దేశంలో మరే రాజకీయ పార్టీ అధినేత వ్యవహరించని రీతిలో జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహరించారు.
ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు.. ఆయా వర్గాల వారికి శుభాకాంక్షలు తెలపటం.. ఈ సందర్భంగా సందేశాన్ని ఇవ్వటం చేస్తారు. అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ మాత్రం కాస్తంత కొత్తగా వ్యవహరించారు. తన సోషల్ మీడియా ఖాతాలో దీపావళిని పురస్కరించుకొని ఒక పోస్టు పెట్టారు.
దీపావళి సందర్భంగా పాకిస్థాన్.. బంగ్లాదేశ్ లలో అణిచివేతకు గురవుతున్న హిందువుల కోసం మనమంతా ప్రార్థిద్దామని ఆయన పోస్టు పెట్టి కొత్త చర్చకు తెర తీశారు.
అక్కడితో ఆగని ఆయన మరో ఆసక్తికర అంశాన్ని షేర్ చేశారు. భారత్ – పాక్ విభజనకు సంబంధించి బాధతో ఒక బాలుడు ఆలపించిన చిట్టి వీడియోను షేర్ చేశారు. నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న ఆ వీడియోలో చిన్నారి బాలుడు భావోద్వేగంతోఏమ పాడిన పాట ఆకట్టుకునేలా ఉంది.
తన దీపావళి సందేశంలో పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..”ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో ఆ శ్రీరాముడు మీకు ధైర్యాన్ని.. శక్తిని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. మీ భద్రత.. స్థిరత్వం కోసం భారత్ లోని ప్రతి ఒక్కరం ఎదురుచూస్తున్నాం. పాకిస్థాన్.. బంగ్లాదేశ్ లో అణచివేతకు గురవుతున్న హిందువుల భద్రత.. వారి ప్రాథమిక హక్కులు కల్పించేందుకు యావత్ ప్రపంచం.. ప్రపంచ నేతలు కలిసి పని చేస్తారని ఆశిస్తున్నా. వారి కోసం మనమంతా ప్రార్థిద్దాం” అంటూ సరికొత్త దీపావళి సందేశానని పోస్టు చేశారు. ఆయన సందేశం కొత్త చర్చకు తెర తీస్తుందని చెప్పక తప్పదు.
This post was last modified on October 31, 2024 12:12 pm
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…