Political News

‘క‌డ‌ప’ క‌ల్లోలం.. జ‌గ‌న్ స‌రిచేస్తారా?

ఎక్క‌డో ఏదో జిల్లాలో రాజ‌కీయంగా ఇబ్బంది వ‌స్తే.. వేరే సంగ‌తి. కానీ, సొంత జిల్లా.. పైగా.. పార్టీ ప‌రంగా నాయ‌క‌త్వం ప‌రంగా కూడా.. బ‌లంగా ఉన్న జిల్లాలో ఇప్పుడు కూసాలు క‌దిలిపోతున్న ప‌రిస్థితి ఏర్ప‌డితే.. ఎవ‌రైనా ఏం చేస్తారు? అక్క‌డే తిష్ట వేస్తారు. ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా అదే చేస్తున్నారు. త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లో మంగ‌ళ‌వారం నుంచి నాలుగు రోజుల పాటు బ‌స చేయ‌నున్నారు. ఇదేదో.. స‌ర‌దా కోసం.. కాల‌క్షేపం కోసం కాదు. చాలా వ్యూహాత్మ‌క విష‌యాల‌కోస‌మే ఆయ‌న క‌డ‌ప‌లో బ‌స చేస్తున్నార‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌.

1) క‌డ‌ప‌లోని బ‌ద్వేల్ స‌హా.. క‌డ‌ప‌, క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కించుకుంది. కానీ, ఇప్పుడు వాటిలో క‌మ‌లాపురం కూట‌మి పార్టీల వ‌శ‌మైంది. ఈ ప‌రిణామాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా.. ఫ‌లితం అయితే ద‌క్క‌లేదు. ఇక‌, బ‌ద్వేల్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధ‌.. జ‌న‌సేన వైపు చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మావేశానికి కూడా సుధ గైర్హాజ‌ర‌య్యారు. దీంతో ఇప్పుడు ఆమెనుకూడా లైన్‌లో పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అదేవిధంగా స్థానిక సంస్థ‌ల‌ను పార్టీకి అనుకూలంగా మార్చుకునే బాధ్య‌త కూడా ఏర్ప‌డింది.

2) ష‌ర్మిల వివాదం అనంతరం.. స్థానికంగా ఉన్న వైఎస్ క‌టుంబం ఎటు నిల‌బ‌డాల‌న్న విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న వ‌చ్చింది. కొంద‌రు మాత్ర‌మే జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉన్నారు. మ‌రికొంద‌రు త‌ట‌స్థంగా ఉన్నారు ఇలాంటి స‌మ‌యంలో త‌ట‌స్థుల‌ను కూడా.. త‌న‌వైపు తిప్పుకొనేందుకు జ‌గ‌న్ ఈ క‌డ‌ప టూర్ పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం బెంగ‌ళూరు నుంచి నేరుగా ఆయ‌న క‌డ‌ప‌కు చేరుకుంటారు. వైఎస్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన అనంత‌రం.. స్థానిక నాయ‌కుల‌తో భేటీ అవుతారు. పార్టీ ప‌రిస్తితిపై చ‌ర్చించ‌నున్నారు.

3) మూడో కీల‌క విష‌యం.. ఎన్నిక‌ల అనంత‌రం.. ఒకే ఒక్కసారి జ‌గ‌న్‌.. పులివెందుల‌లో ప‌ర్య‌టించారు. ఆ త‌ర్వాత‌.. త‌న సొంత ప‌నుల‌పై వెళ్లారే త‌ప్ప‌. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. నాలుగు రోజుల క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో రెండు రోజుల పాటు.. పులివెందుల ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ అందుబాటులో ఉంటారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. అదేవిధంగా బ‌ద్వేల్‌లో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని కూడా జ‌గ‌న్ మ‌రోసారి ప‌రామ‌ర్శించ‌నున్నారు. దీపావ‌ళి పండుగ‌ను తొలిసారి ప‌దేళ్ల త‌ర్వాత‌.. పులివెందుల‌లో జ‌గ‌న్ నిర్వ‌హించుకుంటున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

53 minutes ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

2 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

3 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

3 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

4 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

4 hours ago