పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ చేసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను పంచాయతీ రాజ్ శాఖా మంత్రిని మాత్రమేనని, అనిత హోం మంత్రి అని, ఒక వేళ తాను హోం శాఖా మంత్రి అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయని పవన్ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. పవన్ వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంలో హోం శాఖ ఫెయిల్ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై టీడీపీ తరఫు నుంచి మొట్టమొదటగా మంత్రి పొంగూరు నారాయణ స్పందించారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా జనరల్ గా ఇతర శాఖలపై తమ అభిప్రాయాలు చెబుతుండడం సహజమని నారాయణ అన్నారు. ఆ హోదాలో ఉన్న వారికి పూర్తి అధికారాలున్నాయని, ఎవరినీ తప్పుబట్టడానికి లేదని నారాయణ తెలిపారు. పవన్ వ్యాఖ్యలను ఒక అలర్ట్ గా తీసుకోవాలని, ప్రభుత్వంలో లోపాలు గుర్తించి సరిదిద్దుకోవడం తప్పు కాదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్ని చిన్న సమస్యలుంటే సీఎం చంద్రబాబు కో ఆర్డినేట్ చేస్తారని చెప్పారు. ఒక ఘటనను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారని, దానిపై హోం మంత్రి చర్యలు తీసుకుంటారని అన్నారు. హోం శాఖ తీసేసుకుంటానని పవన్ చెప్పలేదని నారాయణ అన్నారు. కొన్ని సార్లు లీగల్ గా కొన్ని పోలీసులు చేసేందుకు కొన్ని అభ్యంతరాలుంటాయని, దానివల్ల జాప్యం జరిగి ఉండవచ్చని, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా చేస్తారని చెప్పారు.
ఇక, గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఏమీ చేయలేదని అన్నారు. పాత టెండర్లను రద్దు చేస్తూ సీఆర్డీఏ తీర్మానించిందని, కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్ అయిందని అన్నారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తిచేయాలని చంద్రబాబు ఆదేశించారని, డిసెంబర్ 31న కొత్త టెండర్లు ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో వరద నీటి నిర్వహణకు 3 రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని, అందు కోసం నెదర్లాండ్స్ సంస్థతో ఒప్పందం కుదిరిందని నారాయణ తెలిపారు.
This post was last modified on November 4, 2024 10:57 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…