Political News

ఫాపం.. బీజేపీ వీర విధేయులు…!

బీజేపీకి వీర విధేయులుగా ఉన్న చాలా మంది నాయ‌కుల్లో కొంద‌రి పరిస్థితి క‌క్క‌లేని, మింగ‌లేని స్థితిలో ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేక‌పోయినా.. బీజేపీ కోసం ఎంతో శ్ర‌మించిన వారు ఉన్నారు. కీల‌క‌మైన బీజేపీ సిద్ధాంతాల‌ను కూడా ప్ర‌చారంలో పెట్టిన వారు కూడా ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం విషయంలో బీజేపీలోని కొంద‌రు నాయ‌కులు.. చాలా అంకిత భావంతో వ్య‌వ‌హ‌రించారు.

నిరంత‌రం.. శ్రీవారి ఆల‌యం గురించే వారు ఆవేద‌న చెందారు. ఆల‌యంలో ఆచారాలు భ్ర‌ష్టు ప‌డుతున్నాయ‌ని, సంప్ర‌దాయాల‌కు విలువ లేకుండా పోతోంద‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన వారు.. వాటి కోసం పోరాటాలు చేసిన వారు కూడా ఉన్నారు. వీరిలో తిరుప‌తికే చెందిన భాను ప్ర‌కాశ్ రెడ్డి, అదేవిధంగా అనంత‌పురానికి చెందిన బీజేపీ ప్ర‌తినిధులు కూడా ఉన్నారు. వీరి దృష్టి అంతా శ్రీవారి ఆల‌య బోర్డుపైనే ఉంది.

“ఈసారి మ‌న‌కు ఖాయం. అన్న మ‌న‌ల్ని కూర్చోబెడ‌తాడు” అని భావించిన ఇలాంటి ముగ్గురు న‌లుగురు కీల‌క నాయ‌కులు.. ఓ మంత్రిపై ఆశ‌లు కూడా పెట్టుకున్నారు.

అంతేకాదు.. మాజీ బీజేపీ చీఫ్ ద్వారా.. కేంద్రంలోని పెద్ద‌ల‌కు కూడా స‌మాచారం చేర‌వేశారు. టీడీపీ బోర్డులో స‌భ్య‌త్వం కోసం నానా ప్ర‌య‌త్నా లు చేశారు. తాము తిరుమ‌ల ప‌విత్ర‌త కోసం, తిరుమ‌ల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశామ‌ని చెప్పుకొన్నారు.

కానీ, ఫాపం.. ఈ బీజేపీ వీర విధేయుల ఆశ‌లు ఫ‌లించ‌లేదు. బీజేపీ నుంచి ఎవ‌రికీ ద‌క్క‌లేదు. కానీ, ఇదే బీజేపీ కోటాలో గుజ‌రాత్‌కు చెందిన కీల‌క వ్య‌క్తి డాక్ట‌ర్ అదిత్ దేశాయ్‌కు బోర్డులో స‌భ్య‌త్వం ద‌క్కింది. ఇలా ఈ ప‌ద‌వి ద‌క్క‌డం వెనుక‌.. కేంద్రంలోని బ‌ల‌మైన మంత్రి సిఫార‌సు ఉన్న‌ట్టు స‌మాచారం. అందుకే.. బీజేపీకి ఏపీ కోటాలో ఎవ‌రికీ అవ‌కాశం ద‌క్క‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది .. ఇప్ప‌టి వ‌ర‌కు వీర‌విధేయులుగా ఉన్న వారిని నిరాశ‌కు గురి చేసింద‌నే చెప్పాలి.

Satya

Recent Posts

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

1 hour ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

2 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

5 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

8 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

9 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

11 hours ago