ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై చేద్దామని రెడ్ లో నటిస్తే పెద్దగా పట్టించుకోలేదు. ఇలా కాదు బోయపాటిని నమ్ముకుంటే తిరుగుండదని స్కంద చేస్తే అది కూడా వీటి దారే పట్టింది. సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది కదాని డబుల్ ఇస్మార్ట్ ట్రై చేస్తే దాని నష్టాల నుంచి కోలుకోవడానికి పూరి జగన్నాథ్ కు చాలా టైం పట్టింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరూ బాగానే ఉందన్న ఆంధ్రకింగ్ తాలూకా బోల్తా కొట్టడం నిజంగా షాకే. తనకే కాదు ఇండస్ట్రీనే దీన్నో కేస్ స్టడీలా చూసే పరిస్థితి వచ్చింది. కనీసం బ్రేక్ ఈవెన్ కాకపోవడం ఎవరూ ఊహించనిది.
ఈ సినిమా కోసం గీత రచయితగా మారిన రామ్ ఒక పాట రాసిన సంగతి తెలిసిందే. సాంగ్ బాగానే వెళ్ళింది కానీ లిరిక్స్ అయితే మరీ గొప్పగా లేవు. కాకపోతే ఒక నటుడు ఆ మాత్రం సాహిత్యం ఇవ్వడం గొప్ప విషయమే. ఇప్పుడీ పరిధి దాటి రామ్ స్వయంగా స్టోరీ రైటర్ కాబోతున్నాడని లేటెస్ట్ అప్డేట్. తనకు నచ్చేలా సూటయ్యేలా స్వంతంగా కథ రాసుకున్నాడట. పూర్తి సంతృప్తి కలిగాక అప్పుడు నిర్మాణ సంస్థ, దర్శకుడిని నిర్ణయించుకుంటాడని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం ఒక కొత్త దర్శకుడితో హారర్ కామెడీ చేసే ఆలోచనలో ఉన్న రామ్ దానికి ఫైనల్ సిగ్నల్ ఇవ్వలేదు. ఓకే కాగానే అనౌన్స్ మెంట్ వస్తుందని వినికిడి.
ఇలా హీరోలే కథలు రాసుకోవడం, స్క్రిప్ట్ లో పాలు పంచుకోవడం కొత్త కాదు. కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ఈ జాబితాలో ఉన్నాడు. ఒకప్పుడు కృష్ణ, ఎన్టీఆర్ లాంటి లెజెండరీ స్టార్స్ కథలు రాసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. చిరంజీవి మృగరాజుకి కథ ఇచ్చింది నాగబాబే. అఫ్కోర్స్ అది హాలీవుడ్ మూవీ ఫ్రీ మేక్ కావడం వేరే విషయం. ఇప్పుడు రామ్ ఎలాంటి జానర్ లో సబ్జెక్టు రాసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కాబట్టి దీన్ని ప్రతిపాదన కిందే చూడాలి. తన స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం అభిమానులైతే ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాదైనా దక్కాలని వాళ్ళ కోరిక.
This post was last modified on December 16, 2025 6:08 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…