వైఎస్ కుటుంబంలో రాజుకున్న ఆస్తుల వివాదం.. తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు .. దేశవ్యాప్తంగా కూడా చర్చకు వచ్చింది. పది రోజుల పాటు ఈ ఎపిసోడ్ పత్రికల్లోనూ ప్రముఖంగా ముందుకు సాగింది. వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల మధ్య చోటు చేసుకున్న ఈ వివాదం అనేక మలుపులు తిరిగింది. ఈ క్రమంలో అందరి చూపూ విజయమ్మ వైపే పెట్టారు. ఆమె స్పందించాలని కోరుకున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు విజయమ్మ స్పందించారు.
తాజాగా మంగళవారం సాయంత్రం ఆమె వైఎస్సార్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. వైఎస్ ఆశయాల మేరకు.. ఆస్తులను ఇద్దరికీ సమానంగా పంచాలన్నది వైఎస్ ఉద్దేశమని చెప్పారు. అయితే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. తనను కలచివేస్తున్నాయని చెప్పారు. ఇద్దరి మధ్య(జగన్, షర్మిల) తాను ఎంతో ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. అయినా కూడా.. జరగకూడనివి జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ఈ ఎపిసోడ్లో కొందరు(విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి) జోక్యం చేసుకుని చెబుతున్నవన్నీ.. అబద్ధా లేనని చెప్పారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి“ అని విజయమ్మ పేర్కొన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని తెలిపారు.
అయితే.. ఈ అబద్ధాల పరంపర ఇంక కొనసాగకూడదని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఇద్దరు పిల్లలకే కాకుండా.. రాష్ట్రానికి కూడా మంచిది కాదని పేర్కొన్నారు. అయితే.. షర్మిల.. వైఎస్ చెప్పినట్టు.. నలుగురు మనవలకు సమానంగా పంచాలని కోరుతుండగా.. విజయమ్మ మాత్రం ఇద్దరి గురించే పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ లేఖతో అయినా.. వివాదాలు ఆగుతాయేమో చూడాలి.
This post was last modified on October 30, 2024 10:00 am
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…