గత పది రోజులుగా షర్మిల వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సాగిన రాజకీయాలు రాష్ట్రాన్ని హోరెత్తించాయి. నిరంతరం.. ఆమె చుట్టూ రాజకీయాలు నడిచాయి. దీనిలో వైసీపీని కొన్ని మీడియా సంస్థలు బూచిగా చూపిస్తే.. వైసీపీ అనుకూల వర్గాలు షర్మిలను తప్పుబట్టాయి. మొత్తంగా వైసీపీ రాజకీయాలు షర్మిల చుట్టూ తిరిగిన నేపథ్యం గత వారం మొత్తం సాగింది. అయితే.. ఇప్పుడు దీనికి బ్రేక్ ఇస్తూ.. జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ నాయకులకు ఆయన తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇక, నుంచి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టం డి.. ప్రజల సమస్యలను ప్రశ్నించండి. వారి తరఫున కూటమి సర్కారును నిలదీయండి.. అని జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు.. షర్మిల వ్యవహారంపై ఇక పార్టీ తరఫున ఎవరూ మా ట్లాడొద్దని కూడా తేల్చి చెప్పడం గమనార్హం. అంటే.. మొత్తంగా వైసీపీ తరఫున ఇక, నుంచి షర్మిల గురించి ఎవరూ మాట్లాడరన్నది స్ఫస్టమైంది.
దీనికి కారణం.. ఇటు వైపు నుంచి మౌనంగా ఉంటే.. షర్మిలకు అవకాశం తగ్గించేందుకు చాన్స్ ఉంటుంద ని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు షర్మిల ఒకటి మాట్లాడితే.. వైసీపీ నాయకులు రెండు మాట్లాడారు. దీంతో ప్రతి విషయానికీ షర్మిల వైపు నుంచి కౌంటర్ పడుతోంది. ఇది వైసీపీకి మేలు చేయకపోగా.. ఇబ్బందులు తెస్తోంది. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు తామే ఆజ్యం పోస్తున్నామా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఒకరకంగా ఆమెవిషయంలో మౌనంగా ఉంటే.. ఇక, మాట్లాడి మాట్లాడి.. ఆమే సైలెంట్ అయిపోతారన్నది వైసీపీ భావనగా ఉంది. ఈ నేపథ్యంలోనే కీలక నాయకులు సహా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తాజాగా జగన్.. ఈ మేరకు ఆదేశాలు పంపించారు. ఇక, నుంచి పార్టీ ప్రజల కోసం పనిచేయాలన్నది ఆయన సూచన. తద్వారా.. ప్రజా సమస్యల నుంచి వైసీపీ దృష్టి మరిలిపోయిందన్న భావనను తుడిచి వేయాలన్న సంకేతాలు కూడా ఇచ్చినట్టు అయింది. దీంతో షర్మిల ఇక నుంచి ఏం మాట్లాడినా.. ఎవరూ స్పందించరన్నది స్పస్టమైంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…