దేశంలో మరే రాజకీయ పార్టీ అధినేత వ్యవహరించని రీతిలో జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహరించారు.
ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు.. ఆయా వర్గాల వారికి శుభాకాంక్షలు తెలపటం.. ఈ సందర్భంగా సందేశాన్ని ఇవ్వటం చేస్తారు. అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ మాత్రం కాస్తంత కొత్తగా వ్యవహరించారు. తన సోషల్ మీడియా ఖాతాలో దీపావళిని పురస్కరించుకొని ఒక పోస్టు పెట్టారు.
దీపావళి సందర్భంగా పాకిస్థాన్.. బంగ్లాదేశ్ లలో అణిచివేతకు గురవుతున్న హిందువుల కోసం మనమంతా ప్రార్థిద్దామని ఆయన పోస్టు పెట్టి కొత్త చర్చకు తెర తీశారు.
అక్కడితో ఆగని ఆయన మరో ఆసక్తికర అంశాన్ని షేర్ చేశారు. భారత్ – పాక్ విభజనకు సంబంధించి బాధతో ఒక బాలుడు ఆలపించిన చిట్టి వీడియోను షేర్ చేశారు. నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న ఆ వీడియోలో చిన్నారి బాలుడు భావోద్వేగంతోఏమ పాడిన పాట ఆకట్టుకునేలా ఉంది.
తన దీపావళి సందేశంలో పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..”ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో ఆ శ్రీరాముడు మీకు ధైర్యాన్ని.. శక్తిని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. మీ భద్రత.. స్థిరత్వం కోసం భారత్ లోని ప్రతి ఒక్కరం ఎదురుచూస్తున్నాం. పాకిస్థాన్.. బంగ్లాదేశ్ లో అణచివేతకు గురవుతున్న హిందువుల భద్రత.. వారి ప్రాథమిక హక్కులు కల్పించేందుకు యావత్ ప్రపంచం.. ప్రపంచ నేతలు కలిసి పని చేస్తారని ఆశిస్తున్నా. వారి కోసం మనమంతా ప్రార్థిద్దాం” అంటూ సరికొత్త దీపావళి సందేశానని పోస్టు చేశారు. ఆయన సందేశం కొత్త చర్చకు తెర తీస్తుందని చెప్పక తప్పదు.
This post was last modified on October 31, 2024 12:12 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…