Political News

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందో లేదో మా అమ్మ‌కు తెలీదా?: ష‌ర్మిల‌

వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో ఆయ‌న త‌న‌య‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌ మ‌రోసారి స్పందించారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న కుట్ర‌తోనే స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్‌కు సంబంధించిన షేర్ల‌ను బ‌దలాయించుకునే కుట్ర చేస్తున్నార‌న్న వైసీపీ నేత‌ల వాద‌న‌కు ఆమె గ‌ట్టిగా స‌మాధానం చెప్పారు. స‌ర‌స్వ‌తి షేర్లు బ‌దలాయిస్తే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దువుతుందో.. లేదో.. మా అమ్మ‌కు తెలీదా? అని ఆమె ప్ర‌శ్నించారు.

ఇదంతా జ‌గ‌న్నాటకంలో ఒక భాగ‌మ‌ని అర్ధ‌మ‌వుతోంద‌న్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుకు కుట్ర చేశామ‌ని చెప్ప‌డం.. పెద్ద జోక్‌గా ఆమె అభివ‌ర్ణించారు. మ‌రోసారి ఆమె గ‌తం తాలూకు విష‌యాన్ని వెల్ల‌డించారు. జ‌గ‌న్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ అటాచ్ చేసింది.. షేర్లు కాద‌న్నారు. కేవ‌లం 32 కోట్ల రూపాయ‌ల విలువైన స‌ర‌స్వ‌తి ఆస్తుల‌ను మాత్రమేన‌ని చెప్పారు. షేర్ల‌ను బ‌దలాయిస్తే.. ఎలాంటి ఇబ్బందులు రావ‌ని, దీనిని ఈడీ క‌ట్ట‌డి చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

“గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. వాటికి స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌, బదిలీలు మాత్రం ఆపలేదు” అని ష‌ర్మిల పేర్కొన్నారు. ఒక వేళ ఈడీ అటాచ్‌లో ఉన్న షేర్ల‌ను బ‌దిలీ చేస్తే.. బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని తెలిసిన పెద్ద మ‌నిషి (జ‌గ‌న్‌) ఎంవోయూపై ఎలా సంత‌కం చేశార‌ని ష‌ర్మిల నిల‌దీశారు. “2021లో 42 కోట్ల రూపాయ‌ల‌కు క్లాసిక్‌ రియాలిటీ, సండూర్‌, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు?” అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

ఇలా విక్ర‌యించ‌డం మీరు చెబుతున్న ‘స్టేటస్ కో’ను ఉల్లంఘించినట్లు కాదా? అని నిల‌దీశారు. ఎలా చేసినా.. జ‌గ‌న్ బెయిల్‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేద‌న్న విష‌యం కొంద‌రికి తెలిసినా తెలియ‌క‌పోయినా.. విజ‌య‌మ్మ‌కు బాగానే తెలుసున‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. కాగా, ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది చూడాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago