Political News

క‌లివిడి కొసం బాబు.. విడివిడి కోసం త‌మ్ముళ్లు..!

కూటమి పార్టీల నాయ‌కులు క‌లివిడిగా ఉండాల‌ని.. నాయ‌కులు క‌లిసిమెలిసి ప‌నిచేయాల‌ని సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌దే ప‌దే చెబుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో క‌లివిడిత‌నం లేక‌పోతే.. ఇబ్బందులు వ‌స్తాయ‌ని కూడా అంటున్నారు. ఎక్క‌డ ఏవేదిక ఎక్కి.. రాజ‌కీయాల గురించి మాట్లాడాల్సి వ‌చ్చినా.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. దీనికి కార‌ణం.. క్షేత్ర‌స్థాయిలో రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి లేక‌పోవ‌డమే. మ‌రీ ముఖ్యంగా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండు మాసాల త‌ర్వాత‌.. ఈ త‌ర‌హా ప‌రిస్తితి మ‌రింత పెరిగింది.

తాజాగా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన దెందులూరు నియోజ‌వ‌ర్గంలో టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య ఒక‌రక‌మైన ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి టీడీపీ నేత సైదు గోవ‌ర్ధ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇది రాజ‌కీయంగా ర‌గ‌డకు దారి తీసింది. స్థానిక నాయ‌కులు స‌ర్ది చెప్పినా గోవ‌ర్ధ‌న్ వినిపించుకోలేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ అవే వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇప్పుడు జ‌న‌సేన నాయ‌కులు నిర‌స‌న‌కు దిగారు. తక్షణమే టీడీపీ నేతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు.

ఇక‌, ఒంగోలులోనూ టీడీపీ నాయ‌కులు.. జ‌న‌సేన‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే వైసీపీ నేత‌లను పార్టీలో ఎలా చేర్చుకుంటారని వారు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి ప్ర‌తిగా.. జ‌న‌సేన నాయ‌కులు.. మ‌రో స్టెప్ ముందుకు వేసి.. మీరు తీసుకున్న‌నాయ‌కుల గురించి మాకు చెబుతున్నారా? అంటూ.. నిల‌దీస్తున్నారు. దీంతో క‌లివిడిపోయి.. విడివిడి రాజ‌కీయ‌మే ఇక్క‌డ కూడా ద‌ర్శ‌న మిచ్చింది. మ‌రీ చిత్రంగా అనంత‌పురం అర్బ‌న్ రాజ‌కీయం త‌యారైంది. ఇక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, టికెట్ త్యాగం చేసిన నాయ‌కుడికి మ‌ధ్య కూడా మ‌రో స‌రికొత్త ర‌గ‌డ తెర‌మీదికి వ‌చ్చింది.

త‌న హ‌యాంలో ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌లేక‌పోయాన‌ని..ఇప్పుడు వాటిని స‌రిచేయాల‌ని మాజీ ఎమ్మెల్యే అధికారుల‌ను కోరుతున్నారు. కానీ, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఆయా ప‌నులు వ‌ద్ద‌న్న‌ట్టుగా అధికారులు తేల్చి చెబుతున్నారు. అంటే.. ఇక్క‌డ టీడీపీలోనే రెండు కుంప‌ట్లు త‌యార‌య్యాయి. మ‌రోవైపు.. ఇదే జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రంలో బీజేపీ పై పైచేయి కోసం.. జ‌న‌సేన‌, ఈ పార్టీపై పైచేయి కోసం.. టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో అధికారులు న‌లిగిపోతున్నారు. ఎవ‌రి మాట వినాలో తెలియక‌.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇలా.. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి క‌లివిడి పోయి.. విడివిడి అనే మాట వినిపించేలా చేస్తోంది. చంద్ర‌బాబు త‌క్ష‌ణం వారిని స‌రిచేయాల్సిన అవ‌స‌రం ఉందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 29, 2024 9:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

14 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

4 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

5 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

7 hours ago