Political News

అమ‌రావ‌తికి మ‌రో గిఫ్ట్‌: 100 ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులు!

ఏపీలో కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక అభివృద్ధితో పాటు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కూడా ప‌రుగులు పెడుతోంది. ప్ర‌జార‌వాణాకు సంబంధించి తాజాగా సీఎం చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంతో ఏకంగా 100 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌స్తున్నాయి. గుంటూరు ఆర్టీసీ డిపోకు 100 ఎలక్ట్రిక్ బస్సులను స‌ర్కారు కేటాయించింది. ఈ బస్సులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంత‌మైన గుంటూరు జిల్లాకు ఎలక్ట్రిక్ బస్సుల ఆవశ్యకతను గుర్తించిన సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి వచ్చే 100 బస్సులను గుంటూరు ఆర్టీసీకి మాత్రమే కేటాయించనున్నారు. ఇందులో 20 బస్సులు అల్ట్రా డీలక్స్ సర్వీసులుగా నడపనున్నారు. మిగతా బస్సులన్నీ పల్లెవెలుగు బస్సుల కింద నడుస్తాయి.

గుంటూరు నుంచి విజయవాడకు 20, గుంటూరు నుంచి పొన్నూరుకు 15, గుంటూరు నుంచి తెనాలికి 30, గుంటూరు నుంచి హైకోర్టుకు 5, గుంటూరు నుంచి సచివాలయానికి 5, గుంటూరు నుంచి చిలకలూరి పేటకు 10, గుంటూరు నుంచి సత్తెనపల్లికి 15 బస్సులు నడపనున్నారు. ప్రస్తుతం 100 కి.మీ కంటే తక్కువ దూరం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. పెదకాకాని బస్టాండ్ వెనుక ఆర్టీసీకి చెందిన 3.5 ఎకరాల్లో ఈ బస్సులకు చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు.

భవిష్యత్తులో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే పల్నాడు బస్టాండులో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధానంగా అమ‌రావ‌తికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వ‌స్తున్న నేప‌థ్యంలో గుంటూరులో కాలుష్యాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించిన ఎక్స్‌ప్రెస్ బస్సులను పల్లెవెలుగు బస్సులుగా మారుస్తున్నారు. అయితే వీటి నిర్వహణ వ్యయం పెరుగుతుండడంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపింది.

This post was last modified on October 29, 2024 3:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

46 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago