నిన్న అక్కినేని నాగేశ్వరరావు స్మారక జాతీయ అవార్డు ప్రధానం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అమితాబ్ బచ్చన్ చేతుల మీద మెగాస్టార్ చిరంజీవికి ఈ పురస్కారం అందజేశారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ తో పాటు మొత్తం కుటుంబ సభ్యులంతా హాజరు కాగా పలువురు ప్రముఖులు ఆకర్షణగా నిలిచారు. రామ్ చరణ్, వెంకటేష్, నాని, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, నాగ్ అశ్విన్, రాజేంద్రప్రసాద్, అశ్వినిదత్, రాఘవేంద్రరావు, బుచ్చిబాబు, బ్రహ్మానందం, కీరవాణి, రమా రాజమౌళి తదితరులు హాజరు కాగా మూడు గంటల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోయింది.
చిరు తల్లి అంజనాదేవి కాళ్లకు బిగ్ బి నమస్కారం చేయడంతో మొదలుపెట్టి అంత పెద్ద బాలీవుడ్ బాద్షా ఇకపై నన్ను తెలుగు పరిశ్రమలో భాగంగా చేసుకోండి అంటూ పిలుపు ఇవ్వడం దాకా ఎన్నో మెరుపులు చోటు చేసుకున్నాయి. చిరంజీవి తన తల్లి ఏఎన్ఆర్ కు ఎంత పెద్ద అభిమానో ఒక ఉదాహరణ పంచుకున్నారు. తాను గర్భంలో ఉన్నప్పుడు రోజులు మారాయి రిలీజయ్యిందని, చూడాలనే కోరిక ఆవిడ వెలిబుచ్చితే రిస్క్ అనిపించినా నాన్న జట్కా, బస్సు ద్వారా పాలకొల్లు తీసుకెళ్లి మరీ చూపించిన జ్ఞాపకాన్ని స్టేజి మీద పంచుకున్నారు. అక్కినేని గొప్పదనాన్ని తన మాటల్లో వినిపించి ఆకట్టుకున్నారు.
నాగార్జున మాట్లాడుతూ కెరీర్ మొదలుపెట్టే ముందు ఓ సందర్భంలో స్టూడియోలో చిరంజీవి సినిమా షూటింగ్ కి నాన్న చెప్పి మరీ పంపించారని, అక్కడ అయనతో పాటు రాధ చేస్తున్న వాన పాట డాన్సు చూశాక వేరే దారి చూసుకుందామనిపించిందని అప్పటి ఫ్లాష్ బ్యాక్ నెమరు వేసుకున్నారు. ఏబిసి అఫ్ ఇండియన్ సినిమా అంటూ అమితాబ్ బచ్చన్, చిరంజీవికి కొత్త నిర్వచనం ఇవ్వడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత శతజయంతి సందర్భంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుని పునరుద్ధరించిన అక్కినేని కుటుంబం ఇకపై దీన్ని కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.
This post was last modified on October 29, 2024 10:27 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…