Political News

పవన్ ఎఫెక్ట్.. పోలీసులు అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇటీవల పిఠాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేకపోవడం గురించి ప్రస్తావిస్తూ హోం మంత్రి అనిత చురుగ్గా వ్యవహరించకపోతే ఆ శాఖను తాను చేపట్టాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన ఇచ్చారు.

ఈ వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతర్గతంగా చర్చించాల్సిన విషయాల గురించి పవన్ ఇలా ఓపెన్‌గా మాట్లాడడాన్ని కొందరు తప్పుబడితే.. ఇలా తప్పులను ప్రస్తావించి సరిదిద్దుకునేలా చేయడం మంచిదే అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియాలో ఇప్పటికీ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న వైసీపీ మద్దతుదారులను ప్రభుత్వం అస్సలు అదుపు చేయలేకపోతోందంటూ టీడీపీ, జనసేన మద్దతుదారుల్లో ఉన్న అసహనాన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా నడిచింది. ఐతే పవన్ వ్యాఖ్యలను సానుకూలంగానే తీసుకున్న ప్రభుత్వం.. వెంటనే కార్యాచరణ మొదలుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వైసీపీ అధికారంలో ఉండగా సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పోస్టులు పెట్టి టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కించపరిచిన వాళ్ల మీద పోలీసులు సీరియస్‌గా ఫోకస్ పెట్టిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ సతీమణి భారతి దగ్గర పీఏగా పని చేసిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇతడి సోషల్ మీడియా పోస్టులు చూస్తే టీడీపీ, జనసేన మద్దతుదారులకు రక్తం మరిగిపోతుంది. పవన్, నారా లోకేష్‌ల గురించి జుగుప్సాకరమైన పోస్టులు పెట్టాడు. ప్రభుత్వం మారినా కూడా ఇంకా చాలా పోస్టులు అలాగే ఉన్నాయి. ఇతగాడిని ఇంతకుముందే ఒకసారి అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

అది నిజమో కాదో కానీ.. అతను మాత్రం స్వేచ్ఛగా తిరిగేస్తున్నాడు. ఐతే ఇప్పుడు పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా తమకు సహకరించని వర్రాను ఒక పోలీస్ అధికారి కొడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.

మరికొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా పోలీసులు కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వైసీపీ హయాంలో చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు, పట్టాభి లాంటి నేతల విషయంలో పోలీసులు ఎంత దౌర్జన్యంగా వ్యవహరించారో తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న స్థాయి కార్యకర్తల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించట్లేదని.. ఎవరినైనా అరెస్ట్ చేసినా వెంటనే బయటికి వచ్చేస్తున్నారని.. అరెస్ట్ చేశాక వాళ్లకు తగిన బుద్ధి చెప్పట్లేదని.. అందుకే బయటికి వచ్చాక వాళ్లు మళ్లీ యథావిధిగా పోస్టులు పెడుతున్నారనే అసహనం టీడీపీ, జనసేన వర్గాల్లో ఉంది.

ఈ నేపథ్యంలోనే పవన్ ఇటీవలి వ్యాఖ్యలకు మద్దతు కూడా లభించింది. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

This post was last modified on November 6, 2024 5:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago