Political News

సుబ్బారెడ్డి, సాయిరెడ్డి అబ‌ద్ధాలు చెబుతున్నారు: విజ‌య‌మ్మ రియాక్ష‌న్‌

వైఎస్ కుటుంబంలో రాజుకున్న ఆస్తుల వివాదం.. తార‌స్థాయికి చేరిన విష‌యం తెలిసిందే. ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు .. దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప‌ది రోజుల పాటు ఈ ఎపిసోడ్ ప‌త్రిక‌ల్లోనూ ప్ర‌ముఖంగా ముందుకు సాగింది. వైఎస్ జ‌గ‌న్ వ‌ర్సెస్ వైఎస్ ష‌ర్మిల మ‌ధ్య చోటు చేసుకున్న ఈ వివాదం అనేక మ‌లుపులు తిరిగింది. ఈ క్ర‌మంలో అంద‌రి చూపూ విజ‌య‌మ్మ వైపే పెట్టారు. ఆమె స్పందించాల‌ని కోరుకున్నారు. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు విజ‌య‌మ్మ స్పందించారు.

తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఆమె వైఎస్సార్ అభిమానుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. వైఎస్ ఆశ‌యాల మేర‌కు.. ఆస్తుల‌ను ఇద్ద‌రికీ స‌మానంగా పంచాల‌న్న‌ది వైఎస్ ఉద్దేశ‌మ‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు.. త‌న‌ను క‌ల‌చివేస్తున్నాయ‌ని చెప్పారు. ఇద్ద‌రి మ‌ధ్య‌(జ‌గ‌న్‌, ష‌ర్మిల‌) తాను ఎంతో ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు చెప్పారు. అయినా కూడా.. జ‌ర‌గ‌కూడ‌నివి జ‌రుగుతూనే ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇక‌, ఈ ఎపిసోడ్‌లో కొంద‌రు(విజ‌య‌సాయిరెడ్డి, సుబ్బారెడ్డి) జోక్యం చేసుకుని చెబుతున్న‌వ‌న్నీ.. అబ‌ద్ధా లేన‌ని చెప్పారు. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు మాట్లాడుతున్నార‌ని అన్నారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి“ అని విజ‌య‌మ్మ పేర్కొన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని తెలిపారు.

అయితే.. ఈ అబద్ధాల పరంపర ఇంక కొన‌సాగ‌కూడ‌ద‌ని తాను కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇద్ద‌రు పిల్ల‌ల‌కే కాకుండా.. రాష్ట్రానికి కూడా మంచిది కాద‌ని పేర్కొన్నారు. అయితే.. ష‌ర్మిల‌.. వైఎస్ చెప్పిన‌ట్టు.. న‌లుగురు మ‌న‌వ‌ల‌కు స‌మానంగా పంచాల‌ని కోరుతుండగా.. విజ‌య‌మ్మ మాత్రం ఇద్ద‌రి గురించే పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ లేఖ‌తో అయినా.. వివాదాలు ఆగుతాయేమో చూడాలి.

This post was last modified on October 30, 2024 10:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

44 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

12 hours ago