వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో ఆయన తనయ, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న కుట్రతోనే సరస్వతి పవర్కు సంబంధించిన షేర్లను బదలాయించుకునే కుట్ర చేస్తున్నారన్న వైసీపీ నేతల వాదనకు ఆమె గట్టిగా సమాధానం చెప్పారు. సరస్వతి షేర్లు బదలాయిస్తే.. జగన్ బెయిల్ రద్దువుతుందో.. లేదో.. మా అమ్మకు తెలీదా? అని ఆమె ప్రశ్నించారు.
ఇదంతా జగన్నాటకంలో ఒక భాగమని అర్ధమవుతోందన్నారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర చేశామని చెప్పడం.. పెద్ద జోక్గా ఆమె అభివర్ణించారు. మరోసారి ఆమె గతం తాలూకు విషయాన్ని వెల్లడించారు. జగన్ కేసులో ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్ అటాచ్ చేసింది.. షేర్లు కాదన్నారు. కేవలం 32 కోట్ల రూపాయల విలువైన సరస్వతి ఆస్తులను మాత్రమేనని చెప్పారు. షేర్లను బదలాయిస్తే.. ఎలాంటి ఇబ్బందులు రావని, దీనిని ఈడీ కట్టడి చేయలేదని స్పష్టం చేశారు.
“గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాటికి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, బదిలీలు మాత్రం ఆపలేదు” అని షర్మిల పేర్కొన్నారు. ఒక వేళ ఈడీ అటాచ్లో ఉన్న షేర్లను బదిలీ చేస్తే.. బెయిల్ రద్దు అవుతుందని తెలిసిన పెద్ద మనిషి (జగన్) ఎంవోయూపై ఎలా సంతకం చేశారని షర్మిల నిలదీశారు. “2021లో 42 కోట్ల రూపాయలకు క్లాసిక్ రియాలిటీ, సండూర్, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు?” అని షర్మిల ప్రశ్నించారు.
ఇలా విక్రయించడం మీరు చెబుతున్న ‘స్టేటస్ కో’ను ఉల్లంఘించినట్లు కాదా? అని నిలదీశారు. ఎలా చేసినా.. జగన్ బెయిల్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్న విషయం కొందరికి తెలిసినా తెలియకపోయినా.. విజయమ్మకు బాగానే తెలుసునని షర్మిల పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.
This post was last modified on October 30, 2024 10:07 pm
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…
కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…
నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…