Political News

‘క‌డ‌ప’ క‌ల్లోలం.. జ‌గ‌న్ స‌రిచేస్తారా?

ఎక్క‌డో ఏదో జిల్లాలో రాజ‌కీయంగా ఇబ్బంది వ‌స్తే.. వేరే సంగ‌తి. కానీ, సొంత జిల్లా.. పైగా.. పార్టీ ప‌రంగా నాయ‌క‌త్వం ప‌రంగా కూడా.. బ‌లంగా ఉన్న జిల్లాలో ఇప్పుడు కూసాలు క‌దిలిపోతున్న ప‌రిస్థితి ఏర్ప‌డితే.. ఎవ‌రైనా ఏం చేస్తారు? అక్క‌డే తిష్ట వేస్తారు. ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా అదే చేస్తున్నారు. త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లో మంగ‌ళ‌వారం నుంచి నాలుగు రోజుల పాటు బ‌స చేయ‌నున్నారు. ఇదేదో.. స‌ర‌దా కోసం.. కాల‌క్షేపం కోసం కాదు. చాలా వ్యూహాత్మ‌క విష‌యాల‌కోస‌మే ఆయ‌న క‌డ‌ప‌లో బ‌స చేస్తున్నార‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌.

1) క‌డ‌ప‌లోని బ‌ద్వేల్ స‌హా.. క‌డ‌ప‌, క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కించుకుంది. కానీ, ఇప్పుడు వాటిలో క‌మ‌లాపురం కూట‌మి పార్టీల వ‌శ‌మైంది. ఈ ప‌రిణామాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా.. ఫ‌లితం అయితే ద‌క్క‌లేదు. ఇక‌, బ‌ద్వేల్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధ‌.. జ‌న‌సేన వైపు చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మావేశానికి కూడా సుధ గైర్హాజ‌ర‌య్యారు. దీంతో ఇప్పుడు ఆమెనుకూడా లైన్‌లో పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అదేవిధంగా స్థానిక సంస్థ‌ల‌ను పార్టీకి అనుకూలంగా మార్చుకునే బాధ్య‌త కూడా ఏర్ప‌డింది.

2) ష‌ర్మిల వివాదం అనంతరం.. స్థానికంగా ఉన్న వైఎస్ క‌టుంబం ఎటు నిల‌బ‌డాల‌న్న విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న వ‌చ్చింది. కొంద‌రు మాత్ర‌మే జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉన్నారు. మ‌రికొంద‌రు త‌ట‌స్థంగా ఉన్నారు ఇలాంటి స‌మ‌యంలో త‌ట‌స్థుల‌ను కూడా.. త‌న‌వైపు తిప్పుకొనేందుకు జ‌గ‌న్ ఈ క‌డ‌ప టూర్ పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం బెంగ‌ళూరు నుంచి నేరుగా ఆయ‌న క‌డ‌ప‌కు చేరుకుంటారు. వైఎస్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన అనంత‌రం.. స్థానిక నాయ‌కుల‌తో భేటీ అవుతారు. పార్టీ ప‌రిస్తితిపై చ‌ర్చించ‌నున్నారు.

3) మూడో కీల‌క విష‌యం.. ఎన్నిక‌ల అనంత‌రం.. ఒకే ఒక్కసారి జ‌గ‌న్‌.. పులివెందుల‌లో ప‌ర్య‌టించారు. ఆ త‌ర్వాత‌.. త‌న సొంత ప‌నుల‌పై వెళ్లారే త‌ప్ప‌. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. నాలుగు రోజుల క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో రెండు రోజుల పాటు.. పులివెందుల ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ అందుబాటులో ఉంటారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. అదేవిధంగా బ‌ద్వేల్‌లో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని కూడా జ‌గ‌న్ మ‌రోసారి ప‌రామ‌ర్శించ‌నున్నారు. దీపావ‌ళి పండుగ‌ను తొలిసారి ప‌దేళ్ల త‌ర్వాత‌.. పులివెందుల‌లో జ‌గ‌న్ నిర్వ‌హించుకుంటున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Satya

Recent Posts

తెలంగాణలో జనసేన సింగిల్ గా గర్జిస్తుందా?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…

21 minutes ago

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

5 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

8 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

10 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

10 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

10 hours ago