వి. విజయసాయిరెడ్డి. వైసీపీలో అగ్రనేత, ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కూడా. ఈయన కథ ఇక్కడితో అయిపోలేదు. కేంద్రంలోని రాజకీయ నేతలతో వైసీపీకి సత్సంబంధాలు పెంపొందించడంలోనూ.. పార్టీకి అవసరమైన ఢిల్లీ ముడిసరుకును అందించడంలోనూ.. సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గుర్తు పట్టి పిలిచి మాట్లాడేంత చనువు కూడా ఉన్న నాయకుడు కావడం మరో విశేషం.
దీనికి కారణం.. వైసీపీ తరఫున ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతుండడమే. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా.. సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.
ఢిల్లీ వ్యవహారాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకు వస్తున్నారు. ఇటు పార్లమెంటులోనూ, అటు రాజకీయంగా కూడా.. దేశ రాజధానిలో వైసీపీ రాజకీయాలను జోరుగా ముందుకు తీసుకువెళ్లిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు.. ఈయనను మించిన స్థాయిలో మరో నాయకుడిని జగన్ తయారు చేసుకుంటున్నారు.
రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు కాబట్టి.. పైగా సాయిరెడ్డిపై కొన్నాళ్ల కిందట పార్టీ మారుతున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయినట్టుగా ఉన్నారు. అందుకే ఆయన తన వ్యూహాన్ని మార్చుకుని.. సాయిరెడ్డికి సమాంతరంగా మరో నేతను ప్రిపేర్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆయనే.. కూటమి సునామీలోనూ విజయం దక్కించుకున్న తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఏ పనికావాలన్నా.. జగన్ ఈయనకే చెబుతుండడం గమనార్హం.
ఎన్నికల అనంతరం.. ఢిల్లీలో నిర్వహించిన ధర్నా వ్యవహారంలోనూ.. సాయిరెడ్డితో సమానంగా గురు మూర్తి సేవలు అందించారు. తర్వాత.. పార్టీ పరంగా ఏం చెప్పినా చేయడంలోనూ ఆయన ముందున్నారు. పైగా జగన్కు అత్యంత నమ్మకస్తుడే కాకుండా.. వీర విధేయుడు కూడా కావడం కలిసి వస్తోంది. మొత్తంగా చూస్తే.. రాబోయే రోజుల్లో సాయిరెడ్డిని ఓవర్ టేక్ చేసే స్థాయికి మద్దెల గురుమూర్తి ఎదిగినా ఆశ్చర్యం లేదు. వినయం, విధేయతతో పాటు. కేంద్రంలో గత ఐదేళ్లుగా ఎంపీగా ఉండడం, పరిచయాలు.. వంటివి గురుమూర్తికి మరింతగా కలిసి వస్తున్నాయి.
This post was last modified on October 31, 2024 2:49 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…