క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అన్నారు కానీ.. ఇప్పుడు ఇది రాజకీయాలకు బాగా నప్పుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం చాలా చాలా కష్టంగా మారిపోయింది. పార్టీలతో సంబంధం లేదు.. నాయకులతోనూ సంబంధం లేదు. అంతా.. ఒక మాయా రాజకీయం దేశాన్ని కమ్మేసింది. ఏపీ విషయానికి వస్తే.. వైసీపీలో పదవులు అనుభవించిన వారు కూడా.. ఇప్పుడు తిరగబడుతున్నారు.
వీరితో పోలిస్తే.. పదవులు ఆశించి.. భంగ పడిన వారి బాధ మరో విధంగా ఉంది. ఈ నేపథ్యంలో వారు మరింత దూకుడుగా ముందు వచ్చేస్తున్నారు. అయితే.. ఇలాంటి వారిని చేర్చుకునేందుకు కొన్నికొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నా.. అధికార పార్టీ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తుండడం గమనార్హం. ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు వైసీపీ నుంచి వచ్చేస్తామని చెబుతున్నారు.
వీరిలో ఒకరు ఇప్పటికే వైసీపీ రాజీనామా కూడా చేశారు. మరొకరు రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే.. వీరిలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో వారు వెయిటింగ్లో ఉన్నారు. వారే.. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. ఆయన ఎప్పుడెప్పుడు వచ్చి.. సైకిల్ ఎక్కుదామా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
కానీ, చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీనికి ఓ మంత్రి కారణమని అంటున్నారు. ఇక, మరో నాయకుడు.. కరణం బలరామకృష్ణమూర్తి. ఈయన కూడా.. ఎదురు చూస్తున్నారు. వచ్చెయ్ అంటే.. చాలు.. జేబులోనే ఉన్న రాజీనామా పత్రాన్ని వైసీపీకి గిరాటు వేసి.. వచ్చేయాలని భావిస్తున్నారు. కానీ, ఇక్కడ కూడా.. మరోమంత్రి అడ్డు పడుతున్నట్టు సమాచారం. దీంతో వీరిద్దరి వ్యవహారం కూడా.. నానుతూనే ఉంది. దీపావళి వెళ్లాక.. మీకు శుభ వార్త వస్తుందని.. పార్టీ నుంచి సంకేతాలు వచ్చినట్టు సమాచారం. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 1, 2024 10:31 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…