Political News

2 సెంట్ల లోపు ఇంటికి అప్రూవల్ మినహాయింపు

కొత్త ఇల్లు కట్టుకోవడానికి ముందు పంచాయతీ లేదా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. తగిన బ్లూ ప్రింట్ లేఅవుట్ ను అధికారులు ధ్రువీకరించిన తర్వాత మాత్రమే గృహ నిర్మాణాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. అయితే, ఒక సెంటు….రెండు సెంట్లలో చిన్న ఇల్లు నిర్మించుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ప్రక్రియ ఇబ్బందికరంగా మారింది. అనుమతుల కోసం కార్యాలయం చుట్టూ తిరగడం ఒక ఎత్తయితే, దాని మార్కెట్ విలువను బట్టి ఫీజు కింద నగదు చెల్లించడం మరొక ఎత్తు.

ఈ నేపథ్యంలోనే పేద, మధ్యతరగతి వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఏపీ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పేద, మధ్య తరగతి గృహ నిర్మాణదారులకు మంత్రి పొంగూరు నారాయణ తీపి కబురు చెప్పారు. నగరాల్లో 100 గజాల్లోపు నిర్మించే ఇళ్లకు టౌన్ ప్లానింగ్ మంజూరు ప్రక్రియను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని నారాయణ ప్రకటించారు. 2 సెంట్ల లోపు ఇల్లు నిర్మించుకునేవారు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ కోసం తిరగాల్సిన పనిలేదని తెలిపారు.

పేద, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు తొలగించేలాగా భవన నిర్మాణానికి అనుమతుల విధానాలను సరళీకరించామని చెప్పారు. అందుకోసం తగిన నిర్ణయాలు తీసుకుంటామని నారాయణ చెప్పారు. దాంతో పాటు 300 గజాల లోపు ఇళ్లకు సులభంగా టౌన్ ప్లానింగ్ అప్రూవల్ వచ్చేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. వివిధ అంశాలపై అధికారులతో చర్చించిన మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు.

This post was last modified on November 4, 2024 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

1 minute ago

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

1 hour ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago