గత పది రోజులుగా షర్మిల వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సాగిన రాజకీయాలు రాష్ట్రాన్ని హోరెత్తించాయి. నిరంతరం.. ఆమె చుట్టూ రాజకీయాలు నడిచాయి. దీనిలో వైసీపీని కొన్ని మీడియా సంస్థలు బూచిగా చూపిస్తే.. వైసీపీ అనుకూల వర్గాలు షర్మిలను తప్పుబట్టాయి. మొత్తంగా వైసీపీ రాజకీయాలు షర్మిల చుట్టూ తిరిగిన నేపథ్యం గత వారం మొత్తం సాగింది. అయితే.. ఇప్పుడు దీనికి బ్రేక్ ఇస్తూ.. జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ నాయకులకు ఆయన తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇక, నుంచి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టం డి.. ప్రజల సమస్యలను ప్రశ్నించండి. వారి తరఫున కూటమి సర్కారును నిలదీయండి.. అని జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు.. షర్మిల వ్యవహారంపై ఇక పార్టీ తరఫున ఎవరూ మా ట్లాడొద్దని కూడా తేల్చి చెప్పడం గమనార్హం. అంటే.. మొత్తంగా వైసీపీ తరఫున ఇక, నుంచి షర్మిల గురించి ఎవరూ మాట్లాడరన్నది స్ఫస్టమైంది.
దీనికి కారణం.. ఇటు వైపు నుంచి మౌనంగా ఉంటే.. షర్మిలకు అవకాశం తగ్గించేందుకు చాన్స్ ఉంటుంద ని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు షర్మిల ఒకటి మాట్లాడితే.. వైసీపీ నాయకులు రెండు మాట్లాడారు. దీంతో ప్రతి విషయానికీ షర్మిల వైపు నుంచి కౌంటర్ పడుతోంది. ఇది వైసీపీకి మేలు చేయకపోగా.. ఇబ్బందులు తెస్తోంది. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు తామే ఆజ్యం పోస్తున్నామా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఒకరకంగా ఆమెవిషయంలో మౌనంగా ఉంటే.. ఇక, మాట్లాడి మాట్లాడి.. ఆమే సైలెంట్ అయిపోతారన్నది వైసీపీ భావనగా ఉంది. ఈ నేపథ్యంలోనే కీలక నాయకులు సహా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తాజాగా జగన్.. ఈ మేరకు ఆదేశాలు పంపించారు. ఇక, నుంచి పార్టీ ప్రజల కోసం పనిచేయాలన్నది ఆయన సూచన. తద్వారా.. ప్రజా సమస్యల నుంచి వైసీపీ దృష్టి మరిలిపోయిందన్న భావనను తుడిచి వేయాలన్న సంకేతాలు కూడా ఇచ్చినట్టు అయింది. దీంతో షర్మిల ఇక నుంచి ఏం మాట్లాడినా.. ఎవరూ స్పందించరన్నది స్పస్టమైంది.
This post was last modified on October 29, 2024 5:23 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…