Political News

‘ప్ర‌జ‌ల ఆస్తులు దోచుకుని… ‘

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్నాళ్లుగా జ‌గ‌న్‌, ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల మ‌ధ్య ఆస్తుల వివాదాలు ర‌గులుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున మీడియాలోనూ చ‌ర్చ సాగింది. ఈ విష‌యాల‌ను తాజాగా ప్ర‌స్తావించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌జ‌ల ఆస్తులు దోచుకుని, వాటిని తమ సొంత ఆస్తులు అంటూ వైఎస్ కుటుంబ స‌భ్యులు కోట్లాడుకుంటున్నారు.. అని వ్యాఖ్యానించారు. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడులో ఉన్న స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ అండ్ ఇండ‌స్ట్రీస్‌కు వైఎస్ హ‌యాంలో కేటాయించిన భూముల‌ను ఆయ‌న తాజాగా ప‌రిశీలించారు.

జ‌గ‌న్‌-ష‌ర్మిల మ‌ధ్య వివాదం ఈ భూముల విష‌యంపైనే వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. షేర్ల‌ను ఈడీ జ‌ప్తు చేయ‌లేద‌ని.. కాబ‌ట్టి వాటిని అమ్మితే త‌ప్పులేద‌ని ష‌ర్మిల వాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఆ భూముల సంగ‌తి తేల్చాల‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో అట‌వీ శాఖ అధికారులు ఇక్క‌డ ప‌ర్య‌టించి.. త‌మకు సంబంధించిన భూములు స‌రస్వ‌తి భూముల్లో లేవ‌ని తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి ప‌రిశీలించేందుకు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల నుంచి వైఎస్ కుటుంబం దౌర్జ‌న్యంగా ఈ భూములు దోచుకుంద‌న్నారు.

జ‌గ‌న్ అరాచ‌క వాది!

జ‌గ‌న్ అరాచ‌క వాది అనేందుకు స‌ర‌స్వ‌తి భూములే నిద‌ర్శ‌న‌మ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపించారు. వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఈ భూముల‌ను30 ఏళ్ల‌కు మాత్ర‌మే లీజుకు తీసుకున్నార‌ని.. కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక‌.. మ‌రో 50 ఏళ్ల‌పాటు లీజును స్వ‌యంగా పొడిగించుకున్నార‌ని.. ఇంత‌క‌న్నా అరాచ‌కం ఏం ఉంటుంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. కానీ, ఇప్ప‌టి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి రాయి కూడా వేయ‌లేద‌న్నారు. అంతేకాదు..ఇక్క‌డ భూముల‌ను కూడా ప్ర‌జ‌లు, రైతుల నుంచి దౌర్జ‌న్యంగా తీసుకున్నార‌ని చెప్పారు. నాటు బాంబులు వేసి భయపెట్టారని, దీంతో భ‌య బ్రాంతుల‌కు గురైన ప్ర‌జ‌లు ఇష్టం లేకున్నా అమ్ముకున్నార‌ని చెప్పారు.

“భూములు ఇచ్చిన వారికిఉద్యోగాలు ఇస్తామ‌న్నారు. ఉపాధి క‌ల్పిస్తామ‌న్నారు. కానీ, ఒక్క‌రికి కూడా.. ఉద్యోగం ఇవ్వ‌లేదు. ఉపాధి చూపించ‌లేదు. కేవ‌లం దోపిడీ కోస‌మే 1100 ఎకరాలు తీసుకున్నారు. దీని వ‌ల్ల కాయ‌క‌ష్టం చేసుకునే ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. 400 ఎకరాల అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చేసి లాక్కున్నారని స్థానికులు చెబుతున్నార‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశిస్తామ‌న్నారు.

Satya

Recent Posts

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

6 minutes ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

9 minutes ago

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…

22 minutes ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

39 minutes ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

50 minutes ago

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…

54 minutes ago