Political News

తప్పు చేసిన వారిని వదిలిపెట్టను… చంద్రబాబు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగను పురస్కరించుకొని ఇచ్చిన మాట ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత శ్రీకాకుళం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు… వైసీపీపై, జగన్ పై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 93 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచామని, పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవలేదని చంద్రబాబు అన్నారు.

తనను, తనతో పాటు ఎంతోమందిని గత ప్రభుత్వంలో హింసించారని, అయినా సరే రాజీలేని పోరాటం చేసి ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. స్వేచ్ఛ లేకుండా దౌర్భాగ్యకరమైన రోజులు జగన్ పాలనలో చూసామని మండిపడ్డారు. అయితే, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళబోనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.

దీపం-1 తానే ఇచ్చానని, ఇప్పుడు దీపం-2 పథకం కూడా తానే ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఖర్చు తగ్గించేందుకు ఉచిత గ్యాస్ ఇస్తున్నానని, భర్త కంటే భార్య ఎక్కువ ఆదాయం సంపాదించుకునే పరిస్థితిని డ్వాక్రా సభ్యుల ద్వారా కల్పించాలని అన్నారు. మహిళలు, ఆడబిడ్డలకు పథకాలు అమలు చేస్తూ వచ్చానని చెప్పారు.

సిలిండర్ పథకం ప్రారంభించిన సందర్భంగా శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్ వెలిగించిన చంద్రబాబు టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పెన్షన్ అందించారు. ఆ కుటుంబానికి ఇల్లు లేదని తెలుసుకొని చంద్రబాబు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచి ఇంటి పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ను ఆదేశించారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

3 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

7 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

8 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

8 hours ago