ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి నాలుగు మాసాలు అయింది. అయితే… వచ్చిన తొలినాళ్లలో చేయాలనుకున్న పనులను కొంత లేటుగా ప్రారంభించేవారు. అనేక వాయిదాలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క పింఛను పంపిణీని మాత్రమే సమయానికి చేపట్టారు. జూలై 1న పంచేశారు. కానీ, ఉచిత ఇసుక విషయంలో కొంత ఆలస్యంగానే ప్రారంభించారు. నూతన మద్యం విధానాన్ని కూడా ఆలస్యంగానే చేపట్టారు.
కానీ, ఉచిత గ్యాస్ పథకంపై మాత్రం తీసుకున్న నిర్ణయం.. చెప్పిన సమయం దాటకుండా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇది చంద్రబాబుకు కూటమి సర్కారుకు కూడా సంచలనమేనని చెప్పాలి. ఇలా అత్యంత వేగంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం వెనుక.. ఓ రీజన్ ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదంటూ.. వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని.. ఐదో నెల ప్రారంభానికి(సర్కారు ఏర్పడి నవంబరు 12తో ఐదు నెలలు) ముందే.. సూపర్ సిక్స్ను అమలు చేయడం ద్వారా.. విమర్శలకు చెక్ పెట్టాలన్నది చంద్రబాబుఆలోచన. దీనికి తోడు.. ప్రచారం చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు ఈ పథకాన్ని చెప్పిన సమయానికి ప్రారంభిస్తున్నారన్నది ఒక చర్చ.
ఇక, దీనికితోడు.. ఇప్పటి వరకు ఒకే ఒక్క కార్యక్రమాన్ని సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ కలిసి ప్రారంభించారు. అది కూడా ఒకేరోజు, ఒకే సమయంలో. అదే.. గ్రామసభలు. దీనికి పెద్ద ఎత్తున మంచి పేరు వచ్చింది. రికార్డు కూడా.. సృష్టించారు. ఆ తర్వాత.. పలు కార్యక్రమాలు చేపట్టినా.. ఎవరికి వారే చేపట్టారు. కానీ, ఇప్పుడు. ఉచిత గ్యాస్ పంపిణీని మాత్రం ఇద్దరూ కలిసిచేపడుతుండడం మరో విశేషం. చంద్రబాబు శ్రీకాకుళంలో ప్రారంభిస్తుండగా.. పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరిలో ప్రారంభిస్తున్నారు. ఇద్దరూ ఒకే సమయంలో దీనికి శ్రీకారం చుడుతున్నారు. తద్వారా.. మరింత హైప్ తీసుకురావొచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది.
This post was last modified on November 1, 2024 3:04 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…