీ.. అతను మాత్రం స్వేచ్ఛగా తిరిగేస్తున్నాడు. ఐతే ఇప్పుడు పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా తమకు సహకరించని వర్రాను ఒక పోలీస్ అధికారి కొడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.

మరికొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా పోలీసులు కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వైసీపీ హయాంలో చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు, పట్టాభి లాంటి నేతల విషయంలో పోలీసులు ఎంత దౌర్జన్యంగా వ్యవహరించారో తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న స్థాయి కార్యకర్తల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించట్లేదని.. ఎవరినైనా అరెస్ట్ చేసినా వెంటనే బయటికి వచ్చేస్తున్నారని.. అరెస్ట్ చేశాక వాళ్లకు తగిన బుద్ధి చెప్పట్లేదని.. అందుకే బయటికి వచ్చాక వాళ్లు మళ్లీ యథావిధిగా పోస్టులు పెడుతున్నారనే అసహనం టీడీపీ, జనసేన వర్గాల్లో ఉంది.

ఈ నేపథ్యంలోనే పవన్ ఇటీవలి వ్యాఖ్యలకు మద్దతు కూడా లభించింది. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

This post was last modified on November 6, 2024 5:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

24 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago