వి. విజయసాయిరెడ్డి. వైసీపీలో అగ్రనేత, ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కూడా. ఈయన కథ ఇక్కడితో అయిపోలేదు. కేంద్రంలోని రాజకీయ నేతలతో వైసీపీకి సత్సంబంధాలు పెంపొందించడంలోనూ.. పార్టీకి అవసరమైన ఢిల్లీ ముడిసరుకును అందించడంలోనూ.. సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గుర్తు పట్టి పిలిచి మాట్లాడేంత చనువు కూడా ఉన్న నాయకుడు కావడం మరో విశేషం.
దీనికి కారణం.. వైసీపీ తరఫున ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతుండడమే. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా.. సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.
ఢిల్లీ వ్యవహారాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకు వస్తున్నారు. ఇటు పార్లమెంటులోనూ, అటు రాజకీయంగా కూడా.. దేశ రాజధానిలో వైసీపీ రాజకీయాలను జోరుగా ముందుకు తీసుకువెళ్లిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు.. ఈయనను మించిన స్థాయిలో మరో నాయకుడిని జగన్ తయారు చేసుకుంటున్నారు.
రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు కాబట్టి.. పైగా సాయిరెడ్డిపై కొన్నాళ్ల కిందట పార్టీ మారుతున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయినట్టుగా ఉన్నారు. అందుకే ఆయన తన వ్యూహాన్ని మార్చుకుని.. సాయిరెడ్డికి సమాంతరంగా మరో నేతను ప్రిపేర్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆయనే.. కూటమి సునామీలోనూ విజయం దక్కించుకున్న తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఏ పనికావాలన్నా.. జగన్ ఈయనకే చెబుతుండడం గమనార్హం.
ఎన్నికల అనంతరం.. ఢిల్లీలో నిర్వహించిన ధర్నా వ్యవహారంలోనూ.. సాయిరెడ్డితో సమానంగా గురు మూర్తి సేవలు అందించారు. తర్వాత.. పార్టీ పరంగా ఏం చెప్పినా చేయడంలోనూ ఆయన ముందున్నారు. పైగా జగన్కు అత్యంత నమ్మకస్తుడే కాకుండా.. వీర విధేయుడు కూడా కావడం కలిసి వస్తోంది. మొత్తంగా చూస్తే.. రాబోయే రోజుల్లో సాయిరెడ్డిని ఓవర్ టేక్ చేసే స్థాయికి మద్దెల గురుమూర్తి ఎదిగినా ఆశ్చర్యం లేదు. వినయం, విధేయతతో పాటు. కేంద్రంలో గత ఐదేళ్లుగా ఎంపీగా ఉండడం, పరిచయాలు.. వంటివి గురుమూర్తికి మరింతగా కలిసి వస్తున్నాయి.
This post was last modified on October 31, 2024 2:49 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…