బీజేపీకి వీర విధేయులుగా ఉన్న చాలా మంది నాయకుల్లో కొందరి పరిస్థితి కక్కలేని, మింగలేని స్థితిలో ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. బీజేపీ కోసం ఎంతో శ్రమించిన వారు ఉన్నారు. కీలకమైన బీజేపీ సిద్ధాంతాలను కూడా ప్రచారంలో పెట్టిన వారు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో బీజేపీలోని కొందరు నాయకులు.. చాలా అంకిత భావంతో వ్యవహరించారు.
నిరంతరం.. శ్రీవారి ఆలయం గురించే వారు ఆవేదన చెందారు. ఆలయంలో ఆచారాలు భ్రష్టు పడుతున్నాయని, సంప్రదాయాలకు విలువ లేకుండా పోతోందని.. పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వారు.. వాటి కోసం పోరాటాలు చేసిన వారు కూడా ఉన్నారు. వీరిలో తిరుపతికే చెందిన భాను ప్రకాశ్ రెడ్డి, అదేవిధంగా అనంతపురానికి చెందిన బీజేపీ ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరి దృష్టి అంతా శ్రీవారి ఆలయ బోర్డుపైనే ఉంది.
“ఈసారి మనకు ఖాయం. అన్న మనల్ని కూర్చోబెడతాడు” అని భావించిన ఇలాంటి ముగ్గురు నలుగురు కీలక నాయకులు.. ఓ మంత్రిపై ఆశలు కూడా పెట్టుకున్నారు.
అంతేకాదు.. మాజీ బీజేపీ చీఫ్ ద్వారా.. కేంద్రంలోని పెద్దలకు కూడా సమాచారం చేరవేశారు. టీడీపీ బోర్డులో సభ్యత్వం కోసం నానా ప్రయత్నా లు చేశారు. తాము తిరుమల పవిత్రత కోసం, తిరుమల కోసం ఎంతో కష్టపడి పనిచేశామని చెప్పుకొన్నారు.
కానీ, ఫాపం.. ఈ బీజేపీ వీర విధేయుల ఆశలు ఫలించలేదు. బీజేపీ నుంచి ఎవరికీ దక్కలేదు. కానీ, ఇదే బీజేపీ కోటాలో గుజరాత్కు చెందిన కీలక వ్యక్తి డాక్టర్ అదిత్ దేశాయ్కు బోర్డులో సభ్యత్వం దక్కింది. ఇలా ఈ పదవి దక్కడం వెనుక.. కేంద్రంలోని బలమైన మంత్రి సిఫారసు ఉన్నట్టు సమాచారం. అందుకే.. బీజేపీకి ఏపీ కోటాలో ఎవరికీ అవకాశం దక్కక పోవడం గమనార్హం. ఇది .. ఇప్పటి వరకు వీరవిధేయులుగా ఉన్న వారిని నిరాశకు గురి చేసిందనే చెప్పాలి.
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…