ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా పరుగులు పెడుతోంది. ప్రజారవాణాకు సంబంధించి తాజాగా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఏకంగా 100 ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. గుంటూరు ఆర్టీసీ డిపోకు 100 ఎలక్ట్రిక్ బస్సులను సర్కారు కేటాయించింది. ఈ బస్సులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
రాజధాని అమరావతి ప్రాంతమైన గుంటూరు జిల్లాకు ఎలక్ట్రిక్ బస్సుల ఆవశ్యకతను గుర్తించిన సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి వచ్చే 100 బస్సులను గుంటూరు ఆర్టీసీకి మాత్రమే కేటాయించనున్నారు. ఇందులో 20 బస్సులు అల్ట్రా డీలక్స్ సర్వీసులుగా నడపనున్నారు. మిగతా బస్సులన్నీ పల్లెవెలుగు బస్సుల కింద నడుస్తాయి.
గుంటూరు నుంచి విజయవాడకు 20, గుంటూరు నుంచి పొన్నూరుకు 15, గుంటూరు నుంచి తెనాలికి 30, గుంటూరు నుంచి హైకోర్టుకు 5, గుంటూరు నుంచి సచివాలయానికి 5, గుంటూరు నుంచి చిలకలూరి పేటకు 10, గుంటూరు నుంచి సత్తెనపల్లికి 15 బస్సులు నడపనున్నారు. ప్రస్తుతం 100 కి.మీ కంటే తక్కువ దూరం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. పెదకాకాని బస్టాండ్ వెనుక ఆర్టీసీకి చెందిన 3.5 ఎకరాల్లో ఈ బస్సులకు చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు.
భవిష్యత్తులో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే పల్నాడు బస్టాండులో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధానంగా అమరావతికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో గుంటూరులో కాలుష్యాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించిన ఎక్స్ప్రెస్ బస్సులను పల్లెవెలుగు బస్సులుగా మారుస్తున్నారు. అయితే వీటి నిర్వహణ వ్యయం పెరుగుతుండడంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపింది.
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…