Political News

ఔను! ప‌వ‌న్ స‌ర్ చెప్పింది నిజ‌మే: ఏపీ డీజీపీ

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌తల విష‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమ‌లరావు స‌మ‌ర్థించారు. “ఔను ప‌వ‌న్ స‌ర్ చెప్పింది నిజ‌మే” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గ‌త ఐదేళ్ల‌లో(వైసీపీ పాల‌న‌) శాంతి భ‌ద్ర‌త‌లు దిగ‌జారాయ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం శాంతి భద్ర‌త‌ల‌ను గాడిలో పెట్టేందుకు తాము శ్ర‌మిస్తున్న‌ట్టు చెప్పారు. గ‌త ఐదేళ్ల‌లో పోలీసులు కూడా గాడి త‌ప్పార‌ని.. ఎవ‌రూ ప‌నిచేయ‌లేద‌ని అందుకే రాష్ట్రంలో అనేక ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయ న్నారు. “భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌పేరుతో పార్టీ(టీడీపీ) కార్యాల‌యంపై దాడులు చేయ‌డం స‌మ‌ర్థించ‌లేం” అని వ్యాఖ్యానించారు.

కానీ, గ‌త పోలీసు అధికారులు మాత్రం ఓ పార్టీ(టీడీపీ) కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని కూడా స‌మ‌ర్థించుకున్నార‌ని చెప్పారు. ఇలాంటివి చేయ‌డం వ‌ల్లే పోలీసులు ప‌నిచేయ‌లేద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో పోలీసింగ్‌ను దారిలో పెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకు న్నామ‌న్నారు. “డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారు చెప్పింది వాస్త‌వం. రాష్ట్రంలో గ‌త ఐదేళ్ల‌లో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయి. మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌యప‌డ్డారు. ఆ ప‌రిస్థితి మార్చాల‌న్న‌ది ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల అంత‌రార్థం. ఈ విష‌యంలో మేం సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా రెడీగా ఉంది. పరిస్థితిని మారుస్తాం” అని ద్వార‌కా తిరుమ‌ల రావు అన్నారు.

ఇక‌, ఐపీఎస్ అధికారుల‌పై కేసులు న‌మోదు కావ‌డంపైనా ద్వార‌కా తిరుమ‌ల‌రావు స్పందించారు. గ‌తంలో కొంద‌రిపై ఉన్న వ‌త్తళ్ల కార‌ణంగా త‌ప్పులు చేశార‌ని భావిస్తున్న‌ట్టు తెలిపారు. అయితే.. త‌ప్పు చేసిన వారు ఎలాంటి వారైనా, ఎంత‌టి వారైనా అరెస్టు చేయ‌క త‌ప్ప‌ద‌ని ఐపీఎస్ విశాల్‌గున్నీ, కాంతి రాణా టాటా, సంజ‌య్ ల‌ను ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, ప్ర‌స్తుతం సంజ‌య్ కేసును తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు చెప్పారు. దీనిపై విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు. అదేస‌మ‌యంలో పోలీసుల‌పై వ‌స్తున్న ఫిర్యాదుల‌ను కూడా తీవ్రంగా భావిస్తున్నామ‌ని, చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

Satya

Recent Posts

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

10 minutes ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

2 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

2 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

4 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

5 hours ago

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

7 hours ago