Political News

తప్పు చేసిన వారిని వదిలిపెట్టను… చంద్రబాబు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగను పురస్కరించుకొని ఇచ్చిన మాట ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత శ్రీకాకుళం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు… వైసీపీపై, జగన్ పై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 93 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచామని, పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవలేదని చంద్రబాబు అన్నారు.

తనను, తనతో పాటు ఎంతోమందిని గత ప్రభుత్వంలో హింసించారని, అయినా సరే రాజీలేని పోరాటం చేసి ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. స్వేచ్ఛ లేకుండా దౌర్భాగ్యకరమైన రోజులు జగన్ పాలనలో చూసామని మండిపడ్డారు. అయితే, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళబోనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.

దీపం-1 తానే ఇచ్చానని, ఇప్పుడు దీపం-2 పథకం కూడా తానే ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఖర్చు తగ్గించేందుకు ఉచిత గ్యాస్ ఇస్తున్నానని, భర్త కంటే భార్య ఎక్కువ ఆదాయం సంపాదించుకునే పరిస్థితిని డ్వాక్రా సభ్యుల ద్వారా కల్పించాలని అన్నారు. మహిళలు, ఆడబిడ్డలకు పథకాలు అమలు చేస్తూ వచ్చానని చెప్పారు.

సిలిండర్ పథకం ప్రారంభించిన సందర్భంగా శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్ వెలిగించిన చంద్రబాబు టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పెన్షన్ అందించారు. ఆ కుటుంబానికి ఇల్లు లేదని తెలుసుకొని చంద్రబాబు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచి ఇంటి పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ను ఆదేశించారు.

This post was last modified on November 2, 2024 6:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గోల్డెన్ ఫిష్ మాట తప్పడం మంచిదే

ఆ మధ్య డెకాయిట్ టీజర్ లాంచ్ జరిగినప్పుడు పోటీ గురించి ప్రస్తావిస్తూ అడివి శేష్ ఒక మాట అనడం అభిమానులకు…

23 minutes ago

వేసవి సినిమాల పాటల జోరు… ఆగకుండా సాగాలి

సమ్మర్ లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేక అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. పెద్ది,…

26 minutes ago

నిజాయితీకి సూపర్ స్టార్ సలాం.. పద్మకు రజినీ స్పెషల్ గిఫ్ట్!

నేటి రోజుల్లో రూపాయి చేయిజారి కింద పడితేనే వెనక్కి ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా రూ.45 లక్షల విలువైన…

47 minutes ago

అభిమానులకు ట్విస్ట్ ఇచ్చిన దురంధర్ 2

ఇవాళ అనౌన్స్ చేసిన దురంధర్ 2 టీజర్ కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు పన్నెండు దాటుతుందా…

1 hour ago

కపుల్ ఫ్రెండ్లీ లక్ష్యానికి ప్రభాస్ అండ

ఫిబ్రవరి 14 కపుల్ ఫ్రెండ్లీ విడుదల కానుంది. సక్సెస్ పరంగా హీరో సంతోష్ శోభన్ కు ఇది చాలా కీలకం.…

2 hours ago

1000 కోట్లకు తక్కువ కాకుండా బన్నీ అడుగులు

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. 'పుష్ప 2' సినిమాతో ఏకంగా…

2 hours ago