Political News

2 సెంట్ల లోపు ఇంటికి అప్రూవల్ మినహాయింపు

కొత్త ఇల్లు కట్టుకోవడానికి ముందు పంచాయతీ లేదా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. తగిన బ్లూ ప్రింట్ లేఅవుట్ ను అధికారులు ధ్రువీకరించిన తర్వాత మాత్రమే గృహ నిర్మాణాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. అయితే, ఒక సెంటు….రెండు సెంట్లలో చిన్న ఇల్లు నిర్మించుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ప్రక్రియ ఇబ్బందికరంగా మారింది. అనుమతుల కోసం కార్యాలయం చుట్టూ తిరగడం ఒక ఎత్తయితే, దాని మార్కెట్ విలువను బట్టి ఫీజు కింద నగదు చెల్లించడం మరొక ఎత్తు.

ఈ నేపథ్యంలోనే పేద, మధ్యతరగతి వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఏపీ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పేద, మధ్య తరగతి గృహ నిర్మాణదారులకు మంత్రి పొంగూరు నారాయణ తీపి కబురు చెప్పారు. నగరాల్లో 100 గజాల్లోపు నిర్మించే ఇళ్లకు టౌన్ ప్లానింగ్ మంజూరు ప్రక్రియను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని నారాయణ ప్రకటించారు. 2 సెంట్ల లోపు ఇల్లు నిర్మించుకునేవారు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ కోసం తిరగాల్సిన పనిలేదని తెలిపారు.

పేద, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు తొలగించేలాగా భవన నిర్మాణానికి అనుమతుల విధానాలను సరళీకరించామని చెప్పారు. అందుకోసం తగిన నిర్ణయాలు తీసుకుంటామని నారాయణ చెప్పారు. దాంతో పాటు 300 గజాల లోపు ఇళ్లకు సులభంగా టౌన్ ప్లానింగ్ అప్రూవల్ వచ్చేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. వివిధ అంశాలపై అధికారులతో చర్చించిన మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు.

This post was last modified on November 4, 2024 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

40 minutes ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

4 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

5 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

6 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

6 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

6 hours ago