Political News

‘ప్ర‌జ‌ల ఆస్తులు దోచుకుని… ‘

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్నాళ్లుగా జ‌గ‌న్‌, ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల మ‌ధ్య ఆస్తుల వివాదాలు ర‌గులుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున మీడియాలోనూ చ‌ర్చ సాగింది. ఈ విష‌యాల‌ను తాజాగా ప్ర‌స్తావించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌జ‌ల ఆస్తులు దోచుకుని, వాటిని తమ సొంత ఆస్తులు అంటూ వైఎస్ కుటుంబ స‌భ్యులు కోట్లాడుకుంటున్నారు.. అని వ్యాఖ్యానించారు. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడులో ఉన్న స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ అండ్ ఇండ‌స్ట్రీస్‌కు వైఎస్ హ‌యాంలో కేటాయించిన భూముల‌ను ఆయ‌న తాజాగా ప‌రిశీలించారు.

జ‌గ‌న్‌-ష‌ర్మిల మ‌ధ్య వివాదం ఈ భూముల విష‌యంపైనే వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. షేర్ల‌ను ఈడీ జ‌ప్తు చేయ‌లేద‌ని.. కాబ‌ట్టి వాటిని అమ్మితే త‌ప్పులేద‌ని ష‌ర్మిల వాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఆ భూముల సంగ‌తి తేల్చాల‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో అట‌వీ శాఖ అధికారులు ఇక్క‌డ ప‌ర్య‌టించి.. త‌మకు సంబంధించిన భూములు స‌రస్వ‌తి భూముల్లో లేవ‌ని తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి ప‌రిశీలించేందుకు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల నుంచి వైఎస్ కుటుంబం దౌర్జ‌న్యంగా ఈ భూములు దోచుకుంద‌న్నారు.

జ‌గ‌న్ అరాచ‌క వాది!

జ‌గ‌న్ అరాచ‌క వాది అనేందుకు స‌ర‌స్వ‌తి భూములే నిద‌ర్శ‌న‌మ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపించారు. వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఈ భూముల‌ను30 ఏళ్ల‌కు మాత్ర‌మే లీజుకు తీసుకున్నార‌ని.. కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక‌.. మ‌రో 50 ఏళ్ల‌పాటు లీజును స్వ‌యంగా పొడిగించుకున్నార‌ని.. ఇంత‌క‌న్నా అరాచ‌కం ఏం ఉంటుంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. కానీ, ఇప్ప‌టి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి రాయి కూడా వేయ‌లేద‌న్నారు. అంతేకాదు..ఇక్క‌డ భూముల‌ను కూడా ప్ర‌జ‌లు, రైతుల నుంచి దౌర్జ‌న్యంగా తీసుకున్నార‌ని చెప్పారు. నాటు బాంబులు వేసి భయపెట్టారని, దీంతో భ‌య బ్రాంతుల‌కు గురైన ప్ర‌జ‌లు ఇష్టం లేకున్నా అమ్ముకున్నార‌ని చెప్పారు.

“భూములు ఇచ్చిన వారికిఉద్యోగాలు ఇస్తామ‌న్నారు. ఉపాధి క‌ల్పిస్తామ‌న్నారు. కానీ, ఒక్క‌రికి కూడా.. ఉద్యోగం ఇవ్వ‌లేదు. ఉపాధి చూపించ‌లేదు. కేవ‌లం దోపిడీ కోస‌మే 1100 ఎకరాలు తీసుకున్నారు. దీని వ‌ల్ల కాయ‌క‌ష్టం చేసుకునే ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. 400 ఎకరాల అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చేసి లాక్కున్నారని స్థానికులు చెబుతున్నార‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశిస్తామ‌న్నారు.

This post was last modified on November 5, 2024 7:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

6 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

7 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

8 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

10 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

10 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

11 hours ago