ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగను పురస్కరించుకొని ఇచ్చిన మాట ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత శ్రీకాకుళం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు… వైసీపీపై, జగన్ పై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 93 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచామని, పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవలేదని చంద్రబాబు అన్నారు.
తనను, తనతో పాటు ఎంతోమందిని గత ప్రభుత్వంలో హింసించారని, అయినా సరే రాజీలేని పోరాటం చేసి ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. స్వేచ్ఛ లేకుండా దౌర్భాగ్యకరమైన రోజులు జగన్ పాలనలో చూసామని మండిపడ్డారు. అయితే, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళబోనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
దీపం-1 తానే ఇచ్చానని, ఇప్పుడు దీపం-2 పథకం కూడా తానే ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఖర్చు తగ్గించేందుకు ఉచిత గ్యాస్ ఇస్తున్నానని, భర్త కంటే భార్య ఎక్కువ ఆదాయం సంపాదించుకునే పరిస్థితిని డ్వాక్రా సభ్యుల ద్వారా కల్పించాలని అన్నారు. మహిళలు, ఆడబిడ్డలకు పథకాలు అమలు చేస్తూ వచ్చానని చెప్పారు.
సిలిండర్ పథకం ప్రారంభించిన సందర్భంగా శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్ వెలిగించిన చంద్రబాబు టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పెన్షన్ అందించారు. ఆ కుటుంబానికి ఇల్లు లేదని తెలుసుకొని చంద్రబాబు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచి ఇంటి పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ను ఆదేశించారు.
This post was last modified on November 2, 2024 6:17 am
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…