Political News

క‌లివిడి కొసం బాబు.. విడివిడి కోసం త‌మ్ముళ్లు..!

కూటమి పార్టీల నాయ‌కులు క‌లివిడిగా ఉండాల‌ని.. నాయ‌కులు క‌లిసిమెలిసి ప‌నిచేయాల‌ని సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌దే ప‌దే చెబుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో క‌లివిడిత‌నం లేక‌పోతే.. ఇబ్బందులు వ‌స్తాయ‌ని కూడా అంటున్నారు. ఎక్క‌డ ఏవేదిక ఎక్కి.. రాజ‌కీయాల గురించి మాట్లాడాల్సి వ‌చ్చినా.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. దీనికి కార‌ణం.. క్షేత్ర‌స్థాయిలో రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి లేక‌పోవ‌డమే. మ‌రీ ముఖ్యంగా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండు మాసాల త‌ర్వాత‌.. ఈ త‌ర‌హా ప‌రిస్తితి మ‌రింత పెరిగింది.

తాజాగా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన దెందులూరు నియోజ‌వ‌ర్గంలో టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య ఒక‌రక‌మైన ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి టీడీపీ నేత సైదు గోవ‌ర్ధ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇది రాజ‌కీయంగా ర‌గ‌డకు దారి తీసింది. స్థానిక నాయ‌కులు స‌ర్ది చెప్పినా గోవ‌ర్ధ‌న్ వినిపించుకోలేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ అవే వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇప్పుడు జ‌న‌సేన నాయ‌కులు నిర‌స‌న‌కు దిగారు. తక్షణమే టీడీపీ నేతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు.

ఇక‌, ఒంగోలులోనూ టీడీపీ నాయ‌కులు.. జ‌న‌సేన‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే వైసీపీ నేత‌లను పార్టీలో ఎలా చేర్చుకుంటారని వారు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి ప్ర‌తిగా.. జ‌న‌సేన నాయ‌కులు.. మ‌రో స్టెప్ ముందుకు వేసి.. మీరు తీసుకున్న‌నాయ‌కుల గురించి మాకు చెబుతున్నారా? అంటూ.. నిల‌దీస్తున్నారు. దీంతో క‌లివిడిపోయి.. విడివిడి రాజ‌కీయ‌మే ఇక్క‌డ కూడా ద‌ర్శ‌న మిచ్చింది. మ‌రీ చిత్రంగా అనంత‌పురం అర్బ‌న్ రాజ‌కీయం త‌యారైంది. ఇక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, టికెట్ త్యాగం చేసిన నాయ‌కుడికి మ‌ధ్య కూడా మ‌రో స‌రికొత్త ర‌గ‌డ తెర‌మీదికి వ‌చ్చింది.

త‌న హ‌యాంలో ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌లేక‌పోయాన‌ని..ఇప్పుడు వాటిని స‌రిచేయాల‌ని మాజీ ఎమ్మెల్యే అధికారుల‌ను కోరుతున్నారు. కానీ, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఆయా ప‌నులు వ‌ద్ద‌న్న‌ట్టుగా అధికారులు తేల్చి చెబుతున్నారు. అంటే.. ఇక్క‌డ టీడీపీలోనే రెండు కుంప‌ట్లు త‌యార‌య్యాయి. మ‌రోవైపు.. ఇదే జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రంలో బీజేపీ పై పైచేయి కోసం.. జ‌న‌సేన‌, ఈ పార్టీపై పైచేయి కోసం.. టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో అధికారులు న‌లిగిపోతున్నారు. ఎవ‌రి మాట వినాలో తెలియక‌.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇలా.. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి క‌లివిడి పోయి.. విడివిడి అనే మాట వినిపించేలా చేస్తోంది. చంద్ర‌బాబు త‌క్ష‌ణం వారిని స‌రిచేయాల్సిన అవ‌స‌రం ఉందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago