వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో ఆయన తనయ, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న కుట్రతోనే సరస్వతి పవర్కు సంబంధించిన షేర్లను బదలాయించుకునే కుట్ర చేస్తున్నారన్న వైసీపీ నేతల వాదనకు ఆమె గట్టిగా సమాధానం చెప్పారు. సరస్వతి షేర్లు బదలాయిస్తే.. జగన్ బెయిల్ రద్దువుతుందో.. లేదో.. మా అమ్మకు తెలీదా? అని ఆమె ప్రశ్నించారు.
ఇదంతా జగన్నాటకంలో ఒక భాగమని అర్ధమవుతోందన్నారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర చేశామని చెప్పడం.. పెద్ద జోక్గా ఆమె అభివర్ణించారు. మరోసారి ఆమె గతం తాలూకు విషయాన్ని వెల్లడించారు. జగన్ కేసులో ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్ అటాచ్ చేసింది.. షేర్లు కాదన్నారు. కేవలం 32 కోట్ల రూపాయల విలువైన సరస్వతి ఆస్తులను మాత్రమేనని చెప్పారు. షేర్లను బదలాయిస్తే.. ఎలాంటి ఇబ్బందులు రావని, దీనిని ఈడీ కట్టడి చేయలేదని స్పష్టం చేశారు.
“గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాటికి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, బదిలీలు మాత్రం ఆపలేదు” అని షర్మిల పేర్కొన్నారు. ఒక వేళ ఈడీ అటాచ్లో ఉన్న షేర్లను బదిలీ చేస్తే.. బెయిల్ రద్దు అవుతుందని తెలిసిన పెద్ద మనిషి (జగన్) ఎంవోయూపై ఎలా సంతకం చేశారని షర్మిల నిలదీశారు. “2021లో 42 కోట్ల రూపాయలకు క్లాసిక్ రియాలిటీ, సండూర్, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు?” అని షర్మిల ప్రశ్నించారు.
ఇలా విక్రయించడం మీరు చెబుతున్న ‘స్టేటస్ కో’ను ఉల్లంఘించినట్లు కాదా? అని నిలదీశారు. ఎలా చేసినా.. జగన్ బెయిల్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్న విషయం కొందరికి తెలిసినా తెలియకపోయినా.. విజయమ్మకు బాగానే తెలుసునని షర్మిల పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…