వైసీపీ నేతలకు సంబంధించి రోజుకో కేసు వెలుగు చూస్తోంది. ఇప్పటికే మాజీ ఎంపీ సహా.. ఓ మాజీ ఎమ్మెల్యే కూడా కేసుల్లో చిక్కుకుని జైలు-బెయిల్ అంటూ.. తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు మరో కేసు వెలుగుచూసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కమ్ మంత్రి మేరుగ నాగార్జునపై విజయవాడకు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అన్ని విధాలా మంత్రి మోసం చేశారని ఆమె పేర్కొనడం గమనార్హం.
విషయం ఏంటంటే..
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మేరుగ నాగార్జున ఉన్నత విద్యావంతుడు, మాజీ ప్రొఫెసర్ కూడా. ఆయనకు వైసీపీ హయాంలో మంత్రి పోస్టు దక్కింది. గతంలో ఎప్పుడూ కూడా ఆయనపై ఎలాంటి వివాదాలు లేకపోవడం గమనార్హం. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనపై ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనం గా మారింది. విజయవాడకు చెందిన పద్మావతి అనే మహిళ.. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు.
“మాకు చిన్నపాటి కాంట్రాక్టులు ఇప్పిస్తామని మాజీ మంత్రి నాగార్జున తన హయాంలో హామీ ఇచ్చారు. రోజూ నాతో ఫోన్లో మాట్లాడేవారు. ఈ క్రమంలో కాంట్రాక్టుల పేరుతో మా నుంచి 90 లక్షల రూపాయలు తీసుకున్నారు. నన్ను లైంగికంగా కూడా వాడుకున్నారు. ఆ తర్వాత.. కాంట్రాక్టులు ఇప్పించలేదు. ఈ నేపథ్యంలో మా డబ్బులు(90 లక్షలు) తిరిగి ఇవ్వమని కోరుతుంటే.. మా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. చంపేస్తామని కొందరు ఫోన్లు చేస్తున్నారు” అని నాగార్జునపై ఫిర్యాదు చేయడం గమనార్హం.
పద్మావతి చేసిన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు మీడియాకు తెలిపారు. దీనిలో నిజాలను గుర్తించిన తర్వాత.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎఫ్ ఐఆర్ నమోదు చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం పద్మావతి ఇచ్చిన ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. దీనిపై మేరుగ నాగార్జున స్పందించాల్సి ఉంది.
This post was last modified on November 2, 2024 6:12 am
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…