వి. విజయసాయిరెడ్డి. వైసీపీలో అగ్రనేత, ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కూడా. ఈయన కథ ఇక్కడితో అయిపోలేదు. కేంద్రంలోని రాజకీయ నేతలతో వైసీపీకి సత్సంబంధాలు పెంపొందించడంలోనూ.. పార్టీకి అవసరమైన ఢిల్లీ ముడిసరుకును అందించడంలోనూ.. సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గుర్తు పట్టి పిలిచి మాట్లాడేంత చనువు కూడా ఉన్న నాయకుడు కావడం మరో విశేషం.
దీనికి కారణం.. వైసీపీ తరఫున ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతుండడమే. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా.. సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.
ఢిల్లీ వ్యవహారాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకు వస్తున్నారు. ఇటు పార్లమెంటులోనూ, అటు రాజకీయంగా కూడా.. దేశ రాజధానిలో వైసీపీ రాజకీయాలను జోరుగా ముందుకు తీసుకువెళ్లిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు.. ఈయనను మించిన స్థాయిలో మరో నాయకుడిని జగన్ తయారు చేసుకుంటున్నారు.
రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు కాబట్టి.. పైగా సాయిరెడ్డిపై కొన్నాళ్ల కిందట పార్టీ మారుతున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయినట్టుగా ఉన్నారు. అందుకే ఆయన తన వ్యూహాన్ని మార్చుకుని.. సాయిరెడ్డికి సమాంతరంగా మరో నేతను ప్రిపేర్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆయనే.. కూటమి సునామీలోనూ విజయం దక్కించుకున్న తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఏ పనికావాలన్నా.. జగన్ ఈయనకే చెబుతుండడం గమనార్హం.
ఎన్నికల అనంతరం.. ఢిల్లీలో నిర్వహించిన ధర్నా వ్యవహారంలోనూ.. సాయిరెడ్డితో సమానంగా గురు మూర్తి సేవలు అందించారు. తర్వాత.. పార్టీ పరంగా ఏం చెప్పినా చేయడంలోనూ ఆయన ముందున్నారు. పైగా జగన్కు అత్యంత నమ్మకస్తుడే కాకుండా.. వీర విధేయుడు కూడా కావడం కలిసి వస్తోంది. మొత్తంగా చూస్తే.. రాబోయే రోజుల్లో సాయిరెడ్డిని ఓవర్ టేక్ చేసే స్థాయికి మద్దెల గురుమూర్తి ఎదిగినా ఆశ్చర్యం లేదు. వినయం, విధేయతతో పాటు. కేంద్రంలో గత ఐదేళ్లుగా ఎంపీగా ఉండడం, పరిచయాలు.. వంటివి గురుమూర్తికి మరింతగా కలిసి వస్తున్నాయి.
This post was last modified on October 31, 2024 2:49 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…