Political News

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందో లేదో మా అమ్మ‌కు తెలీదా?: ష‌ర్మిల‌

వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో ఆయ‌న త‌న‌య‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌ మ‌రోసారి స్పందించారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న కుట్ర‌తోనే స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్‌కు సంబంధించిన షేర్ల‌ను బ‌దలాయించుకునే కుట్ర చేస్తున్నార‌న్న వైసీపీ నేత‌ల వాద‌న‌కు ఆమె గ‌ట్టిగా స‌మాధానం చెప్పారు. స‌ర‌స్వ‌తి షేర్లు బ‌దలాయిస్తే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దువుతుందో.. లేదో.. మా అమ్మ‌కు తెలీదా? అని ఆమె ప్ర‌శ్నించారు.

ఇదంతా జ‌గ‌న్నాటకంలో ఒక భాగ‌మ‌ని అర్ధ‌మ‌వుతోంద‌న్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుకు కుట్ర చేశామ‌ని చెప్ప‌డం.. పెద్ద జోక్‌గా ఆమె అభివ‌ర్ణించారు. మ‌రోసారి ఆమె గ‌తం తాలూకు విష‌యాన్ని వెల్ల‌డించారు. జ‌గ‌న్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ అటాచ్ చేసింది.. షేర్లు కాద‌న్నారు. కేవ‌లం 32 కోట్ల రూపాయ‌ల విలువైన స‌ర‌స్వ‌తి ఆస్తుల‌ను మాత్రమేన‌ని చెప్పారు. షేర్ల‌ను బ‌దలాయిస్తే.. ఎలాంటి ఇబ్బందులు రావ‌ని, దీనిని ఈడీ క‌ట్ట‌డి చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

“గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. వాటికి స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌, బదిలీలు మాత్రం ఆపలేదు” అని ష‌ర్మిల పేర్కొన్నారు. ఒక వేళ ఈడీ అటాచ్‌లో ఉన్న షేర్ల‌ను బ‌దిలీ చేస్తే.. బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని తెలిసిన పెద్ద మ‌నిషి (జ‌గ‌న్‌) ఎంవోయూపై ఎలా సంత‌కం చేశార‌ని ష‌ర్మిల నిల‌దీశారు. “2021లో 42 కోట్ల రూపాయ‌ల‌కు క్లాసిక్‌ రియాలిటీ, సండూర్‌, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు?” అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

ఇలా విక్ర‌యించ‌డం మీరు చెబుతున్న ‘స్టేటస్ కో’ను ఉల్లంఘించినట్లు కాదా? అని నిల‌దీశారు. ఎలా చేసినా.. జ‌గ‌న్ బెయిల్‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేద‌న్న విష‌యం కొంద‌రికి తెలిసినా తెలియ‌క‌పోయినా.. విజ‌య‌మ్మ‌కు బాగానే తెలుసున‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. కాగా, ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది చూడాలి.

This post was last modified on October 30, 2024 10:07 pm

Share

Recent Posts

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

7 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

8 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

21 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago