Political News

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందో లేదో మా అమ్మ‌కు తెలీదా?: ష‌ర్మిల‌

వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో ఆయ‌న త‌న‌య‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌ మ‌రోసారి స్పందించారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న కుట్ర‌తోనే స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్‌కు సంబంధించిన షేర్ల‌ను బ‌దలాయించుకునే కుట్ర చేస్తున్నార‌న్న వైసీపీ నేత‌ల వాద‌న‌కు ఆమె గ‌ట్టిగా స‌మాధానం చెప్పారు. స‌ర‌స్వ‌తి షేర్లు బ‌దలాయిస్తే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దువుతుందో.. లేదో.. మా అమ్మ‌కు తెలీదా? అని ఆమె ప్ర‌శ్నించారు.

ఇదంతా జ‌గ‌న్నాటకంలో ఒక భాగ‌మ‌ని అర్ధ‌మ‌వుతోంద‌న్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుకు కుట్ర చేశామ‌ని చెప్ప‌డం.. పెద్ద జోక్‌గా ఆమె అభివ‌ర్ణించారు. మ‌రోసారి ఆమె గ‌తం తాలూకు విష‌యాన్ని వెల్ల‌డించారు. జ‌గ‌న్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ అటాచ్ చేసింది.. షేర్లు కాద‌న్నారు. కేవ‌లం 32 కోట్ల రూపాయ‌ల విలువైన స‌ర‌స్వ‌తి ఆస్తుల‌ను మాత్రమేన‌ని చెప్పారు. షేర్ల‌ను బ‌దలాయిస్తే.. ఎలాంటి ఇబ్బందులు రావ‌ని, దీనిని ఈడీ క‌ట్ట‌డి చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

“గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. వాటికి స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌, బదిలీలు మాత్రం ఆపలేదు” అని ష‌ర్మిల పేర్కొన్నారు. ఒక వేళ ఈడీ అటాచ్‌లో ఉన్న షేర్ల‌ను బ‌దిలీ చేస్తే.. బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని తెలిసిన పెద్ద మ‌నిషి (జ‌గ‌న్‌) ఎంవోయూపై ఎలా సంత‌కం చేశార‌ని ష‌ర్మిల నిల‌దీశారు. “2021లో 42 కోట్ల రూపాయ‌ల‌కు క్లాసిక్‌ రియాలిటీ, సండూర్‌, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు?” అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

ఇలా విక్ర‌యించ‌డం మీరు చెబుతున్న ‘స్టేటస్ కో’ను ఉల్లంఘించినట్లు కాదా? అని నిల‌దీశారు. ఎలా చేసినా.. జ‌గ‌న్ బెయిల్‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేద‌న్న విష‌యం కొంద‌రికి తెలిసినా తెలియ‌క‌పోయినా.. విజ‌య‌మ్మ‌కు బాగానే తెలుసున‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. కాగా, ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది చూడాలి.

This post was last modified on October 30, 2024 10:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

1 hour ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

1 hour ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

2 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago