మీరు చదివింది కరెక్టే. ఇలా అన్నది ఎవరో విదేశీయుడు.. మన రాష్ట్రంతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తో కాదు. నిన్న మొన్నటి వరకు.. వైసీపీ తరఫున బలమైన గళం వినిపించి.. ఎవరినిబడితే .. వారిని నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి.. జగన్ కోసం నిలబడిన వైసీపీసానుభూతి పరుడు.. బోరుగడ్డ అనిల్ కుమార్. ఆయనే స్వయంగా “జగన్ అంటే.. వైఎస్ కొడుకేనా?.. నాకు తెలియదు. మావోళ్లు అప్పుడప్పు డు చెబుతారు. ఇంతకన్నా నన్నేమీ అడగొద్దు!” అని పోలీసులకు నిఖార్సుగా తేల్చి చెప్పారు.
ఇంతకీ బోరు గడ్డ అనిల్ ఎవరు? అంటే.. అమరావతి ప్రాంతానికి ప్రాంతానికి చెందిన వివాదాస్పద యూ ట్యూబర్. సోషల్ మీడియాలో నోరు చేసుకోవడంలోనూ.. జగన్కు అనుకూలంగా వ్యాఖ్యానించడంలోనూ సిద్ధహస్తుడు. ముఖ్యంగా జగన్నుఎవరైనా ఏదైనా అంటే.. ఖస్సున తాచుపాము లేచినట్టు లేచే బోరుగడ్డ.. అనేక వివాదాలకు కేంద్రంగా ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, నారా లోకేష్, రఘురామకృష్ణరాజు సహా వైసీపీ మాజీ నాయకులను కూడా టార్గెట్ చేసుకున్నారు.
అయితే.. ఇప్పుడు ఆయన పాపం పండి.. బాబు ప్రకాష్ అనే వ్యక్తి పెట్టిన కేసులో(50 లక్షలు డిమాండ్ చేశారని) అరెస్టయి.. ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు.. గతంలో ఉన్న ఆరోపణలు, ప్రస్తుత సీఎం , డిప్యూటీ సీఎంలపై గతంలో చేసిన వ్యాఖ్యలు, దూషణల అంశాన్ని కూడా.. ఆయన నుంచి విచారించే ప్రయత్నం చేశారు. “జగన్ పై అభిమానంతోనే ఇలా చేసేవా?” అన్న ప్రశ్నకు.. జగన్ అంటే.. ఎవరు? నాకు తెలీదు. వైఎస్ కొడుకేనా? అని ఎదురు ప్రశ్నించడంతో పోలీసులు అవాక్కయ్యా రు.
ఎన్ని సార్లు గత సంగతులను ప్రశ్నించినా.. అనిల్ ఇలానే సమాధానం చెప్పడం గమనార్హం. ఇక, లాభం లేదని భావించిన పోలీసులు.. కస్టడీ గడువు ముగియడంతో గుంటూరు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. దీంతో మరోసారి ఆయనకు కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ. ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో బోరుగడ్డ అనిల్ నవంబరు 12 వరకు రిమాండ్ లో ఉండనున్నారు.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…