పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ చేసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను పంచాయతీ రాజ్ శాఖా మంత్రిని మాత్రమేనని, అనిత హోం మంత్రి అని, ఒక వేళ తాను హోం శాఖా మంత్రి అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయని పవన్ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. పవన్ వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంలో హోం శాఖ ఫెయిల్ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై టీడీపీ తరఫు నుంచి మొట్టమొదటగా మంత్రి పొంగూరు నారాయణ స్పందించారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా జనరల్ గా ఇతర శాఖలపై తమ అభిప్రాయాలు చెబుతుండడం సహజమని నారాయణ అన్నారు. ఆ హోదాలో ఉన్న వారికి పూర్తి అధికారాలున్నాయని, ఎవరినీ తప్పుబట్టడానికి లేదని నారాయణ తెలిపారు. పవన్ వ్యాఖ్యలను ఒక అలర్ట్ గా తీసుకోవాలని, ప్రభుత్వంలో లోపాలు గుర్తించి సరిదిద్దుకోవడం తప్పు కాదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్ని చిన్న సమస్యలుంటే సీఎం చంద్రబాబు కో ఆర్డినేట్ చేస్తారని చెప్పారు. ఒక ఘటనను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారని, దానిపై హోం మంత్రి చర్యలు తీసుకుంటారని అన్నారు. హోం శాఖ తీసేసుకుంటానని పవన్ చెప్పలేదని నారాయణ అన్నారు. కొన్ని సార్లు లీగల్ గా కొన్ని పోలీసులు చేసేందుకు కొన్ని అభ్యంతరాలుంటాయని, దానివల్ల జాప్యం జరిగి ఉండవచ్చని, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా చేస్తారని చెప్పారు.
ఇక, గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఏమీ చేయలేదని అన్నారు. పాత టెండర్లను రద్దు చేస్తూ సీఆర్డీఏ తీర్మానించిందని, కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్ అయిందని అన్నారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తిచేయాలని చంద్రబాబు ఆదేశించారని, డిసెంబర్ 31న కొత్త టెండర్లు ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో వరద నీటి నిర్వహణకు 3 రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని, అందు కోసం నెదర్లాండ్స్ సంస్థతో ఒప్పందం కుదిరిందని నారాయణ తెలిపారు.
This post was last modified on November 4, 2024 10:57 pm
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…