నిన్న అక్కినేని నాగేశ్వరరావు స్మారక జాతీయ అవార్డు ప్రధానం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అమితాబ్ బచ్చన్ చేతుల మీద మెగాస్టార్ చిరంజీవికి ఈ పురస్కారం అందజేశారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ తో పాటు మొత్తం కుటుంబ సభ్యులంతా హాజరు కాగా పలువురు ప్రముఖులు ఆకర్షణగా నిలిచారు. రామ్ చరణ్, వెంకటేష్, నాని, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, నాగ్ అశ్విన్, రాజేంద్రప్రసాద్, అశ్వినిదత్, రాఘవేంద్రరావు, బుచ్చిబాబు, బ్రహ్మానందం, కీరవాణి, రమా రాజమౌళి తదితరులు హాజరు కాగా మూడు గంటల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోయింది.
చిరు తల్లి అంజనాదేవి కాళ్లకు బిగ్ బి నమస్కారం చేయడంతో మొదలుపెట్టి అంత పెద్ద బాలీవుడ్ బాద్షా ఇకపై నన్ను తెలుగు పరిశ్రమలో భాగంగా చేసుకోండి అంటూ పిలుపు ఇవ్వడం దాకా ఎన్నో మెరుపులు చోటు చేసుకున్నాయి. చిరంజీవి తన తల్లి ఏఎన్ఆర్ కు ఎంత పెద్ద అభిమానో ఒక ఉదాహరణ పంచుకున్నారు. తాను గర్భంలో ఉన్నప్పుడు రోజులు మారాయి రిలీజయ్యిందని, చూడాలనే కోరిక ఆవిడ వెలిబుచ్చితే రిస్క్ అనిపించినా నాన్న జట్కా, బస్సు ద్వారా పాలకొల్లు తీసుకెళ్లి మరీ చూపించిన జ్ఞాపకాన్ని స్టేజి మీద పంచుకున్నారు. అక్కినేని గొప్పదనాన్ని తన మాటల్లో వినిపించి ఆకట్టుకున్నారు.
నాగార్జున మాట్లాడుతూ కెరీర్ మొదలుపెట్టే ముందు ఓ సందర్భంలో స్టూడియోలో చిరంజీవి సినిమా షూటింగ్ కి నాన్న చెప్పి మరీ పంపించారని, అక్కడ అయనతో పాటు రాధ చేస్తున్న వాన పాట డాన్సు చూశాక వేరే దారి చూసుకుందామనిపించిందని అప్పటి ఫ్లాష్ బ్యాక్ నెమరు వేసుకున్నారు. ఏబిసి అఫ్ ఇండియన్ సినిమా అంటూ అమితాబ్ బచ్చన్, చిరంజీవికి కొత్త నిర్వచనం ఇవ్వడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత శతజయంతి సందర్భంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుని పునరుద్ధరించిన అక్కినేని కుటుంబం ఇకపై దీన్ని కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.
This post was last modified on October 29, 2024 10:27 am
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…