సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణకు కీలక పదవి రెడీ అయిందా? ఆయనకు ఈ సారి ఖచ్చితంగా పదవి దక్కుతుందా? అంటే.. టీడీపీ వర్గాలు ఔననే అంటున్నాయి. ఈసారి మాత్రం చంద్రబాబు గురి తప్పదని కూడా చెబుతున్నాయి. మరి ఆ పదవి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి జస్టిస్ ఎన్ వీరమణ పదవీ విరమణ చేసిన తర్వాత.. ఏపీ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయన ఆది నుంచి చంద్రబాబు విజన్ అంటే.. ఇష్టపడుతున్న విషయం తెలిసిందే.
గతం నుంచి కూడా జస్టిస్ ఎన్వీ రమణకు, చంద్రబాబుకు మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి దక్కుతుందన్న ప్రచారం హోరెత్తిపోయింది. దీనిపై అనేక చర్చలు కూడా జరిగాయని టీడీపీలోనూ వినిపించింది. కానీ.. తాజాగా నియమించిన బోర్డులో ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు.
అయితే.. దీనికి ముందే.. చంద్రబాబు మరో ఆలోచనతో ఉన్నారన్నది ప్రస్తుతం వినిపిస్తన్న మాట. రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే తొలి స్థానంలో నిలబెట్టాలని భావిస్తున్న చంద్రబాబు.. ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని కీలకంగా భావిస్తున్నారు. ఏపీఆర్ సీ చైర్మన్ పదవిని(కేబినెట్ హోదా) జస్టిస్ ఎన్వీరమణకు ఇవ్వాలన్నది ఆయన మనసులో మాటగా.. పార్టీ నాయకులు చెబుతున్నారు.
వైసీపీ హయాంలో ఏపీఈఆర్సీ చైర్మన్గా కూడా జస్టిస్ నాగార్జున రెడ్డి వ్యవహరించారు. ఈయన కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడం గమనార్హం. ఈ పదవి తాజాగా మంగళవారం ఖాళీ అయింది. జస్టిస్ నాగార్జున రెడ్డి పదవీ కాలం ముగియడంతో(మూడేళ్లు) ఆయన తాజాగా విరమణ చేశారు. ఈ పదవినే జస్టిస్ ఎన్వీ రమణకు ఇవ్వాలని చంద్రబాబు తలపోస్తున్నట్టు సమాచారం. తద్వారా.. తన విజన్కు అనుకూలంగా జస్టిస్ రమణ అయితే.. బాగా పనిచేయగలుగుతారని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 31, 2024 12:07 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…