Political News

సుబ్బారెడ్డి, సాయిరెడ్డి అబ‌ద్ధాలు చెబుతున్నారు: విజ‌య‌మ్మ రియాక్ష‌న్‌

వైఎస్ కుటుంబంలో రాజుకున్న ఆస్తుల వివాదం.. తార‌స్థాయికి చేరిన విష‌యం తెలిసిందే. ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు .. దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప‌ది రోజుల పాటు ఈ ఎపిసోడ్ ప‌త్రిక‌ల్లోనూ ప్ర‌ముఖంగా ముందుకు సాగింది. వైఎస్ జ‌గ‌న్ వ‌ర్సెస్ వైఎస్ ష‌ర్మిల మ‌ధ్య చోటు చేసుకున్న ఈ వివాదం అనేక మ‌లుపులు తిరిగింది. ఈ క్ర‌మంలో అంద‌రి చూపూ విజ‌య‌మ్మ వైపే పెట్టారు. ఆమె స్పందించాల‌ని కోరుకున్నారు. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు విజ‌య‌మ్మ స్పందించారు.

తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఆమె వైఎస్సార్ అభిమానుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. వైఎస్ ఆశ‌యాల మేర‌కు.. ఆస్తుల‌ను ఇద్ద‌రికీ స‌మానంగా పంచాల‌న్న‌ది వైఎస్ ఉద్దేశ‌మ‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు.. త‌న‌ను క‌ల‌చివేస్తున్నాయ‌ని చెప్పారు. ఇద్ద‌రి మ‌ధ్య‌(జ‌గ‌న్‌, ష‌ర్మిల‌) తాను ఎంతో ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు చెప్పారు. అయినా కూడా.. జ‌ర‌గ‌కూడ‌నివి జ‌రుగుతూనే ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇక‌, ఈ ఎపిసోడ్‌లో కొంద‌రు(విజ‌య‌సాయిరెడ్డి, సుబ్బారెడ్డి) జోక్యం చేసుకుని చెబుతున్న‌వ‌న్నీ.. అబ‌ద్ధా లేన‌ని చెప్పారు. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు మాట్లాడుతున్నార‌ని అన్నారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి“ అని విజ‌య‌మ్మ పేర్కొన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని తెలిపారు.

అయితే.. ఈ అబద్ధాల పరంపర ఇంక కొన‌సాగ‌కూడ‌ద‌ని తాను కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇద్ద‌రు పిల్ల‌ల‌కే కాకుండా.. రాష్ట్రానికి కూడా మంచిది కాద‌ని పేర్కొన్నారు. అయితే.. ష‌ర్మిల‌.. వైఎస్ చెప్పిన‌ట్టు.. న‌లుగురు మ‌న‌వ‌ల‌కు స‌మానంగా పంచాల‌ని కోరుతుండగా.. విజ‌య‌మ్మ మాత్రం ఇద్ద‌రి గురించే పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ లేఖ‌తో అయినా.. వివాదాలు ఆగుతాయేమో చూడాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

7 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

11 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

12 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

12 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

12 hours ago