క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అన్నారు కానీ.. ఇప్పుడు ఇది రాజకీయాలకు బాగా నప్పుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం చాలా చాలా కష్టంగా మారిపోయింది. పార్టీలతో సంబంధం లేదు.. నాయకులతోనూ సంబంధం లేదు. అంతా.. ఒక మాయా రాజకీయం దేశాన్ని కమ్మేసింది. ఏపీ విషయానికి వస్తే.. వైసీపీలో పదవులు అనుభవించిన వారు కూడా.. ఇప్పుడు తిరగబడుతున్నారు.
వీరితో పోలిస్తే.. పదవులు ఆశించి.. భంగ పడిన వారి బాధ మరో విధంగా ఉంది. ఈ నేపథ్యంలో వారు మరింత దూకుడుగా ముందు వచ్చేస్తున్నారు. అయితే.. ఇలాంటి వారిని చేర్చుకునేందుకు కొన్నికొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నా.. అధికార పార్టీ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తుండడం గమనార్హం. ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు వైసీపీ నుంచి వచ్చేస్తామని చెబుతున్నారు.
వీరిలో ఒకరు ఇప్పటికే వైసీపీ రాజీనామా కూడా చేశారు. మరొకరు రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే.. వీరిలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో వారు వెయిటింగ్లో ఉన్నారు. వారే.. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. ఆయన ఎప్పుడెప్పుడు వచ్చి.. సైకిల్ ఎక్కుదామా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
కానీ, చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీనికి ఓ మంత్రి కారణమని అంటున్నారు. ఇక, మరో నాయకుడు.. కరణం బలరామకృష్ణమూర్తి. ఈయన కూడా.. ఎదురు చూస్తున్నారు. వచ్చెయ్ అంటే.. చాలు.. జేబులోనే ఉన్న రాజీనామా పత్రాన్ని వైసీపీకి గిరాటు వేసి.. వచ్చేయాలని భావిస్తున్నారు. కానీ, ఇక్కడ కూడా.. మరోమంత్రి అడ్డు పడుతున్నట్టు సమాచారం. దీంతో వీరిద్దరి వ్యవహారం కూడా.. నానుతూనే ఉంది. దీపావళి వెళ్లాక.. మీకు శుభ వార్త వస్తుందని.. పార్టీ నుంచి సంకేతాలు వచ్చినట్టు సమాచారం. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…