ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగను పురస్కరించుకొని ఇచ్చిన మాట ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత శ్రీకాకుళం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు… వైసీపీపై, జగన్ పై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 93 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచామని, పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవలేదని చంద్రబాబు అన్నారు.
తనను, తనతో పాటు ఎంతోమందిని గత ప్రభుత్వంలో హింసించారని, అయినా సరే రాజీలేని పోరాటం చేసి ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. స్వేచ్ఛ లేకుండా దౌర్భాగ్యకరమైన రోజులు జగన్ పాలనలో చూసామని మండిపడ్డారు. అయితే, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళబోనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
దీపం-1 తానే ఇచ్చానని, ఇప్పుడు దీపం-2 పథకం కూడా తానే ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఖర్చు తగ్గించేందుకు ఉచిత గ్యాస్ ఇస్తున్నానని, భర్త కంటే భార్య ఎక్కువ ఆదాయం సంపాదించుకునే పరిస్థితిని డ్వాక్రా సభ్యుల ద్వారా కల్పించాలని అన్నారు. మహిళలు, ఆడబిడ్డలకు పథకాలు అమలు చేస్తూ వచ్చానని చెప్పారు.
సిలిండర్ పథకం ప్రారంభించిన సందర్భంగా శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్ వెలిగించిన చంద్రబాబు టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పెన్షన్ అందించారు. ఆ కుటుంబానికి ఇల్లు లేదని తెలుసుకొని చంద్రబాబు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచి ఇంటి పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ను ఆదేశించారు.
This post was last modified on November 2, 2024 6:17 am
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…