వి. విజయసాయిరెడ్డి. వైసీపీలో అగ్రనేత, ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కూడా. ఈయన కథ ఇక్కడితో అయిపోలేదు. కేంద్రంలోని రాజకీయ నేతలతో వైసీపీకి సత్సంబంధాలు పెంపొందించడంలోనూ.. పార్టీకి అవసరమైన ఢిల్లీ ముడిసరుకును అందించడంలోనూ.. సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గుర్తు పట్టి పిలిచి మాట్లాడేంత చనువు కూడా ఉన్న నాయకుడు కావడం మరో విశేషం.
దీనికి కారణం.. వైసీపీ తరఫున ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతుండడమే. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా.. సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.
ఢిల్లీ వ్యవహారాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకు వస్తున్నారు. ఇటు పార్లమెంటులోనూ, అటు రాజకీయంగా కూడా.. దేశ రాజధానిలో వైసీపీ రాజకీయాలను జోరుగా ముందుకు తీసుకువెళ్లిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు.. ఈయనను మించిన స్థాయిలో మరో నాయకుడిని జగన్ తయారు చేసుకుంటున్నారు.
రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు కాబట్టి.. పైగా సాయిరెడ్డిపై కొన్నాళ్ల కిందట పార్టీ మారుతున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయినట్టుగా ఉన్నారు. అందుకే ఆయన తన వ్యూహాన్ని మార్చుకుని.. సాయిరెడ్డికి సమాంతరంగా మరో నేతను ప్రిపేర్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆయనే.. కూటమి సునామీలోనూ విజయం దక్కించుకున్న తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఏ పనికావాలన్నా.. జగన్ ఈయనకే చెబుతుండడం గమనార్హం.
ఎన్నికల అనంతరం.. ఢిల్లీలో నిర్వహించిన ధర్నా వ్యవహారంలోనూ.. సాయిరెడ్డితో సమానంగా గురు మూర్తి సేవలు అందించారు. తర్వాత.. పార్టీ పరంగా ఏం చెప్పినా చేయడంలోనూ ఆయన ముందున్నారు. పైగా జగన్కు అత్యంత నమ్మకస్తుడే కాకుండా.. వీర విధేయుడు కూడా కావడం కలిసి వస్తోంది. మొత్తంగా చూస్తే.. రాబోయే రోజుల్లో సాయిరెడ్డిని ఓవర్ టేక్ చేసే స్థాయికి మద్దెల గురుమూర్తి ఎదిగినా ఆశ్చర్యం లేదు. వినయం, విధేయతతో పాటు. కేంద్రంలో గత ఐదేళ్లుగా ఎంపీగా ఉండడం, పరిచయాలు.. వంటివి గురుమూర్తికి మరింతగా కలిసి వస్తున్నాయి.
This post was last modified on October 31, 2024 2:49 pm
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…