Movie News

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొందరు ఏకంగా ఈ సినిమా హార్డ్ డిస్క్ పోయిందని, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు పెట్టడం వాళ్లలో ఉన్న అసహనాన్ని బయట పెడుతోంది. కంగువ కోసం ఏళ్ళ తరబడి కష్టాన్ని బూడిదపాలు చేసుకున్న సూర్యకు కరుప్పు పెద్ద బ్రేక్ అవుతుందని మూవీ లవర్స్ ఆశిస్తున్నారు. లాయర్, దేవుడిగా రెండు సంబంధం లేని పాత్రలు చేస్తున్న సూర్య దీని క్లైమాక్స్ లో కాంతార రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని ఇప్పటికీ టీమ్ నుంచి వచ్చిన లీకులు అంచనాలు పెంచుతున్నాయి.

ఆర్జె బాలాజీ దర్శకత్వంలో రూపొందిన కరుప్పుకి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ఓటిటి డీల్స్ వల్ల జరిగిన ఆలస్యం పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చింది. ఇంకో వైపు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లేట్ గా మొదలైన సూర్య 46 ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. వేసవి రిలీజ్ కు సితార సంస్థ ప్లానింగ్ లో ఉంది. కరుప్పు సంక్రాంతికి రాలేదు. ఎందుకంటే జన నాయకుడు, పరాశక్తితో పాటు తెలుగులో ఇంకో అయిదు సినిమాలు పోటీలో ఉన్నాయి. జనవరి చివరికి వెళదామంటే కమర్షియల్ గా ఎంతమేరకు వర్కౌట్ అవుతుందనే దాని మీద అనుమానాలు ఉన్నాయట. ఫిబ్రవరి డ్రై సీజన్ కాబట్టి థియేటర్ రన్ ఎక్కువ రాదనే డౌట్ కావొచ్చు.

వీలైనంత త్వరగా కరుప్పు డైలమాకు చెక్ పెట్టాలి. తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలు రావడం కూడా అంత సేఫ్ కాదు. ఇలా అయితే కరుప్పు మీద మెల్లగా బజ్ తగ్గిపోతుందని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఆర్జె బాలాజీ మాత్రం బయట ఎవరు అడిగినా సినిమా అదిరిపోతుందని చెబుతున్నాడు తప్పించి స్పష్టమైన అప్డేట్ ఇవ్వడం లేదు. కంగువ అంటే ప్యాన్ ఇండియా బడ్జెట్ కాబట్టి ఆలస్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ కరుప్పు లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్ కు ఇలా జరగడం హర్షించదగినది కాదు. అయినా సూర్య బంధువులే నడిపించే డ్రీం వారియర్ బ్యానర్ మూవీకి సైతం ఓటిటి చిక్కులంటే ఆలోచించాల్సిన విషయమే.

This post was last modified on December 16, 2025 10:25 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

8 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

34 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago