Political News

వైట్ హౌస్ కూడా రుషికొండ ప్యాలెస్ లా లేదు: చంద్రబాబు

విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దుబారా చేసి హైకోర్టు, ఎన్ జీటీ వద్దంటున్నా వినకుండా రుషికొండపై నిర్మాణాలు చేపట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రుషికొండపైకి ప్రతిపక్ష నేతలనుగాని, వైసీపీయేతర వ్యక్తులను కానీ ఐదేళ్లపాటు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా రుషికొండపై ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారిగా పర్యటించారు.

రుషికొండలోని 7 భవనాల సముదాయాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎం తన విలాసాల కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం చరిత్రలో లేదని చంద్రబాబు విమర్శించారు. కలలో కూడా ఊహించనిది జరిగిందని, ఒక వ్యక్తి విలాసం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు అన్న విషయం ఈ భవనాలు చూసాకే తెలిసిందని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రుషికొండ భవనాల్లోకి వెళ్లే కొద్దీ గుండె చెదిరిపోయి వాస్తవాలు బయటకు వస్తున్నాయని అన్నారు.

గతంలో మీడియా, ప్రతిపక్ష నేతలు ఎంత ప్రయత్నించినా రుషికొండపైకి అనుమతించలేదని, ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా చేశారని గుర్తు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మభ్య పెట్టారని, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకంగా ఏదైనా చేయొచ్చు అనేదానికి రుషికొండ ఒక ఉదాహరణ అని అన్నారు. గతంలో రుషికొండపైకి రావాలని తాను, తన మిత్రుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేసినా అడ్డుకున్నారని అన్నారు. ఈరోజు ఇక్కడ ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, తమకు ప్రజలు వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు అధికారం ఇచ్చారని చంద్రబాబు చెప్పారు.

విశాఖలోని అత్యంత అందమైన ప్రాంతం రుషికొండ బీచ్ అని, ఈ భవనాల్లో ఎక్కడ కూర్చున్నా సముద్రం వ్యూ కనిపించేలాగా కట్టుకున్నారని చెప్పుకొచ్చారు. రాజుల కాలంలో చక్రవర్తులు కూడా ఇటువంటి భవనాలు నిర్మించుకోలేదని చంద్రబాబు ఆశ్చర్యపోయారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి ఇటువంటి ఖరీదైన భవనాలు కట్టడం చూసి ఆశ్చర్యం, ఉద్వేగం కలిగిందని…బాత్ రూమ్ కోసం 36 లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఆశ్చర్యపోయారు. జగన్ ఏమైనా రారాజు అనుకుంటున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఈ భవనాలను అందరికీ చూపిస్తామని, త్వరలోనే ఇందులోకి ప్రజలను అనుమతిస్తామని అన్నారు. ఈ భవనాలను ఎందుకు వాడుకోవాలో తనకు అర్థం కావడం లేదని, ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టడం ఏంటో తనకు తెలియడం లేదని చెప్పారు. ప్రజలంటే ఎంతో కొంత భయం ఉంటే దీనికి సమాధానం చెప్పాలని జగన్ ను డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చిన సరే విశాఖలో నేవీ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారని, పర్యాటకశాఖ కోసమే రుషికొండ ప్యాలెస్ నిర్మించామని జగన్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పిందని గుర్తు చేశారు.

తాను ఎన్నో ప్రపంచ దేశాలలో పర్యటించానని, కానీ, ఇటువంటి ఖరీదైన భవనాలను ఎక్కడా చూడలేదని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్ లో కూడా ఇటువంటి సౌకర్యాలు లేవని అన్నారు.

This post was last modified on November 2, 2024 10:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…

22 minutes ago

వారణాసి హీరోయిన్ విదేశీ రహస్యం

ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…

30 minutes ago

నాగచైతన్య.. అరాచకమైన మేకోవర్..

నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్‌లో, లవర్ బాయ్‌గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…

52 minutes ago

క్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉంది

సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…

3 hours ago

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

3 hours ago

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

7 hours ago