వైఎస్ కుటుంబంలో రాజుకున్న ఆస్తుల వివాదం.. తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు .. దేశవ్యాప్తంగా కూడా చర్చకు వచ్చింది. పది రోజుల పాటు ఈ ఎపిసోడ్ పత్రికల్లోనూ ప్రముఖంగా ముందుకు సాగింది. వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల మధ్య చోటు చేసుకున్న ఈ వివాదం అనేక మలుపులు తిరిగింది. ఈ క్రమంలో అందరి చూపూ విజయమ్మ వైపే పెట్టారు. ఆమె స్పందించాలని కోరుకున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు విజయమ్మ స్పందించారు.
తాజాగా మంగళవారం సాయంత్రం ఆమె వైఎస్సార్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. వైఎస్ ఆశయాల మేరకు.. ఆస్తులను ఇద్దరికీ సమానంగా పంచాలన్నది వైఎస్ ఉద్దేశమని చెప్పారు. అయితే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. తనను కలచివేస్తున్నాయని చెప్పారు. ఇద్దరి మధ్య(జగన్, షర్మిల) తాను ఎంతో ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. అయినా కూడా.. జరగకూడనివి జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ఈ ఎపిసోడ్లో కొందరు(విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి) జోక్యం చేసుకుని చెబుతున్నవన్నీ.. అబద్ధా లేనని చెప్పారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి“ అని విజయమ్మ పేర్కొన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని తెలిపారు.
అయితే.. ఈ అబద్ధాల పరంపర ఇంక కొనసాగకూడదని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఇద్దరు పిల్లలకే కాకుండా.. రాష్ట్రానికి కూడా మంచిది కాదని పేర్కొన్నారు. అయితే.. షర్మిల.. వైఎస్ చెప్పినట్టు.. నలుగురు మనవలకు సమానంగా పంచాలని కోరుతుండగా.. విజయమ్మ మాత్రం ఇద్దరి గురించే పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ లేఖతో అయినా.. వివాదాలు ఆగుతాయేమో చూడాలి.
This post was last modified on October 30, 2024 10:00 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…