Political News

సుబ్బారెడ్డి, సాయిరెడ్డి అబ‌ద్ధాలు చెబుతున్నారు: విజ‌య‌మ్మ రియాక్ష‌న్‌

వైఎస్ కుటుంబంలో రాజుకున్న ఆస్తుల వివాదం.. తార‌స్థాయికి చేరిన విష‌యం తెలిసిందే. ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు .. దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప‌ది రోజుల పాటు ఈ ఎపిసోడ్ ప‌త్రిక‌ల్లోనూ ప్ర‌ముఖంగా ముందుకు సాగింది. వైఎస్ జ‌గ‌న్ వ‌ర్సెస్ వైఎస్ ష‌ర్మిల మ‌ధ్య చోటు చేసుకున్న ఈ వివాదం అనేక మ‌లుపులు తిరిగింది. ఈ క్ర‌మంలో అంద‌రి చూపూ విజ‌య‌మ్మ వైపే పెట్టారు. ఆమె స్పందించాల‌ని కోరుకున్నారు. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు విజ‌య‌మ్మ స్పందించారు.

తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఆమె వైఎస్సార్ అభిమానుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. వైఎస్ ఆశ‌యాల మేర‌కు.. ఆస్తుల‌ను ఇద్ద‌రికీ స‌మానంగా పంచాల‌న్న‌ది వైఎస్ ఉద్దేశ‌మ‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు.. త‌న‌ను క‌ల‌చివేస్తున్నాయ‌ని చెప్పారు. ఇద్ద‌రి మ‌ధ్య‌(జ‌గ‌న్‌, ష‌ర్మిల‌) తాను ఎంతో ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు చెప్పారు. అయినా కూడా.. జ‌ర‌గ‌కూడ‌నివి జ‌రుగుతూనే ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇక‌, ఈ ఎపిసోడ్‌లో కొంద‌రు(విజ‌య‌సాయిరెడ్డి, సుబ్బారెడ్డి) జోక్యం చేసుకుని చెబుతున్న‌వ‌న్నీ.. అబ‌ద్ధా లేన‌ని చెప్పారు. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు మాట్లాడుతున్నార‌ని అన్నారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి“ అని విజ‌య‌మ్మ పేర్కొన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని తెలిపారు.

అయితే.. ఈ అబద్ధాల పరంపర ఇంక కొన‌సాగ‌కూడ‌ద‌ని తాను కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇద్ద‌రు పిల్ల‌ల‌కే కాకుండా.. రాష్ట్రానికి కూడా మంచిది కాద‌ని పేర్కొన్నారు. అయితే.. ష‌ర్మిల‌.. వైఎస్ చెప్పిన‌ట్టు.. న‌లుగురు మ‌న‌వ‌ల‌కు స‌మానంగా పంచాల‌ని కోరుతుండగా.. విజ‌య‌మ్మ మాత్రం ఇద్ద‌రి గురించే పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ లేఖ‌తో అయినా.. వివాదాలు ఆగుతాయేమో చూడాలి.

This post was last modified on October 30, 2024 10:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

20 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

36 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago